‘నవంబర్ 20, 2025’ రోజు బిహార్ ముఖ్యమంత్రిగా 10వ సారి నితీష్ కుమార్ ప్రమాణం చేయనున్నారు. ఈరోజే ఎందుకు? ఈ రోజుకి ఏదైనా శక్తి ఉందా?
జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, పురాతన గ్రంథాలు బృహత్ సంహిత, ముహూర్త చింతామణి , మత్స్య పురాణం ఈ తేదీని చాలా అసాధారణమైనవిగా పేర్కొన్నాయి. దీనిని బిహార్లో అధికారంతో.. అంటే నితీష్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర రాజకీయ శక్తితో కలిపి చూసినప్పుడు మరింత లోతుగా మారుతుందంటున్నారు.
ఇది నితీష్ కుమార్ పదవ ప్రమాణ స్వీకారంగా ఉంటుంది. 10 సంఖ్య మూలం 1, 1 సంఖ్యకు అధిపతి సూర్యుడు, ఇది అధికారం, అహం, నాయకత్వం మరియు నిర్ణయాత్మకత యొక్క గ్రహం. అంటే, ఈ ప్రమాణ స్వీకారం నితీష్ 10.0 ప్రారంభం అవుతుంది. ఇది కఠినమైన నిర్ణయాలకు సంకేతం ఇస్తుంది.
నవంబర్ 20వ తేదీ ఉదయం వరకు అమావాస్య ఉంటుంది..సాధారణంగా ఈ రోజును ప్రతికూలంగా భావిస్తారు. అయితే రాజకీయ శాస్త్రాల్లో దీనిని రాజ-చక్ర పునర్జన్మ అని పిలుస్తారు. జ్యోతిష్య శాస్త్ర గ్రంథాల ప్రకారం అధికారం అమావాస్య ముగింపులో శుభ యోగంతో ప్రారంభమైతే, పాలన సుదీర్ఘంగా ప్రభావవంతంగా ఉంటుంది. అంటే పాత శక్తి ముగిసి అధికారానికి సంబంధించి కొత్త యుగం ప్రారంభమయ్యే సమయం ఇది.
నవంబర్ 20, 2025న గురువారం… ఈ రోజుకు అధిపతి అయిన బృహస్పతి. రాజకీయాలు, మంత్రివర్గం, విధానం ,న్యాయానికి సంబంధించిన గ్రహం. ముహూర్త చింతామణిలో గురువారం రాజ కార్యానికి ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఇది పాలన రాజకీయాలతో నేరుగా సంబంధం కలిగి ఉంది. రాజకీయాలలో ఉన్నత పదవిని బృహస్పతి అంటే గురువు మాత్రమే ఇస్తాడు. ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతకంతో కూడా ముడిపడి ఉంది. ఈ సమయం ఆయనకు సూర్య-బృహస్పతి ప్రధానమైనది. అంటే, ఈ తేదీ మోడీ నాయకత్వాన్ని , NDAని మరింత బలోపేతం చేస్తుంది. సూటిగా చెప్పాలంటే, నవంబర్ 20న ప్రమాణ స్వీకారం జరిగితే, బీహార్లో కేంద్రం పట్టు మునుపటికంటే మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
నవంబర్ 20న నక్షత్రం ఉదయం విశాఖ అవుతుంది. ఉదయం 10:58 తర్వాత అనురాధ ప్రారంభమవుతుంది. విశాఖ వివాదం, విభేదాలకు కారకంగా ఉంటే, అనురాధ నక్షత్రం స్నేహం కూటమి సమన్వయాన్ని చూపుతుంది. బృహత్ సంహిత ప్రకారం, ఈ నక్షత్ర మార్పు అధికారం లోపల పోరాటం నుంచి సహకారానికి ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అంటే ప్రారంభం కొంచెం వివాదాస్పదంగా కనిపిస్తుంది కానీ క్రమంగా కొత్త కూటమి స్థిరంగా బలంగా కనిపిస్తుంది.
