ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Varma : పిఠాపురంలో పొలిటికల్ హీట్

Varma : పిఠాపురంలో పొలిటికల్ హీట్
ADVERTISEMENT

పిఠాపురం వర్మకు పదవి రాకుండా కుట్రలే చేయలేదన్నారు ఏపీ మంత్రి నాదెండ్ల. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే పవన్ కళ్యాణ్ వల్లనేననంటూ బాంబ్‌ పేల్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే అది కేవలం జనసేన పార్టీ వల్లనేనన్నారు. తాజాగా కాకినాడలో కార్యకర్తల సమావేశంలో జనసేన ఎమ్మెల్యే, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అన్నారు. వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్ అని కొనియాడారు.

 

వాళ్ళ పార్టీ ఆయన విషయం లో నిర్ణయం తీసుకుంటుంది,ఆ పార్టీ అంతర్గత వ్యవహారం అన్నారు. వర్మ ని గౌరవించడం లో మాకు ఎటువంటి అభ్యంతరం లేదని క్లారిటీ ఇచ్చారు. వర్మ కి చెక్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉంటుందని చురకలు అంటించారు. పవన్ సెక్యూరిటీ విషయం లో డిపార్ట్మెంట్ తో పాటు పార్టీ పరంగా మేము కూడా చూసుకుంటామని ప్రకటించారు. సభా ప్రాంగణం లో 75 సి సి కెమెరా లు ఏర్పాటు చేస్తామన్నారు. పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడానికి ఈ సభ ఏర్పాటు చేసామని తెలిపారు.

 

ఎమ్మెల్సీ రాకపోవడంపై పిఠాపురం వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి తో 23 ఏళ్ళు అనుబంధం ఉందన్నారు. చంద్రబాబు ఆదేశాలు మేరకు పని చేస్తానని ప్రకటించారు. కొన్ని ఇబ్బందులు ఉంటాయని తెలిపారు. ప్రజలకు సేవ చేసే అవకాశం చంద్రబాబు ఇచ్చారని తెలిపారు. కూటమి విజయానికి నాకు అప్పగించిన బాధ్యతలు పూర్తి చేశానని తెలిపారు.

 

ఇదే అంశంపై కేఏ పాల్ చాలా సీరియస్‌ అయ్యారు. పిఠాపురం వర్మా కు ఎమ్మెల్సీ టికెట్‌ రాకపోవడంపై కేఏ పాల్ స్పందించారు. పిఠాపురం వర్మా.. నీకు బుద్ధుందా.. చంద్రబాబు మాట నిలబెట్టుకోడని అప్పుడే చెప్పాను కదా అంటూ మండిపడ్డారు. నేను చెప్పినట్లే పవన్ కళ్యాణ్ తన అన్నకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చాడన్నారు. పిఠాపురం వర్మకు తదుపరి జరిగే మొట్టమొదటి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే అవకాశం ఇస్తా అన్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్.

 

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను టీడీపీ ఆదివారం(మార్చి 9) ప్రకటించింది. సీనియర్లను పక్కన పెట్టి మరోసారి యువ నేతలకే స్థానం కల్పించింది టీడీపీ అధిష్టానం. ఏపీలో మొత్తం స్థానాలకు ఖాళీలు ఏర్పడగా, పొత్తులో భాగంగా జనసేనకు ఒక సీటు కేటాయించారు. మిగిలిన నాలుగు స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని భావించారు. అయితే చివరి నిమిషంలో బీజేపీకి ఒక సీటు కేటాయించారు.

 

టీడీపీ నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన కావలి గ్రీష్మ, యాదవ సామాజిక వర్గానికి చెందిన బీద రవిచంద్ర, బోయ సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయుడులను టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేసింది. జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఛాన్స్ దక్కగా, బీజేపీ నుంచి సోము వీర్రాజు పోటీ చేయనున్నారు.

