ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ముందు ముందు పుంజుకునేందుకు.. చేస్తున్న ప్రయత్నాలకు… సర్కా రు మరో రూపంలో గండికొడుతోంది ముఖ్యంగా ఎప్పుడైతే పుంజుకునేందుకు రెడీ.. అంటూ అడుగులు పడుతున్నాయో.. అప్పుడే ఏదో ఒక కేసు తెరమీదికి వస్తోంది. దీంతో సదరు కార్యక్రమం డైవర్ట్ అవుతోంది. ఉదాహరణకు ఫీజు రీయింబర్స్మెంటు, విద్యార్థుల సమస్యలపై ఉద్యమానికి పిలుపునిచ్చినప్పుడు.. మద్యం కేసులో తొలి అరెస్టు నమోదైంది. రాజ్ కసిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆ తర్వాత.. మిర్చి, పొగాకు రైతుల పక్షాన వాయిస్ వినిపించాలని జగన్ నిర్ణయించుకున్నప్పుడు.. కాకాణి అరెస్టు, అదేవిధంగా ఇతర నాయకులకు నోటీసులు ఇలా.. అవి యాదృచ్ఛికమే అయినా.. సర్కారు మా త్రం దూకుడుగానే ముందుకు సాగింది. తద్వారా.. వైసీపీ వ్యూహానికి ప్రతివ్యూహం అన్నట్టుగా.. ప్రభుత్వం వైపు నుంచి చర్యలు కనిపించాయి. దీంతో ప్రభుత్వంపై పోరాడేందుకు వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యూహ రచన ఎప్పటికప్పుడు డింకిలు కొడుతోంది. తాజాగా టీడీపీ సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
దీనికి ముందు వైసీపీ నాయకులు కూడా.. `బాబు మేనిఫెస్టో` పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కానీ, అటు ఆ కార్యక్రమం ఎలా ఉన్నా.. ఇటు టీడీపీ కార్యక్రమం మాత్రం అంతో ఇంతో ప్రజలకు చేరువ అయింది.కొన్ని చోట్ల వైసీపీ నాయకులపై విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాకుండా.. ఎందుకిలా చేస్తున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమం కూడా అనుకున్న విధంగా అయితే.. వైసీపీకి మైలేజీ తీసుకురాలేక పోయిందన్నది వాస్తవం.
ఈ పరిణామాల క్రమంలోనే వైసీపీ అంతర్మథనంలో పడింది. ఏం చేయాలి? ఎలా ముందుకు సాగాలి? అనే విషయంపై చర్చలు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టుకున్నా వెంటనే ఏదో ఒక కేసు తెరమీదికి రావడం.. దీంతో సదరు కార్యక్రమం పెద్దగా ప్రజలకు చేరడం లేదని నాయకులు గుర్తించారు. అందుకే.. ఈ సారి ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. అనుకున్న విధంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. త్వరలోనే జగన్ `సమరభేరి` పేరుతో కార్యక్రమానికి రెడీ అవుతున్నట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఎప్పటికప్పుడు.. ప్రజల్లోకి వస్తాననిచెప్పడం.. ఆ వెంటనే ఆయన దాని ని వాయిదా వేయడం తెలిసిందే. అయితే.. దీనివల్ల పార్టీ కేడర్ సహా.. నాయకులు కూడా డీలా పడుతు న్నారు. ఈ క్రమంలోనే జగన్ ప్రజల మధ్యకు రావాలన్న డిమాండ్ జోరుగా వినిపిస్తోంది. జగన్ ప్రజల మ ధ్యకు వస్తే.. ఆ ఊపు వేరేగా ఉంటుందని.. పార్టీ విషయంలోనూ.. ప్రజల విషయంలో మంచి జోష్ కనిపి స్తుందని అంచనా వేస్తున్నారు. అయితే.. ఈ విషయంలో జగన్ ఎప్పటికప్పుడు వెనుకంజ వేస్తున్నారు.
తాజాగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. త్వరలోనే ప్రజల మధ్యకు రావాలని నిర్ణయిం చుకున్నట్టు తాడేపల్లి వర్గాలు తెలిపాయి. దీనికి `సమరభేరి` పేరును దాదాపు ఖరారు చేసినట్టు సమాచా రం. ప్రజా సమస్యలపై సమరభేరితోపాటు.. కూటమి సర్కారు అక్రమాలు, అన్యాయాలపై కూడా సమర భేరి మోగించేందుకు జగన్ రెడీ అవుతున్నారని అంటున్నారు. వైసీపీ నాయకులను అన్యాయంగా కేసు ల్లో ఇరికించడంతో పాటు.. వారినిఅరెస్టు చేస్తున్న తీరును కూడా ఖండిస్తున్నారు.
ఇలా.. జగన్ సమరభేరి పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు తాడేపల్లి వర్గాల్లో చర్చ సాగు తోంది. ఈ కార్యక్రమం ద్వారా.. కోల్పోయిన ఓటు బ్యాంకుతో పాటు.. నాయకులను కూడా చేరువ చేసుకునే ప్రయత్నం చేస్తారని చెబుతున్నారు. గత ఎన్నికల తర్వాత.. కీలక నాయకులు పార్టీని వీడిపోయారు. అదేవిధంగా కేడర్లోనూ నిస్తేజం నెలకొంది. గతంలో టీడీపీ కార్యకర్తలు ఎలా అయితే.. బయటకు వచ్చేందుకు భయ పడ్డారో.. ఇప్పుడు వైసీపీ కేడర్ కూడా అలానే భయపడే పరిస్థితి నెలకొందన్న వాదన ఆ పార్టీ నాయకుల్లోనే వినిపిస్తోంది.
ఈ పరిణామాలకు చెక్ పెట్టేందుకే.. జగన్ ప్రజల మధ్యకు వస్తున్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఆయన షెడ్యూల్ ప్రకారం.. ఈ ఏడాది జనవరిలోనే ప్రజల మధ్యకు రావాలి. కానీ..నిరంతరంగా ఆయన ఈ పని చేయలేదు. కేవలం పొగాకు, మిర్చి, మామిడి రైతులను పరామర్శించేందుకు మాత్రమే పరిమితమయ్యా రు. కానీ.. ఇలా కంటితుడుపు కార్యక్రమాలు చేయడం వల్ల ప్రయోజనం లేదని జగన్ కు కీలక నాయకులు సూచించారు. దీంతో ఆయన ఇప్పటికిప్పుడు.. ప్రజల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇప్పటికిప్పుడు అన్నా కూడా.. మరో నెల రోజుల వరకు సమయం పట్టనున్నట్టు సమాచారం.