ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

మంగళగిరిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలు – మెగా ఇంజనీరింగ్ CSR ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్

మంగళగిరిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలు – మెగా ఇంజనీరింగ్ CSR ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్
ADVERTISEMENT

*మంగళగిరిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలకు శ్రీకారం*

*ఎయిమ్స్ కు ఒకటి, లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మరొకటి*

*సిఎస్ఆర్ కింద ఎలక్ట్రిక్ బస్సులను అందజేసిన మెగా ఇంజనీరింగ్*

*ఉచిత బస్ సర్వీసులను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్*

అమరావతి మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. సుదూర ప్రాంతాల నుంచి ఎయిమ్స్ హాస్పటల్, పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్న విషయం మంత్రి లోకేష్ దృష్టికి వచ్చింది. సిఎస్ఆర్ నిధుల నుంచి బస్సులను సమకూర్చాల్సిందిగా మెగా ఇంజనీరింగ్ & ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (MEIL)ను మంత్రి లోకేష్ అభ్యర్థించారు.

మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (CSR) కార్యక్రమం కింద మంగళగిరిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలను ప్రారంభించింది. ఈ చర్య ద్వారా పర్యావరణ హితమైన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ప్రోత్సహించడంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణ అవకాశాన్ని అందిస్తోంది.ఈ ఎలక్ట్రిక్ బస్సులు నూతనమైన టెక్నాలజీతో రూపుదిద్దుకున్నాయి. వీటిలో అత్యాధునిక GPS ట్రాకింగ్, సురక్షిత బ్రేకింగ్ సిస్టమ్, అలాగే హస్తశిల్ప దృక్పథంతో రూపొందించిన సీటింగ్ సౌకర్యం ఉన్నాయి. Olectra Genentech, MEIL అనుబంధ సంస్థ, ఈ బస్సుల తయారీకి ప్రముఖంగా దోహదపడింది​

ఈ విధానం ప్రజలకు ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా, ఉద్గారాలను తగ్గించేందుకు గల ఒక మెరుగైన పరిష్కారంగా నిలుస్తోంది

లోకేష్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన MEIL ఫౌండేషన్ రూ.2.4కోట్ల విలువైన రెండు అత్యాధునిక Olectra 7 మీటర్ల ఎలక్ట్రిక్ బస్సులను అందజేసింది. ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్, డిజిపి ఆఫీసు మీదుగా ఎయిమ్స్ కు నడుస్తుంది. మరొకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాలస్వామి గుడివరకు నడుస్తుంది. ఎయిమ్స్ కు వెళ్లే బస్సు ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు, పానకాలస్వామి ఆలయానికి వెళ్లే బస్సు ఉదయం 7నుంచి రాత్రి 8గంటల వరకు ప్రయాణీకులకు ఉచితంగా సేవలందిస్తుంది. . ప్రతి బస్సు 18 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఒక ఛార్జీతో 150 కి.మీ. వరకు నడపగలదు. ఈ బస్సులు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెళ్లు, ఎలక్ట్రానిక్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ (EHPS), రియల్-టైమ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ (VTS), రివర్స్ పార్క్ అసిస్ట్ సిస్టమ్స్ (RPAS) వంటి అత్యాధునిక సౌకర్యాలతో భద్రతాప్రమాణాలు కలిగి ఉంటాయి. ఈ కార్యక్రమంలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ K.V. ప్రదీప్, ఎయిమ్స్ డైరక్టర్ శాంతా సింగ్, డిప్యూటీ డైరక్టర్ శశికాంత్, లక్ష్మీనరసింహస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.కోటిరెడ్డి, టిటిడి బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, దుగ్గిరాల మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత, తాడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు అమరా సుబ్బరావు, తాడేపల్లి పట్టణ పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, టిడిపి నాయకులు గోవాడ దుర్గారావు, కొల్లి శేషు, షేక్ రియాజ్, తాళ్ల అశోక్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: #CSRInitiative#EVRevolution#GreenMobility#InfrastructureDevelopment#OlectraElectricBuses#OlectraGreentechMeghaEngineeringMeil
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Amaravati: వారికి బిగ్ షాక్..!

Next Post

హాట్ టాపిక్ గా మారుతున్న హుక్ స్టెప్పులు..!

Related Posts

AP Population Policy
Andhra Pradesh

AP Population Policy:ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ముగ్గురు పిల్లలు ఉన్న కుటుంబాలకు నగదు ప్రోత్సాహం

TelanganaTourism
Big Story

TelanganaTourism :తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి టూరిజం హబ్.. రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఇదే

Parliament
Big Story

Parliament :వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో జాతీయ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయా?

Chandrababu Naidu Kuppam Tour
Andhra Pradesh

Chandrababu Naidu Kuppam Tour: కుప్పంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు.. అభివృద్ధే ఎజెండా, ప్రజల సంక్షేమమే లక్ష్యం

IRCTC
Big Story

IRCTC:తత్కాల్ టికెట్ బుకింగ్ వేగవంతం.. ఐఆర్‌సీటీసీ కొత్త AI వ్యవస్థతో భారీ మార్పులు

RevanthReddyMidjilSabha
Big Story

RevanthReddyMidjilSabha:రేవంత్ రెడ్డి మిడ్జిల్ సభలో కీలక వ్యాఖ్యలు.. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పిలుపు

Next Post
హాట్ టాపిక్ గా మారుతున్న హుక్ స్టెప్పులు..!

హాట్ టాపిక్ గా మారుతున్న హుక్ స్టెప్పులు..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

DivyaBharathi

DivyaBharathi:లింగమ్ వెబ్‌సిరీస్‌లో మలర్‌గా దివ్య భారతి నటనకు ప్రశంసలు లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్

AP Population Policy

AP Population Policy:ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ముగ్గురు పిల్లలు ఉన్న కుటుంబాలకు నగదు ప్రోత్సాహం

TelanganaTourism

TelanganaTourism :తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి టూరిజం హబ్.. రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఇదే

Parliament

Parliament :వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో జాతీయ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయా?

Recent News

DivyaBharathi

DivyaBharathi:లింగమ్ వెబ్‌సిరీస్‌లో మలర్‌గా దివ్య భారతి నటనకు ప్రశంసలు లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్

AP Population Policy

AP Population Policy:ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ముగ్గురు పిల్లలు ఉన్న కుటుంబాలకు నగదు ప్రోత్సాహం

TelanganaTourism

TelanganaTourism :తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి టూరిజం హబ్.. రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఇదే

Parliament

Parliament :వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో జాతీయ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయా?

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info