టీడీపీ అధినాయకత్వం ఆలోచన బాగానే చేసింది. ఏడాది కూటమి పాలన మీద వచ్చిన సర్వేలు కానీ అధ్యయనాలు కానీ ప్రభుత్వం పనితీరు బాగానే ఉంది కానీ ఎమ్మెల్యేలతోనే ఇబ్బంది అని అంటున్నట్లుగా సర్వే నివేదికలు వెల్లడించాయి. అదే సమయంలో సూపర్ సిక్స్ పధకాలు కొన్ని అందలేదని జనంలో కొంత బాధ ఆవేదన ఉన్నాయి.
వీటిని ధీటుగా ఎదుర్కోవడానికి చంద్రబాబు జనంలోకి ఎమ్మెల్యేలను పంపిస్తున్నారు ఏడాది పాలనలో ఎన్నో చేశామని ఆయన ఈ మధ్యనే జరిగిన సుపరిపాలనకు తొలి అడుగు సభలో చెప్పారు. అయితే అన్నీ చేసినట్లుగా కాదని చాలా వరకూ చేశామని బాబే అన్నారు. దాంతోనే ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
జనాంలోకి వెళ్తే ఎలా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో అన్నది చాలా మందికి ఉంది సూపర్ సిక్స్ లో తల్లికి వందనం పధకం ఈ మధ్యనే అమలు అయింది. అలాగే అందులో చాలా మందికి రాలేదన్న బాధ ఉంది. అయితే ఎక్కువ శాతం ఈ పధకం అమలు విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు చూస్తే ఉచిత గ్యాస్ పధక అమలు అవుతోంది. అయితే అన్నదాతా సుఖీభవ విషయం తేలాల్సి ఉంది. అలాగే నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు భృతి కూడా అమలు చేయాల్సి ఉంది, ఉచిత బస్సు పధకం మహిళలకు అమలు చేయాలి. అదే మహిళలకు నెలకు 1500 వందల పధకం ఉంది. ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయని చెబుతున్నారు.
మరి వీటి విషయంలో జనాలు అడిగితే ఏమి చెప్పాలన్నదే ఇపుడు ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే కనుక ఎమ్మెల్యేలు చాలా మంది కేవలం ఏడాది కాలంలోనే పార్టీ కార్యకర్తలతో ప్రజలతో తమ కనెక్షన్లు కట్ చేసుకున్నారు అని అంటున్నారు. అంతే కాదు చాలా మంది మీద విమర్శలు ఉన్నాయి. ఇక లోకల్ గా ఎమ్మెల్యేల అనుచరులు చేస్తున్న దందాల మీద కూడా జనంలో చర్చ ఉంది. వ్యతిరేకత ఉంది. వీటిని అధిగమిస్తూ జనాలకు ఎలా చేరువ కావాలన్నది బిగ్ టాస్క్ గా ఉంది అని అంటున్నారు అయితే ఎమ్మెల్యేల ఆలోచనలను గ్రహించిన టీడీపీ అధినాయకత్వం జనాలలోకి ఎలా వెళ్లాలి, ప్రభుత్వం ఏడాది కాలంలో ఏమేమి చేసింది అన్నది ఎలా వివరించాలి అన్న దాని మీద దిశా నిర్దేశం చేస్తుంది అని అంటున్నారు.
అంతే కాదు ఏడాది టీడీపీ కూటమి పాలన మీద విజయాల మీద కరపత్రాలను కూడా ముద్రించాలని అలా జనంలోకి పంపించాలని కూడా నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. ఆదివారం పార్టీ అధినేత చంద్రబాబు నాయకత్వంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుందని అపుడు చాలా విషయాల మీద క్లారిటీ వస్తుందని అంటున్నారు ఇక చూస్తే కనుక ఎమ్మెల్యేలను జనంలోకి పంపిస్తే కనుక ప్రజల నుంచి రావాల్సిన ఫీడ్ బ్యాక్ వస్తుందని అలాగే ఎమ్మెల్యేలు తమ వద్దకే వస్తే జనాలు సమస్యలు చెప్పుకుంటారు అని వాటిని పరిష్కరించడం ద్వారా జనంలో ఉన్న అసంతృప్తిని సైతం తగ్గించేందుకు వీలు ఉంటుందని టీడీపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు.