సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ మనందరికీ సూపర్ స్పెషల్. వారిలో ఉన్న ప్రతి ఫ్యామిలీ మెంబర్ సోషల్ మీడియాలో తమ జీవితంలో విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇటీవల మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్, సితార, గౌతమ్.. మొత్తం కుటుంబం కలిసి శ్రీలంక ట్రిప్లో కనిపించారు. ఈ ట్రిప్ ప్రత్యేకత మాత్రం సితార 13వ పుట్టినరోజు వేడుకలు. ఈ సెలబ్రేషన్స్ను నమ్రతా షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
నమ్రతా పోస్ట్ చేసిన ఫొటోల్లో పూర్తిగా ఫ్యామిలీ వైబ్ కనిపిస్తుంది. శ్రీలంకలోని “కోకనట్ సాంబోల్” రెస్టారెంట్ ముందు అందరూ స్టైలిష్గా ఫోజ్ ఇచ్చారు. ఆర్ట్ గ్యాలరీలు, రోడ్లపై నడకలు, బీచ్సైడ్ విందులు.. ఇలా ప్రతి ఫొటో వెనుక కూడా వారి బంధం, ఫ్యామిలీ వాల్యూస్ కనిపించాయి. పుట్టినరోజు ట్రిప్ అయినప్పటికీ, వారి సెలవులు మొత్తంగా ఎంటర్టైన్మెంట్తో నిండిపోయాయి.
బర్త్డే రోజున సితార సింపుల్గా బ్లాక్ డ్రెస్సులో కేక్ కట్ చేస్తూ కనిపించింది. చుట్టూ కుటుంబ సభ్యులు, స్పార్క్లింగ్ కాండిల్స్ మధ్య ఆ క్షణాలు మరింత స్పెషల్గా మారాయి. తన తల్లి నమ్రతా రిఫ్రెష్ చేసిన ఈ లవ్లీ మూమెంట్స్లో పిల్లలు, పెద్దలు అందరూ హ్యాపీగా టైమ్ స్పెండ్ చేశారు. అటు మిత్డే బ్రేక్ఫాస్ట్, లవ్లీ డిన్నర్ బర్త్డే సెలబ్రేషన్కి ప్రత్యేకతను తీసుకువచ్చాయి.
మహేష్ బాబు నమ్రత ఫ్యామిలీ తరచూ ఇటువంటి ప్రయాణాలను ప్రాధాన్యంగా తీసుకుంటూ, ప్రతి సెలబ్రేషన్ను మెమొరబుల్గా మార్చుకుంటారు. సితార బర్త్డే ట్రిప్కి ఈసారి శ్రీలంకని ఎంచుకోవడం స్పెషల్. అక్కడి కలర్ఫుల్ ఆర్ట్ గ్యాలరీలు, బీచ్లు, ఫుడ్ జాయింట్లు, సన్సెట్ ఇవన్నీ కలిసి ఈ ట్రిప్ను మరిచిపోలేని మెమొరీగా మార్చాయి. ఇక మహేష్ బాబు మరోవైపు రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.