 

టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో ఆశావహులు ఎమ్మెల్సీ టికెట్లు ఆశించారు. వీరిలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఉన్నారు. పొత్తులో భాగంగా పిఠాపురం సీటు జనసేనకు దక్కింది. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసి గెలిచారు. పవన్ కల్యాణ్ గెలుపునకు పొత్తులో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పనిచేశారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని టీడీపీ అధిష్టానం వర్మకు హామీ ఇచ్చిందని తెలుస్తోంది. తాజాగా మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ…వర్మకు ఛాన్స్ ఇవ్వలేదు.

 

సామాజిక వర్గాల వారీగా ముగ్గురికి అవకాశం కల్పిస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. పిఠాపురం వర్మకు అవకాశం కల్పించకపోవడంతో సోషల్ మీడియాలో ఓ వర్గం ఆయనకు మద్దతుగా ట్వీట్లు చేస్తుంది. వర్మ అసహనంతో ఉన్నారని, జనసేన నమ్మించి మోసం చేసిందని ట్వీట్లు చేస్తుంది. అయితే వైసీపీ మద్దతుదారులు కూటమిలో చిచ్చు పెట్టేందుకు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి.

 

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ రాకుండా జనసేన పార్టీ అడ్డుకుంటోందని, కూటమి ఐక్యతను దెబ్బతీయాలని కొంత మంది పనిగట్టుకుని మరీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని జనసేనకు మద్దతుగా పోస్టులు పెట్టే జనసేన శతగ్ని ట్వీట్ చేసింది. ఎస్వీఎస్ఎన్ వర్మకు ఉన్నత స్థానం కల్పించమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏనాడో చెప్పారని ప్రకటించింది. అయితే తమ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఎవరికి ఇవ్వాలన్న నిర్ణయం తెలుగుదేశం పార్టీ అధిష్టానం, సీఎం చంద్రబాబు తీసుకుంటారని, వారి పార్టీలో స్థితిగతుల ఆధారంగా ప్రాధాన్యతా క్రమంలో ఈ నిర్ణయాలు తీసుకుంటారని తెలిపింది.

 

తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాల విషయంలో జనసేన పార్టీ ఎందుకు జోక్యం చేసుకుంటుంది? అలాగే జనసేన పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యహారాల్లో టీడీపీ కూడా కలుగజేసుకోదని పేర్కొంది. ఇరు పార్టీల మధ్య పొత్తు స్నేహపూర్వక వాతావరణంలో, ఎవరి విలువ వారు కాపాడుకుంటూ హుందాగా ముందుకు వెళ్తుందని వెల్లడించింది. దీన్ని దెబ్బతీసేందుకు కొందరు చేసే ప్రయత్నలు వృథా ప్రయాసేనని తెలిపింది.

 

“ఎస్వీఎస్ఎన్ వర్మకు సముచిత స్థానం కల్పించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాక్షించారు. కానీ వర్మ టీడీపీ నాయకులు, వారి పార్టీలో పదవులు ఇవ్వడం అనేది పూర్తిగా వారి అంతర్గత విషయం. జనసేన అంతర్గత విషయాల్లో టీడీపీ., టీడీపీ అంతర్గత విషయాల్లో జనసేన కలగజేసుకోలేవు కనుక ఈ విషయంలో జనసేన పార్టీని నిందించడం సమాజసం కాదు అని తెలియజేసుకుంటున్నాను”- కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామ స్వామి.

 

టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మపై జనసేన పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం పవన్ కల్యాణ్‌ అడ్డా అన్న ఆయన…వర్మ చాలా సీనియర్ నేత అని, ఆయన విషయంలో టీడీపీ సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. అది టీడీపీ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. వర్మని గౌరవించడంలో జనసేనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు.

