పంజాబ్కి చెందిన ముగ్గురు యువకులు ఇరాన్లో మాయమయ్యారు. మే 1న టెహ్రాన్ విమానాశ్రయానికి చేరుకున్న కొద్ది గంటలకే అదృశ్యమైన ఈ ముగ్గురి ఆచూకీ ఇప్పటికీ తెలియని పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. హుషన్ప్రీత్ సింగ్ (సంగ్రూర్), జస్పాల్ సింగ్ (ఎస్బీఎస్ నగర్), అమృత్పాల్ సింగ్ (హోషియార్పూర్)గా గుర్తించిన ఈ ముగ్గురు యువకుల కోసం భారత రాయబార కార్యాలయం ఎమర్జెన్సీ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
వారిని కనుగొనాలన్న తపనతో వారి కుటుంబ సభ్యులు నేరుగా టెహ్రాన్లోని భారత ఎంబసీని సంప్రదించారు. వారి ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న అధికారులు, ఈ విషయాన్ని తక్షణమే ఇరాన్ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఎంబసీ ప్రకటనలో “ముగ్గురు భారతీయులను గుర్తించేందుకు, వారికి అవసరమైన భద్రత కల్పించేందుకు మేము అన్ని విధాల సహకరించాలని ఇరాన్ అధికారులను కోరాము” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితి గమనించదగినదే. మూడు వేర్వేరు జిల్లాలకు చెందిన వారు ఒకేసారి అదృశ్యం కావడం అనుమానాలకు తావిస్తోంది.
మాయమైన వారి గమ్యం ఏమిటో, వారిని ఎవరైనా ప్రేరేపించారా అన్న కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. భారత రాయబార కార్యాలయం కుటుంబాలకు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తుండగా, ఇరాన్ ప్రభుత్వం కూడా ఈ కేసును ప్రాధాన్యతతో తీసుకుంటోందని సమాచారం. ఈ ఘటన మరోసారి విదేశీ ప్రయాణాల్లో భద్రతపై ప్రశ్నలు వేస్తోంది.
బతుకుదెరువు కోసం ఇరాన్ వెళ్లిన ముగ్గురు భారతీయులు అదృశ్యమయ్యారు. దీంతో వారి జాడ తెలియక కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. తమ బిడ్డల జాడ గుర్తించాలని ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని కుటుంబ సభ్యులు సంప్రదించారు.
అదృశ్యమైన వ్యక్తులు పంజాబ్కు చెందిన హుషన్ప్రీత్ సింగ్ (సంగ్రూర్), జస్పాల్ సింగ్ (ఎస్బీఎస్ నగర్), అమృతపాల్ సింగ్ (హోషియార్పూర్)గా గుర్తించారు. హోషియార్పూర్ ఏజెంట్ సాయంతో మే 1న ఇరాన్ వెళ్లారు. ఇరాన్లోకి అడుగుపెట్టగానే దుండగులు బంధించి వాళ్లను తాళ్లతో కట్టి.. కుటుంబ సభ్యులకు ఫొటోలు పంపించి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మే 11 నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో టెహ్రాన్లోని భారతీయ రాయబార కార్యాలయాన్ని కుటుంబ సభ్యులు సంప్రదించారు. దీంతో ఎంబసీ అధికారులు.. ఇరాన్ ప్రభుత్వానికి సమాచారం అందించారు. భారతీయుల జాడ గుర్తించాలని కోరారు. ఇక ఎప్పటికప్పుడు సమాచారాన్ని కుటుంబ సభ్యులతో ఎంబసీ పంచుకుంటోంది. ఇన్ని రోజులైనా తమ పిల్లల జాడ ఇంకా తెలియకపోవడంతో భయాందోళన చెందుతున్నారు.
పంజాబ్లోని హోషియార్పూర్ ఏజెంట్ దుబాయ్-ఇరాన్ మార్గం ద్వారా ఆస్ట్రేలియాకు పంపుతానని ముగ్గురికి హామీ ఇచ్చి తీసుకెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. చివరికి ఇరాన్లో బస కల్పిస్తున్నట్లు ఏజెంట్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ మే 1న ఇరాన్లో అడుగుపెట్టగానే ముగ్గురు కిడ్నాప్నకు గురయ్యారు. ఇక అప్పటినుంచి ఏజెంట్ జాడ కూడా పత్తాలేకుండాపోయింది. అతడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. ఏజెంట్ ఆచూకీ తెలిస్తే.. తమ బిడ్డలు ఎక్కడున్నారన్నది తెలుస్తుందని చెబుతున్నారు. కిడ్నాపర్లు రూ.కోటి ఇవ్వాలని ఫోన్ చేసి బెదిరించినట్లు తెలిపారు. ప్రస్తుతం ముగ్గురి జాడ కోసం ఇరాన్ అధికారులు గాలిస్తున్నారు.