ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Pamban Bridge:పాంబన్ బ్రిడ్జ్ ప్రత్యేకత ఏంటో తెలుసా..?

Pamban Bridge:పాంబన్ బ్రిడ్జ్ ప్రత్యేకత ఏంటో తెలుసా..?
ADVERTISEMENT

శ్రీ రామనవమి సందర్భంగా తమిళనాడులో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామేశ్వరం నుంచి భారతదేశపు ప్రధాన భూభాగాన్ని అనుసంధానించే పాంబన్ రైలు వంతెనను ప్రారంభించనున్నారు.అలాగే, రామేశ్వరం-తాంబరం (చెన్నై) మధ్య నూతన రైలు సర్వీసు కూడా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు.

భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సముద్ర వంతెన పాంబన్ బ్రిడ్జ్. ఈ వంతెన ప్రాచీన సాంస్కృతిక ప్రాముఖ్యత ఉట్టిపడేలా నిర్మించారు.
వర్టికల్ సస్పెన్షన్ బ్రిడ్జ్‌తో ఉన్న ఈ సరికొత్త రైల్వే వంతెనను మండపం రైల్వే స్టేషన్- రామేశ్వరం రైల్వే స్టేషన్‌ను కలుపుతూ..సముద్రం మధ్యలో నిర్మించారు.గత ఏడాది నవంబర్‌లో ఈ వంతెన నిర్మాణం పూర్తయింది. రైల్వే సేఫ్టీ కమిషనర్ ఈ వంతెనను పరిశీలించి, పాసింజర్ రైళ్లు ప్రయాణించడానికి అనుమతులు ఇస్తూ సర్టిఫికేట్ జారీ చేశారు.

పాంబన్ బ్రిడ్జ్‌ను ప్రారంభించడంతో పాటు తమిళనాడులో రూ.8,300 కోట్లకు పైగా విలువైన వివిధ రైలు, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
రామాయణం ప్రకారం రామసేతు నిర్మాణం రామేశ్వరం సమీపంలోని ధనుష్కోడి నుంచి ప్రారంభమైంది.రామేశ్వరాన్ని ప్రధాన భూభాగానికి అనుసంధానించే ఈ వంతెన, భారతీయ ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటుతోంది. దీనిని రూ. 550 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించారు.

ఈ వంతెన సుమారుగా 99 స్పాన్లు, 72.5 మీటర్ల పొడవున్న వర్టికల్ లిఫ్టుతో 2.08 కి.మీ. పొడవు ఉంటుంది. ఈ లిఫ్టును 17 మీటర్ల ఎత్తు వరకు పెంచవచ్చు.రైలు, ఓడల ప్రయాణాన్ని సజావుగా సాగడానికి ఇది ఉపయోగపడుతుంది.పూర్తిగా స్టెయిన్‌లెస్ స్టీల్, హై-గ్రేడ్ ప్రొటెక్టివ్ పెయింట్, పూర్తిగా వెల్డింగ్ చేసిన జాయింట్‌లతో ఈ వంతెన నిర్మించారు.భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డబుల్ రైలు ట్రాకులు ఏర్పాటు చేసేలా దీన్ని నిర్మించారు.

కఠినమైన సముద్ర వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ రైలు వంతెన తుప్పు పట్టకుండా పాలీసిలోక్సేన్ పూత వేశారు.భారత ప్రధాన భూభాగాన్ని, రామేశ్వరం ద్వీపంతో అనుసంధానిస్తూ పాంబన్, మండపం మధ్యలో ఒక రైలు వంతెనను నిర్మించాలని శతాబ్దం కిందటే బ్రిటీష్ ప్రభుత్వం ప్లాన్ చేసింది.ధనుష్కోడి, తలైమన్నార్, శ్రీలంక మధ్యలో చిన్న నౌకలు కార్యకలాపాలు నిర్వహించేలా… రైలు వంతెన కింద నుంచి ప్రయాణికుల నౌకలు వెళ్లేందుకు అనువుగా సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణానికి బ్రిటీష్ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ వంతెన నిర్మాణ పనులు 1911లో ప్రారంభమయ్యాయి.

కేవలం రెండేళ్లలోనే ఈ పనులు పూర్తి చేశారు. చెన్నై ఎగ్మోర్ నుంచి పాంబన్ రైల్వే వంతెన మీదుగా ధనుష్కోడి వరకు తొలి బోటు ట్రైన్ 1914 ఫిబ్రవరి 24న ప్రయాణించింది.దీంతో, ఒకే టిక్కెట్‌పై చెన్నై నుంచి ఎగ్మోర్, కొలంబో వరకు ప్రయాణికులు వెళ్లవచ్చు.శతాబ్దం కిందట షికాగోలోని షెర్జర్ రోలింగ్ లిఫ్ట్ బ్రిడ్జ్ కంపెనీ ఈ వంతెనను డిజైన్ చేయగా.. ఇంగ్లండ్‌లోని థార్నాబీ-ఆన్-టీస్‌కు చెందిన హెడ్ రైట్సన్ అండ్ కో లిమిటెడ్‌ దీన్ని నిర్మించింది.