 

పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలు, నేతలతో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ భేటీ అయ్యారు. కార్యకర్తలతో భావోద్వేగంతో మాట్లాడారు. “పార్టీ ఇబ్బందులను మనం అర్థం చేసుకోవాలి. టీడీపీ అంతా ఒక కుటుంబం. చంద్రబాబుతో నాకు 23 ఏళ్ల అనుబంధం ఉంది. పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి. చంద్రబాబు, లోకేశ్ ఆదేశాలు, నిర్ణయాలకు నేను, నా కుటుంబం, పిఠాపురం టీడీపీ నేతలు ఎప్పుడూ శిరసావహిస్తాం. పార్టీ నేతలు, కార్యకర్తలకు అండగా ఉంటాం” అని వర్మ అన్నారు.

 

ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనకు ముందు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు టికెట్ ఆశావహులతో ఫోన్ లో మాట్లాడారని సమాచారం. సీటు ఎందుకు కేటాయించలేకపోయారో, సీఎం చంద్రబాబు మాటగా వారిని బుజ్జగించారని వార్తలు వచ్చాయి. ఎమ్మెల్సీ టికెట్లు రాకపోయేసరికి నేతలు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దేవినేనిఉమా, బుద్ద వెంకన్న, జవహర్, పీతల సుజాత, మోపిదేవి వెంకటరమణ ఇలా చాలా మంది ఎమ్మెల్సీ ఆశించారు. కానీ సామాజిక అంశాల మేరకు వీరిటి ఎమ్మెల్సీ టికెట్లు దక్కలేదని తెలుస్తోంది.

Tags: #AndhraPradesh#APpolitics#varamJanasena
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు

Next Post

Chandra Babu : బీసీలను మోసగించిన జగన్

Related Posts

TelanganaEducation
Big Story

TelanganaEducation:తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక సమర్పణ | సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు

APAssembly
Andhra Pradesh

APAssembly: సీఎం చంద్రబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు, రాయలసీమ–ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై కీలక ప్రకటన

T20WorldCup
Big Story

T20WorldCup:జింబాబ్వేపై భారత్ ఘన విజయం | 72 పరుగుల తేడాతో టీమిండియా సత్తా

IndiaHealth
Big Story

IndiaHealth:పాలు, కూరగాయలు, మసాలాల్లో రసాయనాలు – ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

RealLifeBichagadu
Andhra Pradesh

RealLifeBichagadu:భార్య ఆరోగ్యం కోసం భిక్షాటన చేస్తున్న అడ్వకేట్ జలందర్ రెడ్డి

IASTransfers
Big Story

IASTransfers:తెలంగాణలో భారీగా ఐఏఎస్ బదిలీలు | 45 మంది అధికారులకు కొత్త పోస్టింగులు

Next Post
Chandra Babu : బీసీలను మోసగించిన జగన్

Chandra Babu : బీసీలను మోసగించిన జగన్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

TelanganaEducation

TelanganaEducation:తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక సమర్పణ | సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు

APAssembly

APAssembly: సీఎం చంద్రబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు, రాయలసీమ–ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై కీలక ప్రకటన

T20WorldCup

T20WorldCup:జింబాబ్వేపై భారత్ ఘన విజయం | 72 పరుగుల తేడాతో టీమిండియా సత్తా

ViroshWedding

ViroshWedding:విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న రొమాంటిక్ & ఎలిగెంట్ సెలబ్రిటీ వెడ్డింగ్ హైలైట్స్

Recent News

TelanganaEducation

TelanganaEducation:తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక సమర్పణ | సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు

APAssembly

APAssembly: సీఎం చంద్రబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు, రాయలసీమ–ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై కీలక ప్రకటన

T20WorldCup

T20WorldCup:జింబాబ్వేపై భారత్ ఘన విజయం | 72 పరుగుల తేడాతో టీమిండియా సత్తా

ViroshWedding

ViroshWedding:విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న రొమాంటిక్ & ఎలిగెంట్ సెలబ్రిటీ వెడ్డింగ్ హైలైట్స్

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info