సాధారణంగా ఈమధ్యకాలంలో సీరియల్ నటీనటులకు సైతం హీరోహీరోయిన్స్ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుంది. బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో టీవీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఓ హీరోయిన్ మాత్రం సొంతంగా ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసిందట. కొన్ని రోజులుగా ఈ విషయం గురించి ఫిల్మ్ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో తెగ ప్రచారం నడుస్తుంది. ఆమె గతంలో స్మాల్ స్క్రీన్ పై నటించి.. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొంది. ఈ షో ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం తమిళం సీరియల్స్ చేస్తుంది. ఆమె మరెవరో కాదండి.. టీవీ నటి ఆయేషా..
కొన్నాళ్లపాటు సీరియల్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం తమిళ్ హీరో విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లాయర్ చిత్రంలో నటిస్తుంది. అలాగే ఇటీవల జీ తమిళంలో వచ్చే సూపర్ క్వీన్ షోలో పాల్గొంది. ఇదివరకు తెలుగులో వచ్చిన సావిత్రమ్మ గారి కొడుకు సీరియల్లో ప్రధాన పాత్రల పోషించింది. ఆ తర్వాత తెలుగుతోపాటు తమిళంలోనూ పలు సీరియల్స్ చేసింది.
ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలలో ఈ బ్యూటీ ప్రైవేట్ జెట్ లో కూర్చుని ఫోటోలకు ఫోజులిచ్చింది. దీంతో ఇప్పుడు ఆమె సొంతంగా ఫ్లైట్ కొన్నారా ? అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు నెటిజన్స్. అయితే దీనిపై నిజం తెలియాల్సి ఉంది.
https://www.instagram.com/p/DK1XvMNTr6m/?igsh=ZjFkYzMzMDQzZg==