React Air Ambulance ప్రపంచవ్యాప్తంగా అత్యవసర వైద్య రవాణా సేవలను మరింత విస్తృతంగా అందించేందుకు ముందడుగు వేసింది. అమెరికా తెలుగు సంఘం (ATA) 19వ వార్షిక మహాసభల సందర్భంగా అమెరికాలోని మేరీల్యాండ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య అవగాహన కేంద్రంలో రియాక్ట్ ఎయిర్ అంబులెన్స్ అత్యాధునిక సేవలను ప్రముఖులు, వైద్య నిపుణులు, ప్రవాస భారతీయులకు పరిచయం చేసింది. ఈ సందర్భంగా సంస్థ అందిస్తున్న అత్యవసర గగన వైద్య సేవలు విశేష ఆకర్షణగా నిలిచాయి.
తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన ఎయిర్ అంబులెన్స్ సేవలను ఇకపై ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. విదేశాల్లో అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకున్న రోగులను అత్యాధునిక వైద్య పరికరాలతో సురక్షితంగా తరలించే విధానాన్ని ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా వివరించారు. ఈ ప్రదర్శనకు హాజరైన వారు రియాక్ట్ సేవలను అభినందిస్తూ, ఆరోగ్య రంగంలో ఇది కీలకమైన ముందడుగుగా పేర్కొన్నారు.
రియాక్ట్ ఎయిర్ అంబులెన్స్ సంస్థ అధినేత డాక్టర్ నీల్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ, అత్యవసర వైద్య పరిస్థితుల్లో ప్రతి క్షణం ఎంతో విలువైనదని, ఒక్క నిమిషం ఆలస్యమైనా ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశముంటుందని తెలిపారు. అందుకే ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా రోగులకు అత్యంత వేగంగా వైద్య సహాయం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని వివరించారు. అమెరికా నుంచి తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాలకు 24 గంటలూ, వారంలో ఏడు రోజులూ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రియాక్ట్ అంతర్జాతీయ ప్రతినిధులు యన్నంరెడ్డి వినీలారెడ్డి, ఉత్తర అమెరికా ప్రధాన కార్యదర్శి సుకుమార్ రెడ్డి, అమెరికా ఆపరేషన్స్ ప్రతినిధి డాక్టర్ యెన్నంరెడ్డి లావణ్యరెడ్డి ఎయిర్ అంబులెన్స్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఐసీయూ సదుపాయాలు, వెంటిలేటర్లు, కార్డియాక్ మానిటరింగ్ వ్యవస్థలు, శిక్షణ పొందిన వైద్య బృందం సేవల గురించి సవివరంగా వివరించారు.
రోగిని ఒక దేశం నుంచి మరొక దేశానికి తరలించే సమయంలో అవసరమైన వైద్య పరికరాలు, అత్యవసర చికిత్స, విమాన ప్రయాణ సమన్వయం, ఆసుపత్రులతో అనుసంధానం వంటి అన్ని అంశాలను రియాక్ట్ ఒకే వేదికపై నిర్వహించడం విశేషమని వారు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ఆందోళన చెందకుండా పూర్తి బాధ్యతను సంస్థ తీసుకుంటుందని పేర్కొన్నారు.
ఈ ప్రదర్శనను సందర్శించిన ప్రవాస తెలుగు కుటుంబాలతో పాటు అమెరికన్ ప్రతినిధులు కూడా రియాక్ట్ సేవలపై ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. భవిష్యత్తులో అంతర్జాతీయ వైద్య రవాణా రంగంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు, ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
కార్యక్రమానికి హాజరైన ప్రముఖ శతావధాని, సాహితీవేత్త నరాల రామారెడ్డి రియాక్ట్ సేవలను ప్రశంసిస్తూ, “రోగికి సమయమే అమృతం.. ఆ అమృతాన్ని అందించే దివ్యౌషధం రియాక్ట్ ఎయిర్ అంబులెన్స్” అని వ్యాఖ్యానించారు. అత్యవసర వైద్య సేవలను మానవతా దృక్పథంతో అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఆటా మహాసభల్లో పాల్గొన్న వైద్య నిపుణులు, వ్యాపారవేత్తలు, సామాజిక సేవకులు, సినీ ప్రముఖులు కూడా రియాక్ట్ ఎయిర్ అంబులెన్స్ సేవలను కొనియాడారు. ఆరోగ్య రంగంలో సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తూ అత్యవసర వైద్య సేవలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయమని అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియాలో కూడా రియాక్ట్ ఎయిర్ అంబులెన్స్కు విశేష స్పందన లభిస్తోంది. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు ఈ సేవలపై అవగాహన పెంచుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు ఇలాంటి సేవలు ఎంతో అవసరమని పలువురు పేర్కొంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైన వైద్య రవాణా సేవలను అందించాలనే లక్ష్యంతో రియాక్ట్ ఎయిర్ అంబులెన్స్ చేపడుతున్న కార్యక్రమాలు ఆరోగ్య రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా నుంచి భారత్కు, అలాగే ప్రపంచంలోని ఏ దేశానికైనా అత్యవసర వైద్య రవాణా సేవలను సమర్థవంతంగా అందించేందుకు సంస్థ రూపొందించిన వ్యవస్థ భవిష్యత్తులో మరింత విస్తరించనుంది.
ATA 19వ మహాసభల్లో రియాక్ట్ ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య ప్రదర్శనకు విశేష ఆదరణ లభించగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలకు అత్యవసర సమయాల్లో భరోసా కల్పించే గగన వైద్య సేవగా ఇది నిలుస్తుందనే విశ్వాసాన్ని పలువురు వ్యక్తం చేశారు.
usa


















