• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Telangana: నకిలీ వీలునామా సృష్టించిన బంధువులు.. రూ.వంద కోట్ల విలువైన ఆస్తి కాజేత.. ఫోరెన్సిక్ నివేదికతో గుట్టురట్టు!

Telangana: నకిలీ వీలునామా సృష్టించిన బంధువులు.. రూ.వంద కోట్ల విలువైన ఆస్తి కాజేత.. ఫోరెన్సిక్ నివేదికతో గుట్టురట్టు!

వారసులు లేని భూ యజమాని చనిపోయినట్లు తెలియగానే, అతని సమీప బంధువులు నకిలీ పత్రాలు సృష్టించారు. ఆపై రూ.వంద కోట్లకు పైగా విలువైన ఆస్తిని కాజేశారు. ఫోరెన్సిక్‌ పరీక్షల్లో వీలునామా నకిలీదని తేలడంతో ఈ విషయం బయటపడింది. నకిలీ పత్రాలు సృష్టించిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్ స్టేషన్​ పరిధిలో రెండ్రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వారసులమని చెప్పి :చేవెళ్ల మండలం పామెన గ్రామానికి చెందిన పట్లోళ్ల (ముత్తెగారి) ప్రతాప్‌రెడ్డి భూస్వామి. ఇతనికి 100 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రతాప్‌రెడ్డికి వివాహమైనా సంతానం లేదు. పదేళ్ల కిందట భార్య అనసూయ మరణించగా, 2018లో ప్రతాప్‌రెడ్డి కూడా మరణించారు. దూరపు బంధువులు, రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం ఫిరోజ్‌గూడకు చెందిన గుమ్మల జగన్మోహన్‌ రెడ్డి అలియాస్‌ మోహన్‌ రెడ్డి(67), అతని భార్య సురేఖ (60), వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలానికి చెందిన పట్లోళ్ల రామకృష్ణారెడ్డి, యాదాద్రి జిల్లా తంగడపల్లి గ్రామానికి చెందిన ఇందిరాదేవి, గుమ్మళ్ల ప్రసన్న, గుమ్మల అనంత్‌రెడ్డి, గుమ్మల సత్య నారాయణరెడ్డి, గుమ్మల మధుసూదన్‌రెడ్డి తదితరులంతా కలిసి పథకం వేశారు.

దత్తత తీసుకున్నారని నమ్మించి :మోహన్‌ రెడ్డి, సురేఖ దంపతులు ప్రతాప్‌రెడ్డికి తల్లి తరఫు బంధువులు. ప్రతాప్‌రెడ్డి తనను దత్తత తీసుకున్నారని, ఆధార్, రేషన్‌ కార్డులు, ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్​లను మోహన్​రెడ్డి సృష్టించాడు. 2018 అక్టోబరు 9న ప్రతాప్‌రెడ్డి మరణించగా, అంతకు ఏడాది ముందు అనగా 2017 డిసెంబరు 3న ఆయన ఒక వీలునామా రాశారని, దాని ప్రకారం మరణానంతరం భూములు, ఆస్తులన్నీ తనకే చెందుతాయని ఇందుకు రామకృష్ణారెడ్డి, ఇందిరాదేవి సాక్ష్యమని నకిలీ పత్రం సృష్టించాడు.

రెవెన్యూ అధికారులను నమ్మించి :50కి పైగా ఎకరాలను మోహన్‌ రెడ్డి, సురేఖల పేర్ల మీదికి, మిగిలిన భూమిని ఇతర నిందితుల పేర్ల మీదకు బదిలీ చేయించుకున్నారు. ప్రతాప్‌రెడ్డి బ్యాంకు ఖాతాలోని రూ.19 లక్షలు విత్‌డ్రా చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రతాప్‌రెడ్డి తండ్రి తరఫు బంధువు పట్లోళ్ల రామేశ్వర్‌ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పరిశీలించిన కోర్టు కేసు నమోదు చేసి వీలునామా అసలైందో కాదో తేల్చాలని పోలీసులను ఆదేశించింది.

నివేదికతో గుట్టు రట్టు :2023 సెప్టెంబరు 7న చేవెళ్ల పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. పోలీసులు మోహన్‌రెడ్డి సమర్పించిన వీలునామాను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. ఈ పత్రం నకిలీదని తేలింది. ప్రతాప్‌ రెడ్డి ఇతర సంతకాలతో పోల్చి చూడగా, ఫోర్జరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. దీనికితోడు 2017కు ముందు మోహన్‌రెడ్డి వద్ద ఉండే రేషన్, ఆధార్‌ కార్డుల్లో తండ్రి పేరు హనుమంతురెడ్డి అని ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు రెండ్రోజుల క్రితం మోహన్‌ రెడ్డి ఆయన భార్య సురేఖను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు.

