• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Mahanadu2025:ఆంధ్రప్రదేశ్ ని అన్నపూర్ణగా చేసేది, చేయబోయేది తెలుగుదేశమే:మంత్రి నిమ్మల

*మహానాడులో నీటిపారుదల రంగ తీర్మానం ప్రతిపాదిస్తూ- మంత్రి నిమ్మల*

Mahanadu2025:ఆంధ్రప్రదేశ్ ని అన్నపూర్ణగా చేసేది, చేయబోయేది తెలుగుదేశమే:మంత్రి నిమ్మల

ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకలి, దాహార్తి తీర్చడానికి ఆనాడు అన్న ఎన్టీఆర్ నుంచి నేటి మన అధినేత చంద్రబాబు నాయుడు వరకు ఇరిగేషన్ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మహానాడులో నీటి పారుదల కు సంబంధించి ప్రతిపాదించిన తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడారు. పంచభూతాలలో ఒకటైన నీటి ఆవశ్యకతను, ప్రాధాన్యతను ఆనాడే మన పార్టీ అగ్రనేతలు గమనించారన్నారు. జల వనరులు ఉన్నచోటే నాగరికతలు వెల్లి విరుస్తాయనే చారిత్రక సత్యాన్ని మన పార్టీ ఆవిర్భావ దశలోనే గుర్తించి నీటి వనరుల సద్వినియోగానికి అనేక ప్రణాళికలు రచించిందని, ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది అన్నారు. రాష్ట్రానికి ఆయువుపట్టు, జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై మన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పని చేసింది అన్నారు. 2014-19 లో నాటి మన ప్రభుత్వం 72 శాతం పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయగా తదనంతరం వచ్చిన వైకాపా ప్రభుత్వం ఆ ప్రాజెక్టుని విధ్వంసం చేసిందన్నారు. 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లి పోయిందన్నారు . 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్రాన్ని కరువు రహితంగా చేయాలని చంద్రబాబు లక్ష్యంగా నిర్ణయించి పనులు పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గోదావరిలో ఏటా వృధాగా పోతున్న 3000 టిఎంసి ల నీటిని, రాయలసీమకు తరలించి రతనాల సీమ చేయాలనేది ముఖ్యమంత్రి లక్ష్యంగా మంత్రి రామానాయుడు వివరించారు. ఇందుకు 80 వేల కోట్లు అంచనా వ్యయంతో పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి వడివడిగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ఇది పూర్తయితే రాయలసీమ పచ్చని పైర్లతో అలరారుతుందన్నారు. అలాగే పోలవరం ఎడమ కాలువ పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తవుతుందన్నారు. విశాఖ నగరానికి తాగునీరు, విశాఖ ఉక్కు వంటి తదితర అనేక పారిశ్రామిక అవసరాలకు పూర్తిస్థాయి నీటిని అందించగలుగుతామన్నారు.
ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి అన్న ఎన్టీఆర్ నుంచి నేటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేసి అమలు చేసిన, చేస్తున్న ఘనత మన తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని అనడంలో సందేహము లేదన్నారు. తెలుగు గంగ,హంద్రీనీవా, గాలేరు నగరి, కేసీ కెనాల్ తదితర అన్ని నీటిపారుదల ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల గురించి మంత్రి రామానాయుడు పేరుపేరునా వివరించారు. వాటి ప్రస్తుత పరిస్థితిని చెప్పారు. అలాగే అవి ఎప్పటికీ పూర్తి చేస్తామో కూడా ఆయన మహానాడులో ప్రకటించారు.

