ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home National

Droupadi Murmu :త్రివేణి సంగమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుణ్యస్నానం

Droupadi Murmu :త్రివేణి సంగమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుణ్యస్నానం
ADVERTISEMENT

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా ప్రసిద్ధిచెందిన మహా కుంభమేళాకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెళ్లారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించి, గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వేదికగా జరుగుతోన్న మహా కుంభమేళాలో.. గంగా, యమున, సరస్వతీ నదుల సంగమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుణ్యస్నానాలు ఆచరించారు. త్రివేణీ సంగమం వద్దకు బోటులో వెళ్లారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం చేశారు. రాష్ట్రపతి మహా కుంభమేళా పర్యటనలో ఆమె వెంట ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనంది బెన్‌ పటేల్‌ ఉన్నారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత.. అక్కడే ఉన్న పక్షులకు ఆహారం కూడా అందించారు రాష్ట్రపతి.

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం పది గంటలకు రాష్ట్రపతి ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్నారు. రాష్ట్రపతి మహా కుంభమేళా పర్యటన సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.సోమవారం ఉదయమే ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ పుష్పగుచ్చాలు అందించి ఘనస్వాగతం పలికారు.

విమానాశ్రయం నుంచి రాష్ట్రపతితో పాటు.. యూపీ సీఎం, గవర్నర్‌ కూడా త్రివేణీ సంగమానికి బోటులో వెళ్లారు. త్రివేణి సంగమం వద్ద ఉన్న పక్షులకు రాష్ట్రపతి ముర్ము.. ఆహారం అందించారు. త్రివేణీ సంగమం వద్ద పవిత్ర స్నానం ఆచరించారు. అక్కడే గంగమ్మ తల్లికి రాష్ట్రపతి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రపతి పరర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ప్రయాగ్‌ రాజ్‌ మహా కుంభమేళాకు వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఎనిమిది గంటల పాటు అక్కడే ఉండబోతున్నారు. బడే హనుమాన్‌ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత అక్ష యవత్‌ వృక్షాన్ని కూడా రాష్ట్రపతి దర్శించుకుంటారు. అనంతరం మహా కుంభమేళాలో ఏర్పాటు చేసిన డిజిటల్‌ కుంభ్‌ అనుభవ్‌ సెంటర్‌ను రాష్ట్రపతి పరిశీలిస్తారు. సాయంత్రం 5.45 గంటలకు రాష్ట్రపతి ప్రయాగ్‌రాజ్‌ నుంచి ఢిల్లీకి విమానంలో బయలుదేరి వెళ్తారు.

గత నెల 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభమేళా 45 రోజుల పాటు కొనసాగనుంది. ఈనెల 26వ తేదీన మహా కుంభమేళా ముగుస్తుంది. మహా కుంభమేళా ప్రారంభమైనప్పటినుంచీ ఇప్పటి వరకు 44 కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. కుంభమేళా ముగిసే నాటికి మరో ఆరు కోట్ల మందికి పైగా భక్తులు ప్రయాగ్‌ రాజ్‌ తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కుంభమేళా నిత్యం కిక్కిరిసిపోతోంది. ప్రయాగ్‌ రాజ్‌కు వెళ్లే ప్రతి దారిలోనూ ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. ప్రయాగ్‌రాజ్‌ చేరుకోవడానికి గంటలు, పూటలు, రోజుల సమయం పడుతోంది.

కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌..

మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తుతుంటంతో ప్రయాగ్‌రాజ్‌ చేరుకునే అన్ని రోడ్డు మార్గాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది. 25 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్థంభించిపోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రయాగ్‌రాజ్‌కు దారి తీసే వారణాసి, లక్నో, కాన్పూర్‌, రేవా మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రయాగ్‌రాజ్‌కు దారితీసే ఏడు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌ను 20 కిలోమీటర్ల ముందే నిలిపివేస్తున్నారు. దీంతో పుణ్యస్నానాలాచరించే సంగమ ప్రాంతానికి వెళ్లేందుకు భక్తులు కనీసం 20 కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని తెలిసింది. రద్దీని నియంత్రించేందుకు అధికారులు మధ్యప్రదేశ్‌లోనే వాహనాలను నిలిపివేస్తున్నారు. కనీసం 50 వేల వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయని అంచనా. 48 గంటలుగా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయామని భక్తులు చెబుతున్నారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారి కోసం అధికారులు తాగునీరు, ఆహారంతో పాటు తాత్కాలిక వసతి ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ ను కొంత మేర అయినా నియంత్రించాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 14 వరకు ప్రయాగ్‌రాజ్‌ సంగం రైల్వేస్టేషన్‌ను మూసివేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఇంకా పదిహేను రోజులో మహాకుంభమేళా ముగియనున్న నేపధ్యంలో భక్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే దాదాపు 41 కోట్ల మంది భక్తులు మహాకుంభమేళాలలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి.

 

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Ari :ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘అరి’

Next Post

Modi :క్రికెటర్స్ పై మోదీ ప్రశంసలు

Related Posts

MaoistLeader
Big Story

MaoistLeader:మావోయిస్టులకు భారీ దెబ్బ: కీలక నేత దేవా (దేవన్న) లొంగుబాటు

NewSyllabus
Andhra Pradesh

NewSyllabus:1–8 తరగతుల సిలబస్‌లో భారీ మార్పులు – ఎన్సీఈఆర్టీకి అనుగుణంగా పాఠ్యపుస్తకాల పునర్‌రూపకల్పన

#500KiKku, #NewYearCelebrations, #NewYearDrinks, LiquorSales, #BeerSales, #WineShops, #Bars, #ExciseDepartment, #StateRevenue, #CroresIncome, #DrunkNight, #PartyMood, #YearEndCelebrations, #PublicSpending, #BreakingNews, #TeluguNews
Andhra Pradesh

LiquorSales:న్యూఇయర్‌ నైట్‌లో రాష్ట్రం మొత్తం మత్తులో మునిగింది – కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు, ఖజానాకు భారీ ఆదాయం

Bellary
Big Story

Bellary:గాలి జనార్దన్‌రెడ్డిపై కాల్పుల కలకలం – బళ్లారిలో ఉద్రిక్త పరిస్థితి

Pawan Kalyan
Andhra Pradesh

Pawan Kalyan | వోట్లు తెచ్చిన పవన్… అధికారం వచ్చాక పరిమిత పాత్రేనా?

Priyanka Gandhi
Latest

Priyanka Gandhi | గాంధీ కుటుంబంలో శుభకార్యం.. ప్రియాంక గాంధీ కుమారుడికి నిశ్చితార్థం

Next Post
Modi :క్రికెటర్స్ పై మోదీ ప్రశంసలు

Modi :క్రికెటర్స్ పై మోదీ ప్రశంసలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Legacy

Legacy:మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ‘లెగసీ’ – రాజకీయ వారసత్వం చుట్టూ ఉత్కంఠభరిత డ్రామా

Akhanda2

Akhanda2:వాయిదా ప్రభావం ‘అఖండ–2’పై… కలెక్షన్లలో 20% దెబ్బ?

IranRevolution

IranRevolution:ఇరాన్‌లో విప్లవ ముంగిట ప్రజలు – వ్యవస్థ మార్పుకు నినాదాలు

MaoistLeader

MaoistLeader:మావోయిస్టులకు భారీ దెబ్బ: కీలక నేత దేవా (దేవన్న) లొంగుబాటు

Recent News

Legacy

Legacy:మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ‘లెగసీ’ – రాజకీయ వారసత్వం చుట్టూ ఉత్కంఠభరిత డ్రామా

Akhanda2

Akhanda2:వాయిదా ప్రభావం ‘అఖండ–2’పై… కలెక్షన్లలో 20% దెబ్బ?

IranRevolution

IranRevolution:ఇరాన్‌లో విప్లవ ముంగిట ప్రజలు – వ్యవస్థ మార్పుకు నినాదాలు

MaoistLeader

MaoistLeader:మావోయిస్టులకు భారీ దెబ్బ: కీలక నేత దేవా (దేవన్న) లొంగుబాటు

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info