ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Operation Sindoor: పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు

Operation Sindoor: పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు
ADVERTISEMENT

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ ప్రతీకారం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. ఇందులో భాగంగా… మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది.. మెరుపు దాడులు చేసింది.

 

ఈ ఘటనలో 9 ఉగ్రస్థావరాలపై దాడులు చేయగా.. సుమారు 80 నుంచి 90 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. దీంతో… తమకు న్యాయం జరిగిందంటూ పహల్గాం ఉగ్రదాడిలోని బాధిత కుటుంబాలు తెలిపాయి! ఇదే సమయంలో… పాక్ లోని ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన దాడులపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి.

 

అవును… పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ సైనిక చర్యలకు ఉపక్రమించింది. ఈ సందర్భంగా స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఈ దాడులు త్వరగా ముసిపోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు శక్తివంతమైన దేశాలు ఇలా రోడ్డుపైకి వచ్చి కొట్టుకోవాలని ఎవరూ కోరుకోరని.. భారత్, పాక్ కు ఎంతో చరిత్ర ఉందని ట్రంప్ తెలిపారు.

 

మరోవైపు పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన చర్యల గురించి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్… అమెరికా సలహాదారు మార్క్ రూబియోతో మాట్లాడారు. ఈ దాడులపై వాషింగ్టన్ డీసీలోని భారత ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దాడులు పాక్ పౌరులు, సైనిక స్థావరాలపై చేయలేదని స్పష్టం చేసింది.

 

ఇదే సమయంలో పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడిపై ఇజ్రాయేల్ స్పందించింది. ఇందులో భాగంగా… ఆత్మ రక్షణ కోసం భారత్ దాడి చేస్తోంది.. అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలి.. ఈ విషయంలో భారత్ కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్.

 

ఇదే సమయంలో… ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్ స్పందించారు. ఇందులో భాగంగా… ఇరు దేశాల సైనికులు సంయమనం పాటించాలని అన్నారు. ఇదే క్రమంలో యూఏఈ ఉపప్రధాని షేక్ అబ్ధుల్ బిన్ జాయెద్ స్పందిస్తూ.. భారత్-పాక్ మధ్య ఘర్షణలను ప్రపంచం భరించలేదని.. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని అన్నారు.

 

పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి అత్యంత కిరాతకంగా ప్రదర్శించింది. భారత సైన్యం కేవలం సరిహద్దులోని ఉగ్రవాద స్థావరాలపై, వారి లాంచ్‌పాడ్‌లపై లక్షిత దాడులు నిర్వహించి, దేశ భద్రతను కాపాడే ప్రయత్నం చేస్తుంటే, దానికి ప్రతీకారంగా పాక్ సైన్యం నీచమైన చర్యలకు పాల్పడుతోంది. నియంత్రణ రేఖ (LoC) వెంబడి ఉన్న అమాయక భారతీయ పౌరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. ముఖ్యంగా ఉత్తర కాశ్మీర్‌లోని పౌర గ్రామాలపై పాక్ రేంజర్లు విచక్షణారహితంగా ఫిరంగులు, మోర్టార్లతో భీకర దాడులకు పాల్పడుతున్నారు.

 

ఈ అకస్మాత్తు దాడులు సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నాయి. తాజాగా తంగ్డర్ సెక్టార్‌లోని ఓ గ్రామంలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. పాక్ షెల్లింగ్‌ తీవ్రతకు ఒక కశ్మీరీ పౌరుడి ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. ఈ దాడుల్లో ముగ్గురు సాధారణ పౌరులు దుర్మరణం పాలవడం పాక్ అకృత్యానికి నిదర్శనం. అనేక మంది గాయపడి చికిత్స పొందుతున్నారు.

 

పాకిస్తాన్ పాల్పడుతున్న ఈ చర్యలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే కాకుండా, ఎటువంటి రెచ్చగొట్టకపోయినా భారత పౌర లక్ష్యాలను చేసుకుని దాడులు చేయడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులకు అండగా నిలుస్తూ, వారి స్థావరాలపై భారత సైన్యం చర్యలు తీసుకుంటే, అమాయక పౌరులపై దాడులకు తెగబడటం దాని పిరికితనాన్ని, నీచబుద్ధిని తెలియజేస్తుంది.

