ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Social Media: పాలిటిక్స్ లో భారీ మార్పులు.. ఎందుకంటే?

Social Media: పాలిటిక్స్ లో భారీ మార్పులు.. ఎందుకంటే?
ADVERTISEMENT

రాజకీయాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. జనాల మైండ్ సెట్ మారిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఓటర్ల ఆలోచనలు వారి నిర్ణయాత్మకమైన తీర్పులను చూస్తే కనుక చాలా విషయాలు బోధపడతాయి. పెద్దగా అక్షరాస్యత కానీ టెక్నాలజీ కానీ మీడియా సాధనాలు కానీ లేని రోజులలోనే ఐరన్ లేడీ ఇందిరా గాంధీని 1977లో జనాలు ఓడించారు అన్నది అంతా గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రోజున సోషల్ మీడియా ప్రభంజనం ఉంది. దాదాపుగా అందరూ ఒక మాదిరి అక్షరాస్యులే. మిగిలినది సోషల్ మీడియా నేర్పిస్తోంది. అందువల్ల ఎన్నిక ఎన్నికకూ రాజకీయ పార్టీలకు ఎంతో కష్టమైన సవాళ్ళు ఎదురవుతున్నాయని చెప్పాల్సి ఉంది.

గెలుపు ఓటములు అన్నవి గ్రౌండ్ లెవెల్ లోనే అంతా ఆధారపడి ఉన్నాయని చెప్పాల్సి ఉంది. ఈ రోజున చూస్తే ఎమ్మెల్యేలు సామంతరాజులు మాదిరిగా వ్యవహరిస్తున్నారు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న తేడా అంతకంటే లేదు. ఎమ్మెల్యేలు తన నియోజకవర్గాలలో అయిదేళ్ళ పాటు యధేచ్చగా వ్యవహరిస్తున్నారు. వారి చెప్పినదే శాసనంగా మారుతోంది. ఏపీలో చూస్తే కూటమి ప్రభుత్వంలో అత్యధిక శాతం మంది ఎమ్మెల్యేల మీద అయితే జనాల నుంచి విమర్శలు ఫిర్యాదులు అనేకం ఉన్నాయి. వారు తమ కోసమే పని చేసుకుంటున్నారు అని విపరీతమైన కంప్లైంట్స్ కూడా ఉన్నాయి.

ఇక దేశంలో చాలా కాలంగా సెంట్రిక్ పాలిటిక్స్ సాగుతూ వచ్చాయి. అంటే వ్యక్తి కేంద్రంగా అని చెప్పాలి. ఎవరు పార్టీ అధినేతలు ఉంటారో ఎవరు ప్రభుత్వాలకు నాయకత్వం వహిస్తారో వారి ఇమేజ్ చూసి ఓట్లేసేవారు. అలా తమ లోకల్ ఎమ్మెల్యేలు ఎవరు అన్నది కూడా చూడకుండా గెలిపించేసేవారు. అలా ఇందిరమ్మ, ఎన్టీఆర్, వాజ్ పేయ్, నుంచి మోడీ దాకా కొంత వరకూ హవా సాగింది. ఇక తెలుగు నాట చూస్తే చంద్రబాబు, వైఎస్సార్ కేసీఆర్, జగన్ ఇలా అధినాయకుల బొమ్మలను చూసి ఓట్లు పడేవి. కానీ రానూ రానూ సోషల్ మీడియా టెక్నాలజీ ప్రభావంతో పాలిటిక్స్ లో భారీ మార్పు వస్తోంది. ఓటరు ఫోకస్ ఇపుడు లోకల్ మీడ పడుతోంది. దానికి కారణం తమ ఏరియాల్లో ఏమి జరుగుతోందో వారికి క్షణాలలో తెలిసిపోవడమే.

ఇక మోడీ ఎంతలా ప్రచారం చేసినా కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ 2023 ఎన్నికల్లో గెలవలేకపోయింది. దానికి కారణం లోకల్ పాలిటిక్స్ ని జనాలు చూసి ఓడించారు. ఇక తెలంగాణలో రెండు సార్లు కేసీఆర్ ఇమేజ్ వర్కౌట్ అయి గెలిచిన బీఆర్ఎస్ 2023లో ఓటమి పాలు అయింది. అలాగే 2024లో జగన్ తన బొమ్మతోనే అంతా గెలిచారు అని వంద మంది ఎమ్మెల్యేల దాకా అటూ ఇటూ మార్చేసి ప్రయోగం చేస్తే జనాలు లోకల్ గా ఓడించేసారు. జగన్ సంక్షేమ పధకాలు కానీ ఆయన ఇమేజ్ కానీ ఏ మాత్రం పనిచేయలేదు అన్నది ఈ ఎన్నిక నిరూపించింది. ఇక అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీ ఢిల్లీలో ఓడినా యూపీలో బీజేపీ 2024 ఎన్నికల్లో అతి తక్కువ ఎంపీ సీట్లు గెలిచినా అక్కడ కూడా యోగీ మోడీ ఇమేజ్ పనిచేయలేదని అర్ధం అవుతోంది.

