ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

CMRevanthReddyJapanTour: సుమారు 30వేల ఉద్యోగాలు..12వేల కోట్ల పెట్టుబడులు

CMRevanthReddyJapanTour: సుమారు 30వేల ఉద్యోగాలు..12వేల కోట్ల పెట్టుబడులు
ADVERTISEMENT

జపాన్‌లో వారం రోజుల పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం నేడు హైదరాబాద్ రానుంది. ఈనెల 15న హైదరాబాద్ నుంచి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, ఉన్నతాధికారులు, జపాన్​లో వివిధ నగరాల్లో ప్రముఖ సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. ఈ పర్యటనలో మొత్తం 12 వేల 62 కోట్ల రూపాయల పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా తెలంగాణలో దాదాపు 30,500 ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

హైదరాబాద్ ఫ్యూచర్‌సిటీలో 600 ఎకరాల్లో సుమారు వెయ్యి కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు మారుబెనీ సంస్థ ముందుకొచ్చింది. భవిష్యత్తులో ఈ మొత్తం రూ.5,000 కోట్లకు చేరుకుందని అంచనా వేసింది. హైదరాబాద్‌లో రూ.10,500 కోట్లతో భారీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు జపాన్‌కు చెందిన ఎన్‌టీటీ డేటా, నెయిసా ముందుకొచ్చాయి. హైదరాబాద్ శివారులోని రుద్రారం వద్ద 562 కోట్ల రూపాయలతో మరో ఫ్లాంట్ ఏర్పాటు చేసేందుకు జపాన్ కంపెనీ తోషిబా ముందుకొచ్చింది. రుద్రారంలో ఇప్పటికే రెండు ఫ్యాక్టరీలను తొషిబా నిర్వహిస్తోంది. టోక్యోలోని సుమిద రివర్ ఫ్రంట్‌ను మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి బృందం పరిశీలించింది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ నెల 16న జపాన్‌ వెళ్లిన సీఎం బృందం, వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ఆహ్వానించింది. ఈ పర్యటన ఫలితంగా మొత్తం రూ. 12,062 కోట్ల పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోవడం గమనార్హం. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి హైదరాబాద్‌ చేరుకున్నారు.శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరిన సీఎం రేవంత్‌కు కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్ర యువతకు భారీగా ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం, సుమారు 35,000 ఉద్యోగాలు ఈ పెట్టుబడుల ద్వారా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ, పరిశ్రమల రంగాల్లో యువతకు గేట్లు తెరుచుకుంటాయన్న ఆశ కలుగుతోంది. అభివృద్ధిలో తెలంగాణను ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ ఒప్పందాలను ప్రభుత్వం కీలకమైన అడుగుగా పేర్కొంది.

జపాన్‌కు చెందిన మారుబెని కంపెనీ హైదరాబాద్‌ ఫ్యూచర్‌ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్‌ ఇండస్ట్రియల్‌ పార్కును స్థాపించేందుకు రూ. 1,000 కోట్ల పెట్టుబడితో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది మానవ వనరులకు అనుగుణంగా ఆధునిక పరిశ్రమలకు కేంద్రంగా మారనుంది. ఇదే సమయంలో, ఎన్టీటీ డేటా, నెయిసా సంస్థలతోనూ రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 10,500 కోట్ల పెట్టుబడికి ఒప్పందం చేసుకుంది.వీటి ద్వారా హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మొత్తం పర్యటన ద్వారా సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణలో పెట్టుబడుల హబ్‌గా అభివృద్ధి చెందించాలన్న దిశగా మరో కీలక ఘట్టం ప్రారంభించినట్లైంది. జపాన్ సంస్థలు తెలంగాణపై చూపిన ఆసక్తి, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులకు బాటలు వేయవచ్చన్న నమ్మకాన్ని కలిగిస్తోంది.

జపాన్‌లో తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు పలు కంపెనీలతో ముఖ్యమంత్రి బృందం ఒప్పందాలు చేసుకుంది. టీఈఆర్‌ఎన్‌, రాజ్‌ గ్రూప్‌ ఏజెన్సీలతో రాష్ట్ర కార్మిక శాఖ పరిధిలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్… టామ్‌కామ్‌ ఒప్పందాలు జరిగాయి. హైదరాబాద్‌లో ఎకోటౌన్ అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర బృందం జపాన్‌లో పర్యావరణ హిత కిటాక్యూషు నగరాన్ని సందర్శించి.. ఈఎక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, పీ9 ఎల్ఎల్‌సీ, నిప్పాన్ స్టీల్ ఇంజినీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. కిటాక్యూషు మాదిరిగా హైదరాబాద్‌ను శుభ్రమైన, సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు జరిగాయి.టోక్యోలోని సుమిద రివర్ ఫ్రంట్, కిటాక్యూషులోని మురాసాకి రివర్ ఫ్రంట్‌లను సీఎం బృందం సందర్శించింది. మూసీ పునరుజ్జీవనం కోసం అనుసరించాల్సిన విధానాలపై అధ్యయనం చేసింది. నిన్న హిరోషిమా నగరాన్ని సందర్శంచి డిప్యూటీ గవర్నర్, అసెంబ్లీ స్పీకర్‌ను ముఖ్యమంత్రి బృందం కలిసింది. హిరోషిమా, తెలంగాణ మధ్య సంబంధాలపై వారు చర్చించారు.

