ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Dokiparru Mahakshetram: కన్నుల పండుగగా శ్రీ శ్రీనివాస కళ్యాణం

Dokiparru Mahakshetram: కన్నుల పండుగగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
ADVERTISEMENT

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు మహాక్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విశేష కళ్యాణం శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. మహాక్షేత్రం దశమ వార్షికోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ప్రతి ఏడాది మాదిరిగానే దేవదేవుని విశేష కల్యాణాన్ని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పీ వీ కృష్ణారెడ్డి, సుధా రెడ్డి దంపతుల పర్యవేక్షణలో నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త సుధారెడ్డితో పాటు కొమ్మారెడ్డి బాపురెడ్డి, విజయభాస్కరమ్మ, పీ నాగిరెడ్డి, ప్రసన్న దంపతులు పీటల మీద కూర్చొని శ్రీనివాసుని కల్యాణాన్ని జరిపించారు.

కన్నుల పండువగా జరిగిన ఈ కళ్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై తిలకించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించి దేవదేవుడి పట్ల తమ విశ్వాసాన్ని భక్తి భావాన్ని చాటుకున్నారు. వేద పండితులు మంత్రోచ్ఛారణ తో పాటు కళ్యాణం విశిష్టతను, దాని వల్ల కలిగే మంచిని అర్ధాలతో సహా వివరించారు. శ్రీ వేంకటేశ్వరుని కళ్యాణం నిర్వహణకు మహాక్షేత్రాన్ని, కళ్యాణ మండపాన్ని రకరకాల రంగుల పుష్పాలతో అలంకరించారు. ఆడపిల్లలు లేని వారు లక్ష్మి, పద్మావతి దేవిలను తమ కన్యకా రత్నాలుగా భావించి దివ్యశ్రీ వైఖానస భగవచ్చాస్త్ర మార్గానుసారంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం నిర్వహించటం వల్ల కన్యాదానం చేసినంత పుణ్యం లభిస్తుందని వేద పండితులు వివరించారు.

చక్రస్నానం
శ్రీ వేంకటేశ్వరుని కళ్యాణానికి ముందు దేవతామూర్తులకు వేదపండితులు చక్రస్నానం జరిపించారు. బుధవారం ఉదయం నిత్య అర్చన, తోమాల సేవ అనంతరం ఉత్సవ మూర్తులను స్నపన మండపం వద్దకు తోడ్కొని వచ్చి పాలు, పెరుగు, తేనే, సుగంధ ద్రవ్యాలతో, అభిషేకం, చూర్ణ, గంధోత్సవం నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేటిలో చక్రస్నానం జరిపించారు. చక్రస్నానం సందర్భంగా కోనేటిని ప్రత్యేకంగా పుష్పాలతో అలంకరించారు.

శ్రీవారి చక్రస్నానం ఆచరించిన తరువాత కోనేటిలో స్నానమాచరించిన, దర్శించినా, కోనేటి నీటిని చల్లుకున్నా వంద అశ్వమేధాల శక్తీ వస్తుందని వేదపండితులు తెలిపారు. ప్రతిరోజు స్వామి వారి పుష్కరిణిలో స్నానమాచరిస్తే నదీ పుష్కరాల సమయంలో పుణ్య స్నానం చేసినంత ఫలితం ఉంటుందని తెలిపారు. శ్రీ వారిచక్రస్నానం, కళ్యాణం లో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త సుధా రెడ్డి, కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ పీ. నాగిరెడ్డి, ప్రసన్న దంపతులు, వారి కుటుంబసభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

శ్రీవారి పాదసేవకు ప్రత్యేకంగా
భక్తులు శ్రీ వారి పాద సేవ చేసుకునేందుకు ప్రత్యేకంగా ధర్మకర్తలు ఏర్పాట్లు చేశారు. మహాక్షేత్రాన్ని సందర్శించే భక్తులు దేవదేవుడికి కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటుంటారు. వారు సమర్పించిన కొబ్బరి కాయల నుంచి వచ్చే జలం శ్రీ వేంకటేశ్వరుడి పాదాలు అభిషేకించేలా ఏర్పాటు చేశారు. భక్తులు దీపారాధన చేసుకుని తమకు జ్ఞానం ప్రసాదించాలని వేసుకునేందుకు అనువుగా ఆలయ ఆగ్నేయ భాగంలో దీపారాధనకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన జ్యోతి ఉదయం నుంచి సాయంత్రం వరకు వెలుగుతూనే ఉంటుంది. అక్కడ భక్తులు దీపారాధన చేసుకోవచ్చు.

