బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం.రేవంత్ రెడ్డి పెదవులు మూసుకోవడం వల్ల చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లు అయ్యింది.లోపాయికార ఒప్పందం చేసుకొని ప్రాజెక్టు కోసం సహకరిస్తున్నడు రేవంత్ రెడ్డి.ఢిల్లీలో పవర్ ఉంది అని లోకేష్ ప్రాజెక్టు కట్టి తీరుతం అంటున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు మాట్లాటం లేదు. సీఎం, మంత్రులు ఎందుకు మాట్లాడరుమీరు లోపాయికార ఒప్పందం చేసుకున్నరు.మీ చీఫ్ సెక్రటరీ ఏమో బనకచర్ల అంశం మీద చర్చకు రాము అని రాస్తడు, రేవంత్ ఏమో బనకచర్ల అంశం ఉన్నప్పటికీ పాల్గొని, కమిటీ వేసేందుకు ఒప్పుకొని వస్తడుమీ దైర్యం చూసుకొని లోకేష్ మాట్లాడుతున్నడు. బనకచర్ల కట్టి తీరుతం అంటున్నడు.బనకచర్లపై చంద్రబాబు బుల్డోజ్ విధానానికి బిజేపీ, కాంగ్రెస్ ల మౌనమే కారణం.సహకరించడం వల్లనే అంత దైర్యంగా ప్రకటిస్తున్నారు.లోకేష్ ఏమో ప్రాజెక్టు కట్టి తీరుతం అంటే, రేవంత్ రెడ్డి మాత్రం బనకచర్ల కడుతలేరు అంటడు. ఎజెండాలో లేదు అంటడు, కడుతం అంటే కదా అడ్డు చెప్పేది అంటడు.
రేవంత్ రెడ్డి గురుదక్షిణ చల్లించుకునే పనిలో పడ్డడురేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బిజేపీ డూడూ బసవన్న లాగా తలూపుతున్నరు. అందుకే దైర్యంగా మాట్లాడుతున్నరు.రేవంత్ గురుదక్షిణలో భాగంగా చంద్రబాబు మెప్పు కోసం, ఢిల్లీ మెప్పు కోసం ప్రయత్నం చేస్తాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు.లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడాడు, అధికారం ఉందని, మంద బలం ఉందని మాట్లాడటం పొరపాటుమిగులు జలాలు అనేవి నిజంగా ఉంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకు మీ డీపీఆర్ ను వెనక్కి తిప్పి పంపింది.పోలవరం అథారిటీ, గోదావరి బోర్డు, సిడబ్లుసి, ఎన్విరాన్ మెంట్ సంస్థలు ఎందుకు బనకచర్ల డిపిఆర్ ను తిరస్కరించాయి.నాలుగు కేంద్ర సంస్థలు బనకచర్లను తిప్పి పంపింది నిజం కాదా?మిగులు జలాలు ఉన్నాయని ఎవరు చెప్పారు? ఉంటే ఏపీకి ఎన్ని, తెలంగాణకు ఎన్ని కేటాయించారో చెప్పు?కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఎత్తిపోతలకు పొక్క కొట్టుడో, చిల్లు కొట్టుడో ఉండదు.ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉండటం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగింది.పోతిరెడ్డికి పొక్క పెట్టి నీళ్లు తీసుకుపోయారుఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్లు నీళ్లు తీసుకుపోతా అంటే చూస్తు ఊరుకుంటామా
ఇక్కడ ఉన్నది బిఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రయోజనాల కోసం పదవులను గడ్డి పోచలుగా వదులుకున్నోళ్లం.కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. మీకు వివరాలు పంపిస్తా చూసుకోండి.అనుమతులు లేవు అని ఎలా అంటావు.ఎప్పుడు తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోలేదని చెబుతున్న లోకేష్ గారు, ఇదే విషయం గురించి మీ నాన్న గారిని అడగండి.ఒక్క కాళేశ్వరం వ్యతిరేకిస్తూ మీ నాన్న గారు ఏడు ఉత్తరాలు రాసారు.మీరేమో వ్యతిరేకించలేదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.ఇచ్చిన అనుమతులు నిలిపి వేయండి, ప్రాజెక్టులు ఆపండి అని లేఖలు రాసారు.కాళేశ్వరం అనేది కొత్త ప్రాజెక్టు కాదు, ప్రాణహితలో అంతర్భాగం, అందుకే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ వర్తించదు అని స్పష్టంగా కేంద్రం పేర్కొన్నది.కాళేశ్వరానికి అవసరమైన 11 రకాల అనుమతులు తీసుకున్నాంకాళేశ్వరం మీద కుట్ర చేసి, మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా, నీళ్లు ఏపీకి పోవాలి అనే కుట్ర చేస్తున్నట్లుంది.ఏపీలో అక్రమ ప్రాజెక్టులు కట్టి కృష్ణా నదిలో నీళ్లు మళ్లించినట్లు, గోదావరి నీళ్లు మళ్లించాలనేది కుట్రరెండు నదులను హస్తాగతం చేసుకునే కుట్రలు జరుగుతున్నాయి.ఆనాడు ఉమ్మడి ఏపీలో అనేక కుట్రలు జరిగాయి.ఇప్పుడు బనకచర్ల కట్టి తీరుతాం అంటున్నారు.మీరు కట్టితీరుతాం అంటున్నారు, మేము అడ్డుకొని తీరుతాం అంటున్నాం.