ప్రమాణ స్వీకారం రెండు చోట్ల జరుగుతుంటుంది.. రాజ్భవన్ లేదా గాంధీ మైదానం. వాస్తు ప్రకారం, రెండింటిలోనూ దిశా-శక్తి చాలా శక్తివంతమైనది. రాజ్భవన్ ప్రధాన ప్రవేశం తూర్పు ముఖంగా ఉంది ఇది సూర్యుని దిశను సూచిస్తుంది. గాంధీ మైదానం ఈశాన్య మూల ప్రభావ ప్రాంతంలో ఉంది. ముహూర్త శాస్త్రం ప్రకారం, తూర్పు లేదా ఈశాన్య దిశ నుంచి చేసిన రాజ కార్యాలు ఎప్పటికీ విచ్ఛిన్నం కావు. అంటే, స్థల-శక్తి కూడా నవంబర్ 20 గ్రహ-నిర్మాణానికి సరిపోతుంది.
కేంద్ర నాయకత్వం ద్వారా అధికార-దిశానిర్దేశం
ప్రధానమంత్రి స్థాయిలో కూటమిని బలోపేతం చేయడం
రాష్ట్రంలో పెద్ద నిర్ణయాలలో కేంద్రం యొక్క నిర్ణయాత్మక జోక్యం
బిహార్లో రాబోయే సంవత్సరాల్లో తీసుకునే నిర్ణయాలలో పిఎంఓ పాత్ర చాలా పెరుగుతుంది.
ప్రమాణ స్వీకారం నవంబర్ 20, 2025న జరిగితే బిహార్లో రాబోయే సంవత్సరాల్లో ఈ మార్పులు కనిపించవచ్చు-
1. మొదటి సంవత్సరం-కఠినమైన పరిపాలన పెద్ద చర్యలు
శని-మేషం ప్రభావం పరిపాలనను వేగవంతం చేస్తుంది , కఠినతరం చేస్తుంది. పోలీసు, లా & ఆర్డర్ మరియు బ్యూరోక్రసీపై పెద్ద నిర్ణయాలు.
2. కూటమిలో ప్రారంభ ఘర్షణ, తరువాత స్థిరత్వం
విశాఖ నుంచి అనురాధకు నక్షత్ర మార్పు ఈ నమూనాను ఇస్తుంది. మొదటి 90 రోజులు ఒత్తిడితో కూడుకున్నవి . తర్వాత బలం సమన్వయం పరిస్థితి కనిపిస్తుంది.
3. 2026 బడ్జెట్-పెద్ద షాక్ లేదా పెద్ద ప్రయోగం
గురువు కదలిక విద్య, వ్యవసాయం, మౌలిక సదుపాయాలలో విస్తృతమైన సంస్కరణలకు సంకేతం ఇస్తుంది.
4. ప్రతిపక్షం 2026–27లో బలహీనమైన దశలో
రాహు-కేతు ప్రతిపక్ష వ్యూహాన్ని పదేపదే బలహీనపరుస్తారు. అంటే, ప్రభుత్వం ప్రతిపక్షంపై ఆధిపత్యం చెలాయిస్తుంది ..ఎటువంటి అవకాశాన్ని ఇవ్వదు.
5. 2027-అధికారం లోపల పెద్ద పునర్నిర్మాణం
మంత్రిత్వ శాఖలలో పెద్ద మార్పులు, పరిపాలనా ముఖాలలో మార్పులు… రాజకీయ సమీకరణాల కొత్త యుగం ప్రారంభమవుతుంది.
అయితే..నవంబర్ 20 గురువారం ఉదయం పదిన్నర గంటల వరకే అమావాస్య ఉంది.. ఆ తర్వాత పాడ్యమి మొదలైంది… మరి అమావాస్య ఘడియలు పూర్తయ్యాక ప్రమాణ స్వీకారానికి ముహూర్తం నిర్ణయిస్తారేమో!

















