తెలుగుదేశం పార్టీ అధినేతగా నారా చంద్రబాబునాయు గత నాలుగు సంవత్సరాలుగా ఈ పార్టీ బరువు బాధ్యతలను మోస్తూ ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ యువతకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బాధ్యతలను కూడా యువనేత నారా లోకేష్ తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన అందరికీ వచ్చింది. ఇదే ఆలోచన విధానాన్ని చంద్రబాబు నాయుడు వద్ద కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇక ఇటీవల జరిగిన మహానాడు కార్యక్రమంలో భాగంగా కచ్చితంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కు పార్టీ పగ్గాలు అందచేస్తారని అందరూ భావించారు.
ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా మంత్రిగా కొనసాగుతున్న నారా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకోవాలని అందరూ భావిస్తున్నారు ఇలాంటి తరుణంలోనే చంద్రబాబు నాయుడు కూడా తన ఆలోచన విధానాన్ని తెలియజేశారు.పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతూనే, లోకేష్ విషయంలో మాత్రం పార్టీ నియమావళి, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం ఉంటుందని తెలిపారు.
తెలుగుదేశం పార్టీకి కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న ఈ నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తామని వీటి ప్రకారమే పార్టీ నేతలు అందరూ కూడా నడుచుకోవాల్సి ఉంటుందని తెలిపారు. మా పార్టీ యువతకు పెద్దపీట వేస్తోంది. మా పార్టీలో చాలామంది చిన్న వయసు కలిగిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. కేంద్ర కేబినెట్లో కూడా అతి పిన్న వయస్కుడైన మంత్రి మా పార్టీ నుంచే ఉన్నారు. అంతేకాదు, విద్యావంతులైన నాయకులు ఉన్నారని తెలిపారు.
ఇక లోకేష్ పార్టీ కార్యకర్తల కోసం ఎంతగానో కష్టపడుతున్నారని,పార్టీ నియమాల ప్రకారం, కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని లోకేష్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాం అని చంద్రబాబు నాయుడు లోకేష్ కు ఉన్నత పదవి ఇవ్వడం గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.