Tags: #BreakingNewsTG#Chevella#ChevellaNews#ChevellaPropertyRow#ChevellaUpdates#CrimeNewsTelangana#FamilyDispute#ForgedPropertyCase#ForgeryCaseTG#LegalDispute#PropertyForgery#PropertyFraud#PropertyScam#RelativesPropertyDispute#StolenProperty#TelanganaCrime#TelanganaNews#TeluguNews#TGPropertyScam
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Anita Ayub: పిచ్చిగా ప్రేమించిన దావూద్ ఇబ్ర‌హీం

Next Post

WhatsApp: డిలీట్ మెసేజ్‌లు చదవాలని ఉందా?

Related Posts

Sajjala Ramakrishna Reddy:ఇలా ఎలా ?
Andhra Pradesh

Sajjala Ramakrishna Reddy:ఇలా ఎలా ?

Pragya Jaiswal: స్ట‌న్నింగ్ ఫోజుల‌తో..!
Entertainment

Pragya Jaiswal: స్ట‌న్నింగ్ ఫోజుల‌తో..!

WhatsApp: డిలీట్ మెసేజ్‌లు చదవాలని ఉందా?
Big Story

WhatsApp: డిలీట్ మెసేజ్‌లు చదవాలని ఉందా?

Anita Ayub: పిచ్చిగా ప్రేమించిన దావూద్ ఇబ్ర‌హీం
Entertainment

Anita Ayub: పిచ్చిగా ప్రేమించిన దావూద్ ఇబ్ర‌హీం

Mithun Reddy: కేసులకు భయపడే ప్రసక్తి లేదు
Andhra Pradesh

Mithun Reddy: కేసులకు భయపడే ప్రసక్తి లేదు

Prashant Kishor: రియల్ పాలిటిక్స్.. అసలైన కష్టాలు..!
Big Story

Prashant Kishor: రియల్ పాలిటిక్స్.. అసలైన కష్టాలు..!

Next Post
WhatsApp: డిలీట్ మెసేజ్‌లు చదవాలని ఉందా?

WhatsApp: డిలీట్ మెసేజ్‌లు చదవాలని ఉందా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Sajjala Ramakrishna Reddy:ఇలా ఎలా ?

Sajjala Ramakrishna Reddy:ఇలా ఎలా ?

Pragya Jaiswal: స్ట‌న్నింగ్ ఫోజుల‌తో..!

Pragya Jaiswal: స్ట‌న్నింగ్ ఫోజుల‌తో..!

WhatsApp: డిలీట్ మెసేజ్‌లు చదవాలని ఉందా?

WhatsApp: డిలీట్ మెసేజ్‌లు చదవాలని ఉందా?

Telangana: నకిలీ వీలునామా సృష్టించిన బంధువులు.. రూ.వంద కోట్ల విలువైన ఆస్తి కాజేత.. ఫోరెన్సిక్ నివేదికతో గుట్టురట్టు!

Telangana: నకిలీ వీలునామా సృష్టించిన బంధువులు.. రూ.వంద కోట్ల విలువైన ఆస్తి కాజేత.. ఫోరెన్సిక్ నివేదికతో గుట్టురట్టు!

Recent News

Sajjala Ramakrishna Reddy:ఇలా ఎలా ?

Sajjala Ramakrishna Reddy:ఇలా ఎలా ?

Pragya Jaiswal: స్ట‌న్నింగ్ ఫోజుల‌తో..!

Pragya Jaiswal: స్ట‌న్నింగ్ ఫోజుల‌తో..!

WhatsApp: డిలీట్ మెసేజ్‌లు చదవాలని ఉందా?

WhatsApp: డిలీట్ మెసేజ్‌లు చదవాలని ఉందా?

Telangana: నకిలీ వీలునామా సృష్టించిన బంధువులు.. రూ.వంద కోట్ల విలువైన ఆస్తి కాజేత.. ఫోరెన్సిక్ నివేదికతో గుట్టురట్టు!

Telangana: నకిలీ వీలునామా సృష్టించిన బంధువులు.. రూ.వంద కోట్ల విలువైన ఆస్తి కాజేత.. ఫోరెన్సిక్ నివేదికతో గుట్టురట్టు!

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info