సముద్ర మట్టానికి 12.5 మీటర్ల పైన ఈ వంతెన ఉంటుంది. 2.05 కిలోమీటర్ల పొడవు, 143 పీయర్స్ (దిమ్మలు) ఉంటాయి. నౌకలు వెళ్లగలిగేలా వంతెన మధ్యలో 289 అడుగుల పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంటుంది.

(ఈ వివరాలను ది ఇంజనీర్ అనే పుస్తకం నుంచి తీసుకున్నాం. భారత్‌లో నిర్మించిన ప్రత్యేక వంతెనల గురించి ఈ పుస్తకంలో రాశారు. ఈ వంతెనలు నిర్మించిన ఇంజనీర్ల ఇంటర్వ్యూలతో పాటు, పలు వివరాలు దీనిలో ఉన్నాయి.)

పాంబన్‌లో పాత రైల్వే వంతెన గుండా ప్రయాణించిన 86 ఏళ్ల వ్యక్తి సింగమ్ తన అనుభవాలను బీబీసీతో పంచుకున్నారు. ”నాకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు పాంబన్ రైల్వే వంతెన గుండా ప్రయాణించాను. సముద్రం గుండా పాంబన్ రైల్వే స్టేషన్ నుంచి కాన్‌కోర్సు చేరుకునేందుకు అరగంట పట్టింది. వంతెనపై వెళ్లేటప్పుడు రైలు చాలా నెమ్మదిగా వెళ్లింది. పాంబన్ నుంచి రామనాథపురం ప్రయాణించినప్పుడు, టిక్కెట్ ధర రూపాయి. సముద్రంపైన రైలులో వంతెనపై ప్రయాణించడం నాకు తొలిసారి. భయం వేసింది. కానీ, రైలు శబ్దం, వైబ్రేషన్ భలే నచ్చాయి. అప్పటి నుంచి పాంబన్ రైల్వే వంతెనపై చాలాసార్లు ప్రయాణించాను. ఈ రైల్వే సస్పెన్షన్ బ్రిడ్జ్ మా పాంబన్ ప్రాంతానికి ఒక చిహ్నం.” అని తెలిపారు.

1964 తుపాను ధనుష్కోడిపై తీవ్ర ప్రభావం చూపింది. పాంబన్ రైల్వే వంతెనకు చెందిన 124 స్పాన్లు కొట్టుకుపోయాయి.కేవలం షెర్జర్ స్పాన్, 19 కాంక్రీట్ పిల్లర్లు మాత్రమే మిగిలాయి. యుద్ధ ప్రాతిపదికన ఈ వంతెన తిరిగి నిర్మాణ పనులను అప్పటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధరన్ నేతృత్వంలో చేపట్టారు. సముద్రంలో మునిగిపోయిన్ గిర్డర్లను తీసుకొచ్చి, 67 రోజుల్లో పున:నిర్మాణ పనులను పూర్తి చేశారు.

1964లో ధనుష్కోడిలో వచ్చిన పెను తుపాను సమయంలో పాంబన్ వంతెన ధ్వంసం కావడాన్ని కళ్లారా చూసిన 70 ఏళ్ల అంబికాపతి బీబీసీతో మాట్లాడారు. ”నా కుటుంబంతో ధనుష్కోడిలో నివసించేవాణ్ని. ఈ పెను తుపానుతో ధనుష్కోడి పూర్తిగా ధ్వంసమైంది. అక్కడి నుంచి బయటపడి, రామేశ్వరం చేరుకున్నాం. ఆ తర్వాత, రామేశ్వరం నుంచి పాంబన్ రైల్వే స్టేషన్‌కు వచ్చాం. ఆ సమయంలో, రైలు సర్వీసులన్నీ రద్దు అయ్యాయి. అప్పుడు పాంబన్ నుంచి మండపం వచ్చేందుకు రోడ్డు వంతెన కూడా లేదు. మండపం చేరుకునేందుకు మేం రెండు గంటల పాటు చెక్క వంతెన వాడాం. మూడు నెలల తర్వాత, ఈ రైలు మార్గంలో సర్వీసులు తిరిగి ప్రారంభించారు. ఆ తర్వాత 1974లో మరోసారి పాంబన్ సమీపంలో తుపాను వచ్చింది. కానీ, ఈసారి పాంబన్ రైల్వే వంతెనకు ఏం కాలేదు. ” అని అంబికాపతి చెప్పారు.

