ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Megha Engineering :ఈ-మెయిల్ లో అక్షరం మార్పు..రూ.5 కోట్ల 47 లక్షలు మోసం!

Megha Engineering :ఈ-మెయిల్ లో అక్షరం మార్పు..రూ.5 కోట్ల 47 లక్షలు మోసం!
ADVERTISEMENT

మేఘా ఇంజనీరింగ్ కంపెనీ గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం చాలా గొప్పగా చెప్పుకుంటారు. కొన్నివేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తూంటారు.కొన్ని వందల కోట్లు రాజకీయపార్టీలకు విరాళాలిస్తూంటారు. రాజకీయ నేతలకు లంచాలు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే వీరు కూడా మోసపోయారు. అదీ కూడా సైబర్ నేరగాళ్ల చేతుల్లో,

 

మేఘా కంపెనీ యూరప్ లోని ఓ కంపెనీతో లావాదేవీలు నిర్వహిస్తుంది..ఓ కంపెనీ చేసినసేవలకో.. పంపించిన సామాగ్రికో .. ఐదున్నర కోట్లు డబ్బులు చెల్లించారు. ఓ నెల తర్వాత మళ్లీ అదే కంపెనీ నుంచి డబ్బులేవి అనే మెసెజ్ వచ్చింది. అదేంటి ఇచ్చాం కదా అని ఆరా తీస్తే వారికి షాక్ తగిలినట్లయింది. వీరి ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరస్తులు.. ఆ కంపెనీ పేరుతో ఓ బినామీ బ్యాంక్ అకౌంట్ పంపి….దానికి బదిలీ చేయించున్నారు. క్రాస్ చెక్ చేసుకోవడంలో విఫలం అయిన కంపెనీ సిబ్బంది విషయం బయటపడే సరికి లబోదిబోమన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మనం ఏం చేస్తున్నాం.. వేటిపై ఇంట్రస్ట్ చూపిస్తున్నాం అనే దానిపై కూడా అంచనా వేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వాటిని బట్టే అమాయికులను బుట్టలో వేసి నిండా ముంచేస్తున్నారు. ఒకటా రెండా ఎన్నెన్నో కేసులు. కోట్లలో నష్టపోతున్నారు జనం. కొత్త కొత్త విధానాల్లో అమాయిక జనాలను నిండా ముంచేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. బయటపడే దాకా సైబర్ నేరం జరిగిందనే విషయం, తాము మోసపోతున్నాం అనేది కూడా జనం తెలుసుకోలేకపోతున్నారు.

 

తెలిసాక ఏమి చేయలేని పరిస్థితి. సాధారణ నేరాలకంటే.. సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడం ఆందోళన పెంచుతోంది. చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి బడా పారిశ్రామిక వేత్తలు, కంపెనీల దాకా సైబర్ నేరగాళ్లు ఎవరిని వదలడం లేదు. స్మార్ట్ ఫోన్లతోనే సింపుల్‌గా పనికానిచ్చేస్తూ.. ఏటా వందల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు.

 

దేశంలో సైబర్ క్రైమ్ పెద్ద సవాల్‌గా మారింది. బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ఏ చిన్న అవకాశం ఉన్నా సరే దోపిడీకి పాల్పడుతున్నారు. చదువుకున్న వాళ్లు, చదువురాని వాళ్లు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారు తెలుగు రాష్ట్రాల్లో చిక్కుకుంటున్నారు.

 

గతంలో ఈ తరహా మోసాలు ఎక్కువగా ఉండేవి. ఈ మధ్యకాలంలో వేరే రకంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. కానీ పాత పద్దతిలోనే సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నట్లు ఈ కేసులో బయటపడింది. తాజాగా సైబర్ నేరగాళ్లు మేఘా కంపెనీని కూడా వదల్లేదు. నకిలీ మెయిల్‌తో 5 కోట్ల 47 లక్షలు కొట్టేశారు. దాందో మేఘా కంపెనీ ప్రతినిధులు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేశారు. మేఘా కంపెనీకి అవసరమైన ఎక్విప్‌మెంట్ కోసం.. నెదర్లాండ్స్‌కి చెందిన కంపెనీకి ఆర్డర్స్ ఇచ్చారు.

