రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఇటీవల ప్రకటించిన విజయసాయి కొన్నిరోజుల కిందట రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా నేడు ఎక్స్ వేదికగా స్పందించిన విజయసాయి 2029లో జగన్ మరోసారి సీఎం కావాలని ఆకాంక్ష. ఇటీవల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం ద్వారా విజయసాయిరెడ్డి సంచలనం సృష్టించడం తెలిసిందే. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు ఇవాళ పంపించారు. జగన్ ఇవాళ లండన్ నుంచి బెంగళూరు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో, విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు.
వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఈ రోజు నా రాజీనామాను పార్టీ అధ్యక్షుడు జగన్ గారికి పంపించాను అంటూ ట్వీట్ చేశారు. 2029 ఎన్నికల్లో జగన్ గారు భారీ మెజారిటీతో మరోసారి సీఎం కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నానని తెలిపారు.
“నా రాజకీయ ప్రస్థానంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. శత్రుత్వాలకు, అపార్థాలకు అవకాశం ఇవ్వని విధంగా జీవించాలని వ్యవసాయ ప్రపంచంలో మరో ప్రస్థానాన్ని ప్రారంభించాను” అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఇవాళ భారీ ఊరట లభించింది. తాజాగా రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకే గుడ్ బై చెప్పేసిన ఆయన తాజాగా హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు.. ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. దీంతో రాజకీయాల నుంచి తప్పుకున్న విజయసాయిరెడ్డికి భారీ ఊరట లభించినట్లయింది.
రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన తర్వాత విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు అన్నింటికీ దూరంగా విదేశాలకు వెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫ్రాన్స్ , నార్వే దేశాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న ఆయన విదేశాలకు వెళ్లాలంటే హైదరాబాద్ సీబఈఐ కోర్టు అనుమతి తప్పనిసరి. దీంతో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైదరాబాద్ సీబీఐ కోర్టు.. సీబీఐ అభిప్రాయం కూడా తీసుకుంది. అనంతరం విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ మేరుక ఫ్రాన్స్, నార్వే వెళ్లేందుకు సాయిరెడ్డికి 15 రోజుల పాటు అనుమతి లభించింది.