రాయలసీమ ప్రజలకు ఏదైనా మంచి చేశారు అంటే.. ఆ ఘనత చంద్రబాబునాయుడు కే దక్కుతుందని మంత్రి అన్నారు. రాయలసీమ ద్రోహి అంటూ ఎవరన్నా ఉన్నారంటే.. రాయలసీమకు ఎవరూ చేయని అన్యాయం చేసింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని రామానాయుడు విమర్శించారు. 2014 -19 మధ్యకాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం మొత్తం బడ్జెట్ 7 లక్షల కోట్లు అయితే, ప్రభుత్వం ఇరిగేషన్ కు 72,000 కోట్లు కేటాయించినట్లు మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు. అదే దుర్మార్గ వైకాపా ప్రభుత్వం బడ్జెట్ రెట్టింపు అయి 12 లక్షల కోట్లకు పెరిగినా ఐదేళ్లలో ఇరిగేషన్ కేటాయించింది కేవలం 32 వేల కోట్లు మాత్రమేనని రామానాయుడు ఎండగట్టారు. ఈ 32 వేల కోట్లు కూడా ఎక్కడ ఖర్చు పెట్టారో..ఏం చేశారో ఎవరికి తెలియదు అని విమర్శించారు. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా మన తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు చేపట్టి ప్రారంభించిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా వైకాపా ప్రభుత్వం పూర్తి చేయలేదు.. తట్టెడు మట్టి కూడా ఎక్కడ వేయలేదు. ఎక్కడి పనులు అక్కడే వదిలేసింది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని రెండు శాతం పనులు చేసి చేతులు దులుపుకుంది. అది కూడా విధ్వంసకరపనులు చేసి ప్రాజెక్టుకి మరో వెయ్యి కోట్లు అదనపు ఖర్చుకు కారణభూతమైందని మంత్రి అన్నారు. మరి విడ్డూరం ఏంటంటే.. కరవుతాండవిస్తున్న ప్రకాశం జిల్లాను ఆ రక్త కోరల నుండి కాపాడడానికి తెలుగుదేశం ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే.. ప్రాజెక్టు పూర్తికాకుండానే జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తయిపోయింది అని చెప్పటం, ప్రారంభించటం, జాతికి అంకితం చేసేయటం దారుణమన్నారు. ఈ దగా, మోసం చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు.. మీడియా సైతం విస్తు పోయిందన్నారు.

Tags: #AndhraPolitics#AndhraPradesh#APpolitics#ChandrababuNaidu#Irrigation#IrrigationDevelopment#Mahanadu2025#MahanaduSpeech#NimmalaRamaNaidu#polavaramproject#PoliticalUpdate#Rayalaseema#Tdp#TDPMahanadu#TeluguDesam#TeluguDesamParty#TeluguNews#TeluguPolitics#WaterManagement#waterresources
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Manchu Manoj: అండగా పవన్ కళ్యాణ్ అన్న నిలబడ్డారు

Next Post

Nayanthara: స్టైలిష్ లుక్‌లో..!

Related Posts

Andhra Pradesh: ఇదేంది జ‌గ‌న్..!
Andhra Pradesh

Andhra Pradesh: ఇదేంది జ‌గ‌న్..!

Andhra Pradesh: కేబినెట్ లోకి నాగబాబు..?
Andhra Pradesh

Andhra Pradesh: కేబినెట్ లోకి నాగబాబు..?

Virat Kohli:  అక్కడే సెటిల్..?
Big Story

Virat Kohli: అక్కడే సెటిల్..?

PRIYANKA CHOPRA: తీవ్ర విషాదం..!
Entertainment

PRIYANKA CHOPRA: తీవ్ర విషాదం..!

Tirumala: ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్న  రేణిగుంట విమానాశ్రయం
Andhra Pradesh

Tirumala: ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్న రేణిగుంట విమానాశ్రయం

Air India Plain Crash: DNA ద్వారా 184 మృతదేహాల గుర్తింపు..!
Big Story

Air India Plain Crash: DNA ద్వారా 184 మృతదేహాల గుర్తింపు..!

Next Post
Nayanthara: స్టైలిష్ లుక్‌లో..!

Nayanthara: స్టైలిష్ లుక్‌లో..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Andhra Pradesh: ఇదేంది జ‌గ‌న్..!

Andhra Pradesh: ఇదేంది జ‌గ‌న్..!

Andhra Pradesh: కేబినెట్ లోకి నాగబాబు..?

Andhra Pradesh: కేబినెట్ లోకి నాగబాబు..?

Virat Kohli:  అక్కడే సెటిల్..?

Virat Kohli: అక్కడే సెటిల్..?

PRIYANKA CHOPRA: తీవ్ర విషాదం..!

PRIYANKA CHOPRA: తీవ్ర విషాదం..!

Recent News

Andhra Pradesh: ఇదేంది జ‌గ‌న్..!

Andhra Pradesh: ఇదేంది జ‌గ‌న్..!

Andhra Pradesh: కేబినెట్ లోకి నాగబాబు..?

Andhra Pradesh: కేబినెట్ లోకి నాగబాబు..?

Virat Kohli:  అక్కడే సెటిల్..?

Virat Kohli: అక్కడే సెటిల్..?

PRIYANKA CHOPRA: తీవ్ర విషాదం..!

PRIYANKA CHOPRA: తీవ్ర విషాదం..!

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info