• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Bhu Bharati: భారతి పోర్టల్‌ సేవలు అందుబాటులోకి

Bhu Bharati: భారతి పోర్టల్‌ సేవలు అందుబాటులోకి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ భారతి(Bhu Bharati) పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. ఈ పోర్టల్‌ లో పది మాడ్యూల్స్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్, నాలా, అప్పీల్, భూముల వివరాలు, భూముల మార్కెట్ విలువ, నిషేధిత భూములు, ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలు, ఇతరాల పేరిట ప్రత్యేక మాడ్యూల్స్‌ను పొందుపరిచారు. పోర్టల్‌ లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫొటోలు ఉన్నాయి. తెలంగాణ రాజముద్ర, తెలంగాణ రైసింగ్ లోగోలు, ప్రతి మాడ్యుల్లో ప్రత్యేకంగా రూపొందించిన తెలంగాణ తల్లితో కూడిన లోగోను పొందుపరిచారు. నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించిన ఈ భూభారతి పోర్టల్ ను… జూన్ 2వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి పోర్టల్‌ ను అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. భూవివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగానే తమ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న తపనతోనే ఈ చట్టాన్ని వారికి అంకితం చేస్తోందన్నారు. భూభారతి పోర్టల్‌ ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సోమవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘‘తెలంగాణ(Telangana) ప్రాంతంలో వందల ఏళ్ల నుంచి భూమి చుట్టూనే పోరాటాలు జరిగాయి. నాడు కుమురం భీం ‘జల్‌ జంగల్‌ జమీన్‌’ నినాదంతో పోరాటం చేసినా… నిజాంకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య పోరాటం చేసినా భూమితో వారికున్న అనుబంధం నుంచి పుట్టుకొచ్చినవే. ఆ పోరాటాల నుంచి ఏర్పడిన రెవెన్యూ చట్టాలు భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ భావించారు. భూమిపై చర్చ ఎప్పుడొచ్చినా బూర్గుల రామకృష్ణారావు దగ్గరి నుంచి పీవీ నరసింహారావు వరకు చేపట్టిన భూసంస్కరణలే గుర్తుకొస్తాయి. సీలింగ్‌ చట్టం తీసుకొచ్చి… జమీందార్లు, జాగీర్దార్ల నుంచి లక్షల ఎకరాలు తీసుకొని పేదలకు ఆత్మగౌరవం తెచ్చేలా పంచింది నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వమే. దాదాపు 65 ఏళ్లు 69 లక్షల భూకమతాలకు సంబంధించిన రికార్డులను రెవెన్యూ సిబ్బందే కాపాడారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉన్నఫళంగా రెవెన్యూ చట్టాలను మార్చాలని పాలకుల మెదడులో కలిగిన ఆలోచనతో ప్రవేశపెట్టిన ధరణి ఒక పీడకలలా మారింది. ఒక తహసీల్దార్‌ పైనే పెట్రోల్‌ పోసి తగలపెట్టే పరిస్థితి వచ్చింది. ధరణితో వచ్చిన మార్పులు ఇబ్రహీంపట్నంలో జంట హత్యలకు కారణమయ్యాయి. సిరిసిల్లలో తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఓ మహిళ తన తాళిబొట్టును లంచంగా ఇచ్చింది. ఈ సమస్యలన్నింటికీ రెవెన్యూ సిబ్బందే కారణమని చెప్పి నాటి పాలకులు వారిని దోషులుగా, దోపిడీదారులుగా చిత్రీకరించారు. గత ప్రభుత్వ హయాంలో చట్టాలను కొందరికే చుట్టాలుగా మార్చి వేల ఎకరాలను కొల్లగొట్టే ప్రయత్నం జరిగింది వాస్తవం కాదా? అందుకే మేం అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామని చెప్పాం. పేదలకు చుట్టంగా ఉండాలనే ఈరోజు నూతన ఆర్‌ఓఆర్‌ చట్టాన్ని తీసుకొచ్చాం. కోదండరెడ్డి నేతృత్వంలో వివిధ రాష్ట్రాల్లోని చట్టాలపై అధ్యయనం చేయించాం. నిజాం కాలం నుంచి అమలైన చట్టాలనూ పరిశీలించిన తర్వాతే భూ భారతిని తెచ్చాం. రెవెన్యూ అధికారులు ముందుగా నాలుగు పైలట్‌ మండలాల్లోని గ్రామాలకు వెళ్లి ప్రజల నుంచి సమాచారం సేకరిస్తారు.