మీ ప్రాజెక్టులను అడ్డుకోవడం మా ఉద్దేశ్యం కాదు, మా హక్కుల గురించి మేం మాట్లాడుతున్నంమా వాటా మాకు ఇవ్వండి గౌరవిస్తం, బుల్డోజ్ చేస్తం అంటే సహించేది లేదుకేసీఆర్ గారు కాళేశ్వరం కోసం మహారాష్ట్రకు వెళ్లి గవర్నర్, అక్కడి సీఎం ను కలిసారు.మూడు సార్లు వెళ్లి ఒప్పించి, మెప్పించారు. కాళేశ్వరం కట్టారు.సముద్రంలో కలిసే నీళ్లు కదా అంటున్న లోకేష్ గారు.. ఉమ్మడి ఏపీ ఉన్నపుడు 968 టీఎంసీలను తెలంగాణకు వాటాగా కేటాయించారు.విభజన బిల్లు, శ్రీకృష్ణ కమిటీ అన్నింట్లో ఈ వాటా పేర్కొన్నరు. ఇందుకు లోబడి కడుతున్న ప్రాజెక్టులను ఎందుకు ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటున్నదిఉమ్మడి ఏపీలో ఇచ్చిన 968 పరిధిలో కట్టిన ప్రాజెక్టులను అడ్డుకుంటున్నరు, మరి బనకచర్ల ఎట్ల కడుతున్నరు, ఈ ప్రాజెక్టుకు ఉన్న అనుమతులు ఏమిటిమా నోరు కొడతాం అంటే మాకు హక్కులు లేవా, మేం ఎందుకు ఊరుకోవాలె
సూటిగా లోకేష్ గారికి అడుగుతున్నా..968 టిఎంసీలను అంగీకరించండి. దాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి రాసిన లేఖలను విత్ డ్రా చేసుకోండిగోదావరి పై నిర్మించే మా ప్రాజెక్టులను వ్యతిరేకించారు. విత్ డ్రా చేసుకోండిగోదావరి నీళ్లు కృష్ణాకు మళ్లిస్తే ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన 155 టిఎంసీలు మాకు ఇస్తమని ఒప్పుకోండి.
1480 టిఎంసీల కంటే ఎక్కువ ఉన్న నీటిని 65:35 ప్రకారం వాటా లెక్క తేల్చాలి. ప్రాంతీయ విద్వేశాలు రెచ్చ గొడుతున్నారు అన్నడు లోకేష్.గోదావరి నదిలో మా వాటా మాకు కావాలె అంటున్నడు, మిగులు జలాల లెక్క తేలాలి అంటున్నంఇలా అంటే ప్రాంతీయ విద్వేశాలు రెచ్చగొడుతున్నం అంటున్నడులోకేష్ గారు మీ నాన్న గారు బాబ్లీ మీద కొట్లాడారు, ఆల్ మట్టి మీద కొట్లాడారు. మీ నాన్న ఆరోజు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టినట్లావిశాఖ ఉక్కును కాపాడుకున్నం రెండు సార్లు అంటున్నడు, విశాఖ ఉక్కుకు బనకచర్లకు చాలా తేడా ఉందివిశాఖ ఉక్కుకు బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది.బనకచర్లతో తెలంగాణ నీటి హక్కుల ప్రయోజనాలకు దెబ్బ పడుతున్నదికేసీఆర్ గారు చంద్రబాబు, జగన్ లను కలిసి మిగులు జలాల్లో వాటా ఉపయోగించుకొని, రెండు రాష్ట్రాలకు వాడుకుందామని చెప్పారు. మీరు చేస్తున్నది బుల్డోజింగ్ రాజకీయంతెలంగాణకు ప్రయోజనం లేకుండా ఏకపక్షంగా బనకచర్ల కడుతం అంటున్నరుమా వాటా తేలాలి కదా, మా లెక్క తేలాలి కదా.ఒకవైపు ప్రాజెక్టులను అడ్డుకుంటరు, మరోవైపు 968 టిఎంసీలను వ్యతిరేకిస్తారు.
సుప్రీం కోర్టుకు వెళ్లి అయినా సరే కేసీఆర్ గారు, బిఆర్ఎస్ తెలంగాణ హక్కులను కాపాడుతుంది.అనుమతులు తెచ్చుకునే పద్ధతి మీకు తెలిస్తే, ఆపే పద్దతి కూడా మాకు తెలుసు.గోదావరి బనకచర్ల ద్వారా గోదావరి నీళ్లు మాత్రమే కాదు, కృష్ణా నీళ్లను కూడా తరలించుకునే కుట్ర ఉంది.ఈ విషయం చంద్రబాబు నాయుడే చెప్పిండునాగార్జున సాగర్ కుడి కాల్వను డబుల్ చేస్తాం అన్నడు.నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకు మీ డిపిఆర్ ను తిప్పి పంపాయికట్టి తీరుతాం అంటే అడ్డుకొని తీరుతాంఅనుమతులు తెచ్చుడు మీకు తెలిస్తే ఆపడం మాకు తెలుసుతెలంగాణను అడ్డుకుంటే ఆనాడు కేసీఆర్ శక్తి యుక్తులు ప్రదర్శించి రాష్ట్రాన్న తెచ్చిండు కేసీఆర్8 మంది ఎంపీలు కాంగ్రెస్, 8 మంది బిజేపీ ఎంపీలు ఉండి అడ్జర్న మెంట్ మోషన్ ఇచ్చి ఎందుకు బనకచర్ల మీద నిలదీయడం లేదుఎంపీలు ఉన్నది ఎందుకు? తెలంగాణ హక్కులు కాలరాయడానికా, కాపాడడానికా?అవసరం అయితే సర్వోన్నత న్యాయస్థానం వెళ్తం, హక్కులు కాపాడుకుంటం.