వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సంబంధాల కారణంగా పలువురు హత్యలకు గురవుతుంటే ఇంకొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఖమ్మంలో వివాహేతర సంబంధం కారణంగా కట్టుకున్న భర్తనే తన ప్రియుడితో కలిసి కడతేర్చింది ఓ ఇల్లాలు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ముత్తగూడెంలో శ్రీనివాసరావు అనే వ్యక్తి ఓ స్వీటు షాపులో పనిచేస్తున్నాడు. ఇతడి భార్యకు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం వుంది. భర్త దుకాణానికి వెళ్లగానే అతడికి ఫోన్ చేసి ఏకాంతంగా గడపడం చేస్తున్నారు. ఐతే ఈ విషయం భర్తకు తెలియడంతో భార్యను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు శ్రీనివాసరావు.
తమ ఏకాంతానికి భర్త అడ్డుగా వున్నాడనీ, అతడిని అడ్డు తొలగిస్తే హాయిగా ఎంజాయ్ చేయవచ్చని ప్రియుడితో చెప్పింది సదరు వివాహిత. ఆ ప్రకారం ప్రణాళిక వేసి ముగ్గురు వ్యక్తులకు లక్ష రూపాయలు సుపారీ ఇచ్చినట్లు సమాచారం. దుండగులు ముగ్గురు ఈ నెల 6న ఇంటికి తిరిగి వస్తున్న శ్రీనివాసరావుపై దాడి చేసి చంపి పక్కనే కాల్వలోకి తోసేసారు. ఐతే కాలవ ఒడ్డున చెప్పులు, బట్టలు వుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం ఆ కాల్వలో శ్రీనివాసరావు మృతదేహం తేలడంతో పోలీసులు దాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈలోపుగానే దర్యాప్తు చేయగా వాస్తవం బయటపడింది. నిందతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.


