ఇక ఏపీలో చూస్తే గ్రౌండ్ లెవెల్ లో రియాలిటీస్ కూటమి పెద్దలు గ్రహించాలని అంటున్నారుఇ. చంద్రబాబు పాలనను ఎవరూ తప్పు పట్టడం లేదు. ఆయన బాగానే పాలిస్తున్నారు. ఆర్థిక భారం ఉన్నా సంక్షేమ పధకాలను కూడా ఇస్తున్నారు. అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. అలాగే పవన్ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఏదో ప్రజలకు చేయలన్న తపనను కూడా జనాలు గమనిస్తున్నారు. కానీ కూటమి పార్టీల ఎమ్మెల్యేల తీరే చర్చకు వస్తోంది. వారిని కనుక కట్టడి చేయకపోతే జనాలు ఇచ్చే తీర్పు వేరేగా ఉంటుంది అని అంటున్నారు. ఎందుకంటే ప్రజలు ఇపుడు లోకల్ గానే అంతా చూసి తీర్పు ఇస్తున్నారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా సంక్షేమ పధకాలు ఇస్తారు, ఇక ఏ ప్రభుత్వం ఉన్నా అభివృద్ధి జరుగుతుంది అన్నది జనాలు అంటున్నారు. అందువల్ల తమకు ఎమ్మెల్యేలు ఎంత మేరకు అందుబాటులో ఉన్నారు, తమ ప్రయోజనాలకు ఏ మేరకు కాపాడుతున్నారు అని చూస్తూనే విచ్చలవిడిగా చేసే అవినీతిని కానీ దందాలను కానీ ఏ మాత్రం స్పేర్ చేయడం లేదు. అందువల్ల అధికారంలో ఉన్న పార్టీలు గ్రౌండ్ లెవెల్ లోనే అన్నీ చూసుకుని జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులే అని అంటున్నారు.

Tags: #DigitalPolitics#India#IndianElections#LocalPower#Politics#SocialMediaImpact#VoterShift
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Little Hearts’ movie review: మూవీ రివ్యూ : లిటిల్ హార్ట్స్

Next Post

Vizag: వారికే అధ్యక్ష పీఠం..?

Related Posts

Ayurveda Treatment
Andhra Pradesh

Ayurveda Treatment: విరూపాక్షపురం నుంచి మూడు తరాలుగా సాగుతున్న మోహన్‌రావు కుటుంబం ఆయుర్వేద సేవా ప్రస్థానం

Kadiri History
Andhra Pradesh

Kadiri History : కదిరి అంటే ఒక పేరు కాదు.. ఒక చరిత్ర! శతాబ్దాల వైభవం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు పూర్తి కథనం

Telangana Assembly
Big Story

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం.. స్పీకర్ అవమానంపై తీవ్ర ఆగ్రహం!

Ashika Ranganath
Entertainment

Ashika Ranganath: టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ

Chinna Srinu Joins TDP
Andhra Pradesh

Chinna Srinu Joins TDP: చిన్న శ్రీను గుడ్‌బై.. ఇక బొత్స ఏ పార్టీలో ఉన్నా తేడా ఉండదా?

BRS MLCs Suspension
Big Story

BRS MLCs Suspension: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

Next Post
Vizag: వారికే అధ్యక్ష పీఠం..?

Vizag: వారికే అధ్యక్ష పీఠం..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Ayurveda Treatment

Ayurveda Treatment: విరూపాక్షపురం నుంచి మూడు తరాలుగా సాగుతున్న మోహన్‌రావు కుటుంబం ఆయుర్వేద సేవా ప్రస్థానం

Kadiri History

Kadiri History : కదిరి అంటే ఒక పేరు కాదు.. ఒక చరిత్ర! శతాబ్దాల వైభవం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు పూర్తి కథనం

Telangana Assembly

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం.. స్పీకర్ అవమానంపై తీవ్ర ఆగ్రహం!

Ashika Ranganath

Ashika Ranganath: టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ

Recent News

Ayurveda Treatment

Ayurveda Treatment: విరూపాక్షపురం నుంచి మూడు తరాలుగా సాగుతున్న మోహన్‌రావు కుటుంబం ఆయుర్వేద సేవా ప్రస్థానం

Kadiri History

Kadiri History : కదిరి అంటే ఒక పేరు కాదు.. ఒక చరిత్ర! శతాబ్దాల వైభవం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు పూర్తి కథనం

Telangana Assembly

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం.. స్పీకర్ అవమానంపై తీవ్ర ఆగ్రహం!

Ashika Ranganath

Ashika Ranganath: టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info