బాసర | నిర్మల్ (నిర్మల్) జిల్లా బాసర (బాసర)లో విషాదం చోటు చేసుకుంది. గోదావరి (గోదావరి) నదిలో స్నానానికి వెళ్లి నలుగురు మృతి చెందారు. హైదరాబాద్ (హైదరాబాద్)లోని చింతల్కు చెందిన 18 మంది కుటుంబ సభ్యులు బాసర క్షేత్రానికి వచ్చారు.
ఆదివారం ఉదయం గోదావరిలో తేలిన ఇసుక మేటల వద్ద స్నానాలు చేస్తుండగా.. ఐదుగురు యువకులు నీట మునిగిపోయారు. ఇందులో నలుగురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మరొకరి ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో విషాదం. మృతులు రాకేశ్, వినోద్, రుతిక్, మదన్గా పేర్కొన్నారు. భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.