 

భారత సైన్యం పాక్ కాల్పులను అత్యంత సమర్థవంతంగా తిప్పికొడుతోంది. పాక్ రేంజర్ల దుశ్చర్యలకు ధీటుగా బదులిస్తూ, సరిహద్దు వెంబడి భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. అయినప్పటికీ, పాకిస్తాన్ తీరు సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల దైనందిన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. నిరంతరం షెల్లింగ్ భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లబుచ్చాల్సిన దుస్థితి ఏర్పడింది.

 

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, మానవతా విలువల‌ను కాలరాసేలా పాకిస్తాన్ పాల్పడుతున్న ఈ దుశ్చర్యల పట్ల అంతర్జాతీయ సమాజం దృష్టి సారించాలని భారత్ గట్టిగా కోరుతోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, సరిహద్దుల్లో అస్థిరతను సృష్టించే పాకిస్తాన్ వైఖరిని ప్రపంచ దేశాలు ఖండించాలని, తగిన చర్యలు తీసుకోవాలని భారత్ పిలుపునిస్తోంది. అమాయక పౌరులపై దాడులకు పాల్పడే పాకిస్తాన్ చర్యలు ప్రాంతీయ శాంతికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి.

Tags: #BharatKiSena#IndianArmy#IndianDefense#IndiaPakistan#IndiaStrikesBack#MilitaryAction#NationalSecurity#OperationSindoor#PakTerrorCamps#SurgicalStrike#TeluguNews#ఉగ్రవాదంపైదాడి#భారతసైన్యం
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Meta AI App : పూర్తిగా ఉచితం..!

Next Post

Samantha: సినిమా షూటింగ్ కు చూసేదానికి వెళ్ళితే.. ఊహించని విధంగా..!

Related Posts

Budget2026
Big Story

Budget2026:మధ్యతరగతికి ఊరట ఇచ్చిన నిర్మలా సీతారామన్ బడ్జెట్

Ys Jagan
Andhra Pradesh

Ys Jagan : గోదావరి జిల్లాలో వైసీపీ స్థిరపడలేక పోతుందా?

Telangana
Crime

Telangana : గంటన్నరలో నలిగిపోయిన మూడు ప్రాణాలు : కారణం ఎవరు?

Mega Family
Entertainment

Mega Family : ఒక ఆడ, ఒక మగ.. రామ్ చరణ్ ఇంట డబుల్ హ్యాపీనెస్

MouniRoy
Entertainment

MouniRoy:బ్రెత్‌టేకింగ్ డ్రస్‌లో మౌనీ రాయ్ | ఫ్యాషన్ ఐకాన్‌గా మరోసారి మెరిసిన బ్యూటీ

ViratKohli
Big Story

ViratKohli:విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ డీయాక్టివేషన్? ట్విట్టర్‌లో 💔 లైక్ బటన్ వైరల్ ట్రెండ్ వెనుక నిజం

Next Post
Samantha: సినిమా షూటింగ్ కు చూసేదానికి వెళ్ళితే.. ఊహించని విధంగా..!

Samantha: సినిమా షూటింగ్ కు చూసేదానికి వెళ్ళితే.. ఊహించని విధంగా..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Budget2026

Budget2026:మధ్యతరగతికి ఊరట ఇచ్చిన నిర్మలా సీతారామన్ బడ్జెట్

Ys Jagan

Ys Jagan : గోదావరి జిల్లాలో వైసీపీ స్థిరపడలేక పోతుందా?

Telangana

Telangana : గంటన్నరలో నలిగిపోయిన మూడు ప్రాణాలు : కారణం ఎవరు?

Mega Family

Mega Family : ఒక ఆడ, ఒక మగ.. రామ్ చరణ్ ఇంట డబుల్ హ్యాపీనెస్

Recent News

Budget2026

Budget2026:మధ్యతరగతికి ఊరట ఇచ్చిన నిర్మలా సీతారామన్ బడ్జెట్

Ys Jagan

Ys Jagan : గోదావరి జిల్లాలో వైసీపీ స్థిరపడలేక పోతుందా?

Telangana

Telangana : గంటన్నరలో నలిగిపోయిన మూడు ప్రాణాలు : కారణం ఎవరు?

Mega Family

Mega Family : ఒక ఆడ, ఒక మగ.. రామ్ చరణ్ ఇంట డబుల్ హ్యాపీనెస్

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info