 

కంపెనీకి ఆన్‌లైన్‌ ద్వారా డబ్బుల చెల్లింపులు చేశారు. చెల్లింపుల తర్వాత ప్రతిసారి కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చేది. ఆ కంపెనీ లాగానే ఈ-మెయిల్ లో అక్షరం మార్చి మెయిల్ చేశారు కేటుగాళ్లు. అకౌంట్‌ పనిచేయడం లేదు మరో ఖాతాకు పంపించాలని మేఘా కంపెనీకి మెయిల్ చేశారు.అదే నిజమని నమ్మి రూ.5 కోట్ల 47 లక్షలు రెండు విడతలుగా చెల్లించారు. మళ్లీ ఆ కంపెనీ నుండి మెసేజ్ రావడంతో మోసపోయామని గ్రహించి మేఘా ఇంజనీరింగ్ మేనేజర్ శ్రీహర్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలను అణ్వేషిస్తూ.. అమాయికుల నుంచి లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. సైబర్ నేరాలపట్ల ప్రతిక్షణం అప్పమత్తంగా ఉండాలని రాష్ట్ర పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

Tags: #cyberattack #cybercrime #MeghaEngineeringComp #Meil #MeghaEngineering #MeghaEng #InternationalNews #Hyderabad #TeluguNews #Telangana
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Balakrishna :త‌మ‌న్ త‌న‌కు త‌మ్ముడితో స‌మానం అన్న బాలయ్య

Next Post

Modi :ట్రంప్ పన్నుల భారం నుంచి భారత్ తప్పించుకుందా?

Related Posts

Sabarimala
Big Story

Sabarimala:శబరిమల మకరజ్యోతి దర్శనం – అయ్యప్ప స్వామి దివ్యానుభూతి

APLiquorPrices
Andhra Pradesh

APLiquorPrices:మద్యం ధరలు పెంచిన ఏపీ ప్రభుత్వం

GodavariWater
Andhra Pradesh

GodavariWater:వివాదాలు వద్దు–ఐక్యతే ముద్దు: పోలవరం–నల్లమల సాగర్‌పై జల వనరుల మంత్రి నిమ్మల

ap
Andhra Pradesh

AP :సంక్రాంతి కానుక.. ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు క్లియర్

Telangana
Big Story

Telangana:అతిభద్రతా పాలనా ఉత్సాహమా? ప్రజల ఖాతాలపై కన్నేసిన ప్రభుత్వ ఆలోచనలు

Telangana
Big Story

Telangana:సినిమా టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం – ప్రభుత్వ మెమోలపై తీవ్ర వ్యాఖ్యలు

Next Post
Modi :ట్రంప్ పన్నుల భారం నుంచి భారత్ తప్పించుకుందా?

Modi :ట్రంప్ పన్నుల భారం నుంచి భారత్ తప్పించుకుందా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

RTCAccident,

RTCAccident:పండుగ వేళ విషాదం.. ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం

Sabarimala

Sabarimala:శబరిమల మకరజ్యోతి దర్శనం – అయ్యప్ప స్వామి దివ్యానుభూతి

Ashika Ranganath Hot Bikini Treat

Ashika Ranganath Hot Bikini Treat | గ్లామర్, ఫిట్‌నెస్‌తో సోషల్ మీడియా షేక్

Bhartha Mahashayulaki Vignyapthi Movie Review

Bhartha Mahashayulaki Vignyapthi Movie Review | భార్యాభర్తల బంధంపై హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా

Recent News

RTCAccident,

RTCAccident:పండుగ వేళ విషాదం.. ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం

Sabarimala

Sabarimala:శబరిమల మకరజ్యోతి దర్శనం – అయ్యప్ప స్వామి దివ్యానుభూతి

Ashika Ranganath Hot Bikini Treat

Ashika Ranganath Hot Bikini Treat | గ్లామర్, ఫిట్‌నెస్‌తో సోషల్ మీడియా షేక్

Bhartha Mahashayulaki Vignyapthi Movie Review

Bhartha Mahashayulaki Vignyapthi Movie Review | భార్యాభర్తల బంధంపై హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info