మనిషికి ఆధార్‌ కార్డులాగే భూమికి భూధార్‌ తెచ్చాం. ప్రతి కమతానికో నంబరు ఇద్దాం. ప్లాట్లకు సరిహద్దులు నిర్ణయించినప్పుడు… వ్యవసాయ భూముల్ని పక్కాగా కొలిచి సరిహద్దులు నిర్ణయించడంలో పెద్ద సమస్య ఏముంటుంది? రాబోయే రోజుల్లో భూములకు పక్కాగా హద్దులు నిర్ణయించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూసుకుందాం. కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో రెవెన్యూశాఖపై సృష్టించిన అపోహల్ని తొలగించుకునే బాధ్యత మనందరిది అని మంత్రి పొంగులేటి అన్నారు.

Tags: #BhoomiRecords#BhuBharati#BhuBharatiTelangana#CMRevanthReddy#CongressGovt#DigitalLandRecords#FarmerRights#FarmersFirst#FarmersIssues#FarmersLands#LandDisputes#LandRecords#LandRights#MinisterPonguleti#PonguletiSrinivasReddy#revanthreddy#SupportFarmers#TelanganaFarmers#TelanganaLands
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Rohit Sharma: ముంబయి విమానాశ్రయంలో రోహిత్ శర్మ కుమారుడు

Next Post

Naga Chaitanya: మ‌రింత కేర్ పుల్ గా!

Related Posts

Cm ChandraBabu Naidu: ఇదే తొలిసారి..!
Andhra Pradesh

Cm ChandraBabu Naidu: ఇదే తొలిసారి..!

AP Ration Cards: ప్రభుత్వం కీలక ఆదేశాలు
Andhra Pradesh

AP Ration Cards: ప్రభుత్వం కీలక ఆదేశాలు

KTR: ఆశ్చర్యానికి గురిచేసింది!
Big Story

KTR: ఆశ్చర్యానికి గురిచేసింది!

Ys Jagan- KTR: ఆసక్తికర చర్చ..!
Big Story

Ys Jagan- KTR: ఆసక్తికర చర్చ..!

Naira Banerjee: అందాల విందు!
Entertainment

Naira Banerjee: అందాల విందు!

Vidya Balan: రాత్రికి రాత్రే అలా జరిగింది..!
Entertainment

Vidya Balan: రాత్రికి రాత్రే అలా జరిగింది..!

Next Post
Naga Chaitanya: మ‌రింత కేర్ పుల్ గా!

Naga Chaitanya: మ‌రింత కేర్ పుల్ గా!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Cm ChandraBabu Naidu: ఇదే తొలిసారి..!

Cm ChandraBabu Naidu: ఇదే తొలిసారి..!

AP Ration Cards: ప్రభుత్వం కీలక ఆదేశాలు

AP Ration Cards: ప్రభుత్వం కీలక ఆదేశాలు

KTR: ఆశ్చర్యానికి గురిచేసింది!

KTR: ఆశ్చర్యానికి గురిచేసింది!

Ys Jagan- KTR: ఆసక్తికర చర్చ..!

Ys Jagan- KTR: ఆసక్తికర చర్చ..!

Recent News

Cm ChandraBabu Naidu: ఇదే తొలిసారి..!

Cm ChandraBabu Naidu: ఇదే తొలిసారి..!

AP Ration Cards: ప్రభుత్వం కీలక ఆదేశాలు

AP Ration Cards: ప్రభుత్వం కీలక ఆదేశాలు

KTR: ఆశ్చర్యానికి గురిచేసింది!

KTR: ఆశ్చర్యానికి గురిచేసింది!

Ys Jagan- KTR: ఆసక్తికర చర్చ..!

Ys Jagan- KTR: ఆసక్తికర చర్చ..!

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info