Tags: #CMRevanthReddy#DigitalTelangana#IntelligentDataCentres#RevanthInJapan#RevanthJapanVisit#RevanthReddyAbroad#SmartTelangana#TechDrivenTelangana#TelanganaOnGlobalStage#TelanganaTechHub
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

VeeraiahMurderCase:టీడీపీ నేత వీరయ్య చౌదరికి సీఎం చంద్రబాబు నివాళి

Next Post

Peddi Movie: అది నెక్స్ట్ లెవెల్ లో..!

Related Posts

KayaduLohar
Entertainment

KayaduLohar:సోషల్ మీడియాకు గుడ్‌బై చెప్పిన కాయదు లోహర్.. అసలు ఏమైందబ్బా?

NEET2026
Big Story

NEET2026:నీట్ పరీక్షలో ఈసారి పటిష్ట భద్రత.. 20 లక్షలకు పైగా అభ్యర్థులు పాల్గొన్న రీ-ఎగ్జామినేషన్

YogaAndhra2026
Andhra Pradesh

YogaAndhra2026:జంక్ ఫుడ్‌కు గుడ్‌బై.. యోగా, ప్రకృతి ఆహారంతో ఆరోగ్యవంతమైన జీవితం: సీఎం చంద్రబాబు పిలుపు

FertilizerCrisis
Big Story

FertilizerCrisis:ఎరువుల సంక్షోభం భయం.. భారత్ ఇంకా ఎందుకు దిగుమతులపై ఆధారపడుతోంది?

HyderabadMetro
Big Story

MetroPhase2:హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై కేంద్రానికి రేవంత్ మరో లేఖ.. కిషన్ రెడ్డిని కోరిన సీఎం

PawanKalyan
Andhra Pradesh

PawanKalyan:వైసీపీ రౌడీ మూకలకు పవన్ వార్నింగ్.. “తొక్కి నార తీస్తా”

Next Post
Ram Charan: బ్లాక్ బస్టర్ టార్గెట్ తో పెద్ది

Peddi Movie: అది నెక్స్ట్ లెవెల్ లో..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

KayaduLohar

KayaduLohar:సోషల్ మీడియాకు గుడ్‌బై చెప్పిన కాయదు లోహర్.. అసలు ఏమైందబ్బా?

NEET2026

NEET2026:నీట్ పరీక్షలో ఈసారి పటిష్ట భద్రత.. 20 లక్షలకు పైగా అభ్యర్థులు పాల్గొన్న రీ-ఎగ్జామినేషన్

YogaAndhra2026

YogaAndhra2026:జంక్ ఫుడ్‌కు గుడ్‌బై.. యోగా, ప్రకృతి ఆహారంతో ఆరోగ్యవంతమైన జీవితం: సీఎం చంద్రబాబు పిలుపు

FertilizerCrisis

FertilizerCrisis:ఎరువుల సంక్షోభం భయం.. భారత్ ఇంకా ఎందుకు దిగుమతులపై ఆధారపడుతోంది?

Recent News

KayaduLohar

KayaduLohar:సోషల్ మీడియాకు గుడ్‌బై చెప్పిన కాయదు లోహర్.. అసలు ఏమైందబ్బా?

NEET2026

NEET2026:నీట్ పరీక్షలో ఈసారి పటిష్ట భద్రత.. 20 లక్షలకు పైగా అభ్యర్థులు పాల్గొన్న రీ-ఎగ్జామినేషన్

YogaAndhra2026

YogaAndhra2026:జంక్ ఫుడ్‌కు గుడ్‌బై.. యోగా, ప్రకృతి ఆహారంతో ఆరోగ్యవంతమైన జీవితం: సీఎం చంద్రబాబు పిలుపు

FertilizerCrisis

FertilizerCrisis:ఎరువుల సంక్షోభం భయం.. భారత్ ఇంకా ఎందుకు దిగుమతులపై ఆధారపడుతోంది?

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info