ఏపీ రాజకీయాలు ఎప్పుడు కూడా ఎంతో సంచలనంగా ఉంటాయి. ఏపీ రాష్ట్ర రాజకీయాలలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా ఏడాది పూర్తి చేసుకుంది. ఇలా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంది? అలాగే వైసిపికి ప్రజలలో ఎలాంటి స్పందన ఉంది? ఈ ఏడాది కాలంలో వైసిపికి ఓటు బ్యాంకు పెరిగిందా లేదా అనే దానిపై ఎన్నో సర్వే సంస్థలు సర్వేల ద్వారా షాకింగ్ విషయాలను బయటపెట్టాయి.
ఇలా పలు సర్వే సంస్థలు సర్వేలను తెలియజేయడమే కాకుండా కూటమి ప్రభుత్వం కూడా తమ అనుకూల సర్వేల ద్వారా ఏడాది పాలన పై సర్వేలు చేయించడంతో సంచలన విషయాలు బయటపడ్డాయని తెలుస్తోంది. గత ఎన్నికలలో కూటమి పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే వైసీపీ ఎలాంటి పొత్తు లేకుండా సింగిల్ గానే పోటీ చేసింది. అయినప్పటికీ గతంలో 40% ఓటు బ్యాంక్ ఉంది. అయితే ఏడాది పాలన పూర్తి అయిన తర్వాత కూటమికి కాస్త వ్యతిరేకత ఏర్పడిందని వైసీపీకి అనుకూలత పెరిగిందని సర్వేలు తెలియజేస్తున్నాయి.
కూటమి ఏడాది పాలనలో ఇచ్చిన మాటపై నిలబడకపోవడం వ్యతిరేకతను పెంచింది.. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సూపర్ హిట్ హామీలను అమలు చేయకపోవడంతోనే వైసీపీ ఓటు బ్యాంకు పెరిగిందని పలు సర్వేలు తెలియజేస్తున్నాయి.చంద్రబాబు ఇచ్చిన హామీలలో చాలావరకు నెరవేర్చలేదు. దీనికి తోడు సంక్షేమం అనేది వైసిపితో పోల్చుకుంటే జీరో అని చెప్పాలి. దిగువ మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం నుంచి నేరుగా ఎలాంటి ఆర్థిక లబ్ధి లేదన్న నిరాశ నిస్పృహలో వారిలో కనిపిస్తున్నాయి. చంద్రబాబు హామీలు ఇస్తారు తప్ప వాటిని నెరవేర్చే టైం వచ్చేసరికి చేతులు ఎత్తేస్తారన్న అభిప్రాయం ప్రజలలో ఉందని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే కూటమీ ప్రభుత్వం పట్ల క్రేజ్ తగ్గిందన్న చర్చలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా వైసీపీ గత ఏడాదితో పోలిస్తే చాలా వరకు పుంజుకుంది అన్నమాట వాస్తవం.