విశేష మండపాల ప్రారంభం
డోకిపర్రు మహాక్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ మాడ వీధుల్లో విశేష మండపాలను ఆలయ ధర్మకర్త సుధా రెడ్డి ప్రారంభించారు. దక్షిణ రాజగోపురంలో కృతయుగాన్ని తెలిపే నరసింహ స్వామితో కూడిన ప్రహ్లాద సహిత శ్రీ నరసింహస్వామి ప్రణవానందా మండపం ప్రారంభించారు. పశ్చిమ రాజగోపురం త్రేతాయుగం దైవం రామచంద్రుని కొలిచేలా శ్రీ మానసానంద మండపం, ఉత్తర భాగాన ద్వాపర యుగాన్ని సూచించే శ్రీ కృష్ణ పరమాత్మతో కూడిన శ్రీకృష్ణసుధా మండపం, తూర్పు భాగంలో ఆలయం ఎదురుగా ఆగ్నేయ దిశలో భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే గజేంద్ర మోక్షంతో కూడిన పరమాత్ముని మండపాన్ని ప్రారంభించారు.

ముగిసిన బ్రహ్మోత్సవాలు
ఈ నెల రెండో తేదీ నుంచి జరుగుతున్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దశమ బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ఏకాంత సేవతో ముగిసాయి. నాలుగురోజులపాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా భక్తి కోటి తరించేలా ధర్మకర్తలు నిర్వహించారు. సాయంత్రం దోపు ఉత్సవం, ధ్వజావరోహణం, పూర్ణాహుతి, ద్వాదశ ప్రదక్షిణాలు, విశేష ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగిసాయి.

 

https://www.facebook.com/share/v/1K8JzHLDvY/

 

 

Tags: #10thAnnualBrahmotsavams#AndhraPradesh#Brahmotsavams#DhwajaAvarohanam#DokiparruMahakshetram#DopuUtsavam#DwadasaPradakshinam#EkantaSeva#Gudlavalleru#KrishnaDistrict#LordVenkateswara#MeilSudhaReddy#Poornahuti#PVKrishnaReddy#SrinivasaKalyanam#SudhaReddy#TeluguNewsMeghaEngineering
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

PM Modi: ఫ్రీ వీసా..రష్యాకు భారీ ఆఫర్

Next Post

Indigo airlines: అసలు ఎందుకీ గందరగోళం..?

Related Posts

KalyaniPriyadarshan
Entertainment

KalyaniPriyadarshan:ELLE List 2026 వేదికపై కల్యాణి ప్రియదర్శన్ మెరుపులు

APTeachers
Andhra Pradesh

APTeachers:ఏప్రిల్–మేలో ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు – పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన

KTR
Big Story

KTR:మీడియా లీకులు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

TTD
Andhra Pradesh

TTD:టీటీడీలో కల్తీ నెయ్యి మహా కుంభకోణం: 600 పేజీల ఛార్జిషీట్‌తో వెలుగులోకి సంచలన నిజాలు

Olectra
Big Story

Olectra : ఓలెక్ట్రా గ్రీన్‌టెక్‌లో ఆనంద్ కుమార్ చేరిక

Tamannaah Bhatia
Entertainment

Tamannaah Bhatia:ELLE లిస్ట్ 2026 రెడ్ కార్పెట్‌పై నక్షత్రాల సందడి – షీర్ ఎలిగెన్స్‌తో మెరిసిన తమన్నా

Next Post
Indigo airlines: అసలు ఎందుకీ గందరగోళం..?

Indigo airlines: అసలు ఎందుకీ గందరగోళం..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

KalyaniPriyadarshan

KalyaniPriyadarshan:ELLE List 2026 వేదికపై కల్యాణి ప్రియదర్శన్ మెరుపులు

APTeachers

APTeachers:ఏప్రిల్–మేలో ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు – పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన

KTR

KTR:మీడియా లీకులు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

TTD

TTD:టీటీడీలో కల్తీ నెయ్యి మహా కుంభకోణం: 600 పేజీల ఛార్జిషీట్‌తో వెలుగులోకి సంచలన నిజాలు

Recent News

KalyaniPriyadarshan

KalyaniPriyadarshan:ELLE List 2026 వేదికపై కల్యాణి ప్రియదర్శన్ మెరుపులు

APTeachers

APTeachers:ఏప్రిల్–మేలో ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు – పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన

KTR

KTR:మీడియా లీకులు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

TTD

TTD:టీటీడీలో కల్తీ నెయ్యి మహా కుంభకోణం: 600 పేజీల ఛార్జిషీట్‌తో వెలుగులోకి సంచలన నిజాలు

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info