పాంబన్ రైల్వే వంతెనపై చివరి ప్రయాణం

శతాబ్దం వరకు రాకపోకలు సాగించిన తర్వాత, పాంబన్ వంతెన మధ్య భాగంలో సస్పెన్షన్ బ్రిడ్జ్ వద్ద రైలు వెళ్తున్న సమయంలో విపరీతమైన వైబ్రేషన్స్ వస్తున్నట్లు ఐఐటీ మద్రాసుకు చెందిన నిపుణుల బృందం గుర్తించింది. దీని కారణంగా, 2022 డిసెంబర్ 23 నుంచి పాంబన్ వంతెన గుండా వెళ్లే రైలు రాకపోకలను నిలిపివేశారు.2019 రైల్వే గ్రాంట్ రిక్వెస్ట్‌ల సమయంలో పాంబన్ వంతెన సమీపంలో కొత్త రైల్వే వంతెన నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు వచ్చాయి.

2019 మార్చి 1న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని మోదీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.తుప్పు పట్టేందుకు అవకాశం ఉన్న ప్రాంతమైన పాంబన్‌లో ఈ కొత్త వంతెన నిర్మాణం చేపట్టడంతో, వంతెనకు తప్పు పట్టుకుండా పలు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

పలు లేయర్లలో యాంటీ-రస్ట్ పెయింట్స్ (తప్పు పట్టుకుండా పెయింట్స్) వేశారు.తొలి లేయర్ 200 మైక్రోన్ జింక్ అలాయ్, తదుపరి లేయర్ 25 మైక్రోన్ జెల్లీ మాదిరి ఎపాక్సీ పూత, చివరి లేయర్ సిలికాన్ ఆక్సీజన్‌తో కలగలసిన సింథటిక్ పాలీమార్ కోటింగ్ వేశారు.ఇవి సముద్ర గాలి నుంచి తప్పు పట్టుకుండా వంతెన నిర్మాణాలను 35 ఏళ్ల వరకు కాపాడనున్నాయని రైల్వే అధికారులు చెప్పారు.

భారతదేశంలో ఉన్న మిగిలిన రైలు బ్రిడ్జిలకన్నా పాంబన్ వంతెన కాస్త భిన్నమైనది. ఎందుకంటే నౌకాయానానికి వీలుగా ఈ బ్రిడ్జిని నిర్మించారు.లండన్ బ్రిడ్జి మాదిరిగానే ఇక్కడ కూడా నౌకలు వెళ్లేటప్పుడు బ్రిడ్జిలో కొంత భాగం రెండుగా విడిపోయి పైకి లేస్తుంది.తమిళనాడు టూరిజం శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇది భారతదేశంలో మొదటి సముద్ర వంతెన.పాత రైల్వే వంతెనకు చెందిన సస్పెన్షన్ బ్రిడ్జ్‌ను ఐరన్‌తో నిర్మించారు. దీన్ని, మనుషులే ఆపరేట్ చేసేవారు .కానీ, కొత్త రైల్వే వంతెన మధ్యలో నిర్మించిన వర్టికల్ సస్పెన్షన్ బ్రిడ్జ్‌ను ఏవియేషన్‌ టెక్నాలజీలో వాడే అల్యూమినియం అలాయ్‌తో ఏర్పాటు చేశారు.

దీని బరువు 650 టన్నులు. ఈ వర్టికల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఎత్తు 33 మీటర్లు, పొడవు 77 మీటర్లు.మనుషుల ప్రమేయం లేకుండానే మోటార్ల ద్వారా హైడ్రాలిక్ లిఫ్ట్‌లతో దీన్ని ఆపరేట్ చేయొచ్చు.
నౌకలు వెళ్లేందుకు వీలుగా 17 మీటర్ల ఎత్తు ఇది పైకి లేస్తుంది. ఇది రోడ్డు వంతెన ఎత్తుకు సమానం.
ప్రధానమంత్రి తమిళనాడులో శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేసే రూ.8,300 కోట్ల విలువైన ప్రాజెక్టులలో… జాతీయ రహదారి-40లోని వాలాజాపేట – రాణిపేట సెక్షన్‌లో 28 కిలోమీటర్ల పొడవైన నాలుగు లేన్లు, జాతీయ రహదారి-332లోని విల్లుప్పురం- పుదుచ్చేరి సెక్షన్‌లో 29 కిలోమీటర్ల పొడవైన నాలుగు లేన్ల రహదారి, జాతీయ రహదారి-32లోని 57 కిలోమీటర్ల పొడవైన పూండియంకుప్పం – సత్యనాథపురం సెక్షన్, జాతీయ రహదారి-36లోని 48 కిలోమీటర్ల పొడవైన చోళపురం-తంజావూరు సెక్షన్ ఉన్నాయి.

