*పోలవరం ప్రాజెక్ట్*అధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు.పోలవరం ప్రాజెక్టు పనులను ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు 3 సార్లు పరిశీలించారు.పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి షెడ్యూల్ కి అనుగుణంగా జరుగుతున్నాయి .డి వాల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి వర్షాకాలంలో కూడా పనులు చేసేలా బట్రస్ డ్యామ్ పనులు పూర్తి కావొచ్చాయు.2027 చివరినాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తున్నాం.ఇప్పటికే పోలవరం హెడ్ వర్క్స్ 80 శాతం పైగా పూర్తయ్యాయు.పోలవరం పనులు వేగంగా జరుగుతుంటే ఓర్వలేకే అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు .
మీడియా సమక్షంలో ప్యానల్ వెడల్పు ను 1.5 మీటర్లు ఉంది అంటూ , కళ్లకు కొట్టొచ్చినట్లు కొలిచి చూపించిన బావర్ ప్రతినిధులు .డీ వాల్ నిర్మాణం లో 1.5 మీటర్ల మందంతోనే నిర్మిస్తుంటే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
ప్రాజెక్ట్ పనులను ప్రపంచంలోనే ఎక్స్పర్ట్ అయిన జర్మనీకి చెందిన బావర్ కంపెనీ తో మేఘా పనులు చేయిస్తుంటే దుష్ప్రచారం చేస్తున్నారు .నాడు పోలవరం ప్రాజెక్టు మాకు అర్థం కాలేదు, ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేం అన్నారు నాటి వైసీపీ మంత్రులు.వైసీపీ ప్రభుత్వం చేయలేనిది , కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి చూపిస్తున్నారు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం లో నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు.