ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Maha Kumbh traffic jam: ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్..!

Maha Kumbh traffic jam: ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్..!
ADVERTISEMENT

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా భక్తులతో కిక్కిరిసిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. ఈ పెరిగిన రద్దీ కారణంగా రహదారులపై వాహనాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది. 300 కిలోమీటర్ల మేర వాహన రాకపోకలు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు.

 

భక్తుల ప్రవాహం నియంత్రించలేక, యూపీ ట్రాఫిక్ పోలీసులు ప్రయాగ్‌రాజ్ వెళ్లే మార్గాల్లో రాకపోకలను నిలిపివేశారు. కొన్ని ప్రాంతాల్లో 50 కిలోమీటర్లు ప్రయాణించేందుకు 12 గంటల సమయం పడుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రయాగ్‌రాజ్ సంగం రైల్వే స్టేషన్ మూసివేశారని వస్తున్న వార్తలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఖండించారు.

 

ఈ ట్రాఫిక్ జామ్ ప్రభావం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా కనిపిస్తోంది. అక్కడి కొన్ని జిల్లాల్లో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే భక్తుల వాహనాల కారణంగా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భక్తులను ప్రయాగ్‌రాజ్ యాత్రను మరో రెండు రోజులు వాయిదా వేసుకోవాలని సూచించారు.

 

ఈ పరిస్థితి భారతదేశ చరిత్రలో అరుదుగా కనిపించే భారీ ట్రాఫిక్ జామ్‌లలో ఒకటిగా నిలుస్తోంది. ఇంతకుముందు 2010లో చైనా రాజధాని బీజింగ్‌లో 100 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో 12 రోజుల పాటు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అలాగే, 2012లో బ్రెజిల్‌లోని సావోపాలోలో 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు 12-15 గంటలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 

ప్రయాగ్‌రాజ్ ట్రాఫిక్ జామ్ ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్‌లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. అధికార యంత్రాంగం పరిస్థితినినియంత్రించేందుకు కృషి చేస్తోంది. భక్తులు ముందస్తు ప్రణాళికతో పర్యటనలు ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

 

ప్రపంచంలోనే అతిపెద్ద ఆద్యాత్మిక కార్యక్రమం భారతదేశంలో జరుగుతోంది. 144 ఏళ్లకు ఓసారి ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా జరుగుతుంది… కాబట్టి యావత్ దేశం ఈ మహాకార్యంలో పాల్గొనడం మహద్భాగ్యంగా భావిస్తారు. ఇందులో పాల్గొని పవిత్ర గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో పుణ్యస్నానం చేయాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. విదేశీయులు సైతం ఈ మహా కుంభమేళాను చూసేందుకు తరలివస్తుంటారు.

 

ఇలా గత నెల రోజులుగా ప్రయాగరాజ్ లో గంగానది తీరం జనసంద్రాన్ని తలపిస్తోంది. జనవరి 13, 2025న ప్రారంభమైన ఈ మహా కుంభమేళాలో ఇప్పటివరకు 40 కోట్లమమందికిపైగా పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా పది పదిహేను రోజుల సమయం వుంది… ఇంతలో మరో 5 నుండి 10 కోట్ల మంది వస్తారని అంచనా.మొత్తంగా కుంభమేళా ముగిసేనాటికి 50 కోట్లమంది ప్రయాగరాజ్ ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు.

 

మహా కుంభమేళాలో ఇప్పటికే మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి అమృత స్నానాలు ముగిసాయి. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 12న అంటే రేపు బుధవారం మాఘ పౌర్ణమి రోజున సంగమ స్నానం చేసేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో దేశ నలుమూలల నుండి తండోపతండోలుగా భక్తులు తరలివస్తున్నారు. ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరగడంతో ప్రయాగరాజ్ కు వెళ్లే రోడ్లన్ని వాహనాలతో నిండిపోయి రద్దీగా మారాయి. స్వయంగా మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రయాగరాజ్ కు వెళ్లేవారు రెండురోజులు ఆగాలని సూచిస్తున్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.

Tags: #KumbhMela2025 #Prayagraj #Vehicles #Devotees #TeluguNews #News #WorldBiggestTrafficJam
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Pawan Kalyan: సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర

Next Post

AP Govt :నిరుద్యోగుల‌కు ఏపీ ప్ర‌భుత్వం తీపి క‌బురు

Related Posts

LockupDeath:చట్టం చేతుల్లో ప్రాణం సురక్షితమేనా? లాకప్ డెత్‌లపై మళ్లీ మిన్నంటిన చర్చ
Andhra Pradesh

LockupDeath:చట్టం చేతుల్లో ప్రాణం సురక్షితమేనా? లాకప్ డెత్‌లపై మళ్లీ మిన్నంటిన చర్చ

HyderabadMetro
Big Story

HyderabadMetro:రేవంత్-కేంద్ర మంత్రుల భేటీ ఫలితం.. హైదరాబాద్ మెట్రో విస్తరణకు అడుగులు వేగం

CrimeNews
Big Story

CrimeNews:ప్రియుడితో కలిసి కాబోయే భర్తను లోయలో తోసేసిందా? పుణే కేతన్ మృతి కేసు మిస్టరీ ఛేదన

APNews
Andhra Pradesh

APNews:కాపులకు ద్రోహి జగన్.. చంద్రబాబే నిజమైన మేలు చేసిన నేత: మంత్రి నిమ్మల రామానాయుడు

NEET2026
Big Story

NEET2026:నీట్ పరీక్షలో ఈసారి పటిష్ట భద్రత.. 20 లక్షలకు పైగా అభ్యర్థులు పాల్గొన్న రీ-ఎగ్జామినేషన్

YogaAndhra2026
Andhra Pradesh

YogaAndhra2026:జంక్ ఫుడ్‌కు గుడ్‌బై.. యోగా, ప్రకృతి ఆహారంతో ఆరోగ్యవంతమైన జీవితం: సీఎం చంద్రబాబు పిలుపు

Next Post
AP Govt :నిరుద్యోగుల‌కు ఏపీ ప్ర‌భుత్వం తీపి క‌బురు

AP Govt :నిరుద్యోగుల‌కు ఏపీ ప్ర‌భుత్వం తీపి క‌బురు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

LockupDeath:చట్టం చేతుల్లో ప్రాణం సురక్షితమేనా? లాకప్ డెత్‌లపై మళ్లీ మిన్నంటిన చర్చ

LockupDeath:చట్టం చేతుల్లో ప్రాణం సురక్షితమేనా? లాకప్ డెత్‌లపై మళ్లీ మిన్నంటిన చర్చ

Sshhh3

Sshhh3: పోనమ్ బజ్వా గ్లామర్ ట్రీట్.. ఆహా ఓటీటీలో హాట్ టాపిక్‌గా మారిన బోల్డ్ వెబ్ సిరీస్

HyderabadMetro

HyderabadMetro:రేవంత్-కేంద్ర మంత్రుల భేటీ ఫలితం.. హైదరాబాద్ మెట్రో విస్తరణకు అడుగులు వేగం

CrimeNews

CrimeNews:ప్రియుడితో కలిసి కాబోయే భర్తను లోయలో తోసేసిందా? పుణే కేతన్ మృతి కేసు మిస్టరీ ఛేదన

Recent News

LockupDeath:చట్టం చేతుల్లో ప్రాణం సురక్షితమేనా? లాకప్ డెత్‌లపై మళ్లీ మిన్నంటిన చర్చ

LockupDeath:చట్టం చేతుల్లో ప్రాణం సురక్షితమేనా? లాకప్ డెత్‌లపై మళ్లీ మిన్నంటిన చర్చ

Sshhh3

Sshhh3: పోనమ్ బజ్వా గ్లామర్ ట్రీట్.. ఆహా ఓటీటీలో హాట్ టాపిక్‌గా మారిన బోల్డ్ వెబ్ సిరీస్

HyderabadMetro

HyderabadMetro:రేవంత్-కేంద్ర మంత్రుల భేటీ ఫలితం.. హైదరాబాద్ మెట్రో విస్తరణకు అడుగులు వేగం

CrimeNews

CrimeNews:ప్రియుడితో కలిసి కాబోయే భర్తను లోయలో తోసేసిందా? పుణే కేతన్ మృతి కేసు మిస్టరీ ఛేదన

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info