 

ఈ రహదారులు అనేక యాత్రా స్థలాలు, పర్యటక ప్రదేశాలను అనుసంధానిస్తూ.. నగరాల మధ్య దూరాన్ని తగ్గిస్తాయి.వైద్య కళాశాల, ఆసుపత్రి, ఓడరేవులకు వేగవంతమైన లింకును అందిస్తూ స్థానిక రైతులకు వ్యవసాయ ఉత్పత్తులను సమీపంలోని మార్కెట్లకు రవాణా చేయడానికి, స్థానిక తోలు, చిన్న తరహా పరిశ్రమల ఆర్థిక కార్యకలాపాలను పెంపొందించడానికి దోహదం చేస్తాయని చెబుతున్నారు.

Tags: #AutoLaunchingMethod#bjp#BridgeConstruction#ConstructionTechnology#EngineeringMarvel#HydraulicJacking#India#IndianRailways#InnovativeEngineering#ModernRailways#PambanBridge#PMModi#PrimeMinisterModi#RailConnectivity#RailVikasNigam#RailwayBridge#RailwayDevelopment#RamNavami2025#RVNL#SmartInfrastructure#TamilNadu#TransportationRevolutionGoi
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Sita Rama Kalyanam:సీతారాముల కళ్యాణం..ప్రత్యేకతలు తెలుసా..?

Next Post

Sreeleela: శ్రీలీలకు చేదు అనుభవం..!

Related Posts

Ritika Nayak
Entertainment

Ritika Nayak: సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తా.. కొరియన్ మాట్లాడటం వచ్చు.. ‘కొరియన్ కనకరాజు’ ప్రమోషన్స్‌లో రితికా నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు

Chandrababu Naidu
Big Story

Chandrababu Naidu : రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు.. మహిళల భద్రత, విద్య, టెక్నాలజీపై సీఎం చంద్రబాబు స్పష్టమైన సందేశం

Revanth Reddy Speech
Big Story

Revanth Reddy Speech: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పోరాటం ముగియలేదు.. యువత హక్కుల కోసం ఉద్యమం కొనసాగుతుంది

Dharmendra Pradhan Resignation
Big Story

Dharmendra Pradhan Resignation:రాష్ట్రపతి ఆమోదం.. రాహుల్ గాంధీ స్పందన.. జంతర్ మంతర్‌లో యువత సంబరాలు

Ajit Doval
Big Story

Ajit Doval:అజిత్ దోవల్‌కు లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం – దేశ భద్రతకు విశిష్ట సేవలకు గౌరవం

Corruption
Big Story

Corruption: స్వార్థం పుట్టించిన ఆరవ భూతం – సమాజాన్ని కూల్చేస్తున్న మౌన మహమ్మారి

Next Post
Sreeleela:  శ్రీలీలకు చేదు అనుభవం..!

Sreeleela: శ్రీలీలకు చేదు అనుభవం..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Ritika Nayak

Ritika Nayak: సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తా.. కొరియన్ మాట్లాడటం వచ్చు.. ‘కొరియన్ కనకరాజు’ ప్రమోషన్స్‌లో రితికా నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు

Chandrababu Naidu

Chandrababu Naidu : రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు.. మహిళల భద్రత, విద్య, టెక్నాలజీపై సీఎం చంద్రబాబు స్పష్టమైన సందేశం

Revanth Reddy Speech

Revanth Reddy Speech: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పోరాటం ముగియలేదు.. యువత హక్కుల కోసం ఉద్యమం కొనసాగుతుంది

Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation:రాష్ట్రపతి ఆమోదం.. రాహుల్ గాంధీ స్పందన.. జంతర్ మంతర్‌లో యువత సంబరాలు

Recent News

Ritika Nayak

Ritika Nayak: సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తా.. కొరియన్ మాట్లాడటం వచ్చు.. ‘కొరియన్ కనకరాజు’ ప్రమోషన్స్‌లో రితికా నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు

Chandrababu Naidu

Chandrababu Naidu : రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు.. మహిళల భద్రత, విద్య, టెక్నాలజీపై సీఎం చంద్రబాబు స్పష్టమైన సందేశం

Revanth Reddy Speech

Revanth Reddy Speech: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పోరాటం ముగియలేదు.. యువత హక్కుల కోసం ఉద్యమం కొనసాగుతుంది

Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation:రాష్ట్రపతి ఆమోదం.. రాహుల్ గాంధీ స్పందన.. జంతర్ మంతర్‌లో యువత సంబరాలు

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info