మార్ఫింగ్ చేసిన నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తామంటూ ఓ యువతిని బెదిరించి కిలేడీ దంపతులు.. బాధితురాలి నుంచి రూ.2.50 కోట్ల మేరకు దోచుకున్నారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ మోసం కేసు వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం మేరకు.. ఈస్ట్ గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన యువతి హైదరాబాద్ నగరంలో ఓ టెక్కీగా పని చేస్తున్నారు. హాస్టల్లో ఆమెకు గుంటూరుకు చెందిన కాజ అనూషాదేవి పరిచయమైంది. కొన్నాళ్లకు అనూషకు సాయికుమార్ వివాహమైంది. ఆ తర్వాత కూడా వారి మధ్య స్నేహం కొనసాగింది.
అయితే, స్నేహితురాలి నుంచి డబ్బులు దోచుకోవాలని అనూష, ఆమె భర్త సాయికుమార్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఆమె నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఆమె నిరాకరించడంతో మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫొటోలను ఇంటర్నెట్లో పెడతామని బెదిరింపులకు దిగారు. దీంతో భయపడిపోయిన యువతి తన వద్దనున్న డబ్బుతోపాటు బంధువుల ఖాతా నుంచి పలు దఫాలుగా రూ.2,53,76,000 నగదును వారికి బదిలీ చేసింది.