టాలీవుడ్ లోకి ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి ప్రస్తుతం ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది. రవితేజతో చేసిన ఖిలాడీ సినిమా డిజాస్టర్ కాగా.. అడివి శేష్ సరసన కనిపించిన హిట్ 2 బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత మహేష్ సరసన గుంటూరు కారంలో నటించి అలరించింది. ఇక గతేడాది చివర్లో లక్కీ భాస్కర్ సినిమాతో హిట్ అందుకున్న మీనాక్షి, ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాంతో మరో బ్లాక్ బస్టర్ ను అందుకుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో పలు సినిమాలతో బిజీగా ఉంది.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. తన కెరీర్ ఆరంభం గురించి, తన బాల్యం గురించి మాట్లాడుతూనే.. చిన్నతనంలో ఇతరులతో మాట్లాడేందుకు ఇబ్బంది పడ్డానని ఓపెన్ అయ్యింది. అంతే కాకుండా కాలేజీ రోజుల్లో ఆ సమస్యతో బాధపడ్డానని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మీనాక్షీ చౌదరి మాట్లాడుతూ.. కాలేజ్ రోజుల్లోనే తన ఎత్తు 6.2 ఉండేదని.. దాంతో చాలా మంది అమ్మాయిలతో పోల్చితే ఎక్కువగా ఉండేదాన్ని అంటూ తెలిపింది. ఈ కారణం తోనే తనకు చాలా మంది డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారని చెప్పింది. దీంతో చాలా బాధగా అనిపించేదని.. ఆర్మీ ఆఫీసర్ అయిన తన తండ్రికి ఆ విషయం గురించి కూడా చెప్పినట్టు తెలిపింది. అయితే నీ సమస్యను నువ్వే పరిస్కరించుకోవాలని సూచించారని.. ఆ సమయంలో ఎక్కువగా బుక్స్ చదవడం అలవటు చేసుకున్నట్టు స్పష్టం చేసింది. అలానే అందాల పోటీల్లో పాల్గొనడం, ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి ఆఫర్ సద్వినియోగం చేసుకోవడం జరిగిందన్నారు.
మరోవైపు చైతన్య ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో NC-24 అనే మూవీలో నటిస్తున్నాడు. మిథికల్ యాక్షన్ థ్రిల్లర్లో రూపొందుతున్న ఈ చిత్రంలో చైతన్య మునుపెన్నడూ కనిపించని డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నారు. నాగ చైతన్య సరసన ఈ మూవీలో గోల్డెన్ లెగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి నటిస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా హీరో, హీరోయిన్స్ మధ్య జరిగే సన్నివేశాలకు సంబంధించి షూటింగ్ కూడా ప్రారంభించారని అంటున్నారు.
యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉంది. గతేడాది ‘గుంటూరు కారం’ సినిమాతో, ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో సందడి చేసిన ఆమె, వచ్చే ఏడాది కూడా మరో భారీ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.
“పెద్ద స్టార్స్తో చేసిన కొన్ని సినిమాలు ఫలితాల పరంగా కొద్దిపాటి నిరాశను మిగిల్చినప్పటికీ, నేను ఫ్లాప్స్ని పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే మన కృషి మనను ముందుకు తీసుకెళ్తుంది” అని చెప్పింది. తెలుగు పరిశ్రమలో మీనాక్షి చేసిన తొలి సినిమా ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ పెద్దగా వర్కవుట్ కాకపోయినా.. అదే ఆమెకు ‘ఖిలాడి’ వంటి అవకాశాన్ని తీసుకొచ్చిందని మీనాక్షి వెల్లడించింది. “లక్కీ భాస్కర్” సినిమాతో తన లక్ మారిందని చాలామంది అంటున్నా, మీనాక్షి మాత్రం భవిష్యత్తులో తల్లి పాత్రలను స్వీకరించబోనని స్పష్టం చేసింది.
పంజాబీ అమ్మాయి అయిన మీనాక్షి, సౌత్ కల్చర్ను ఎంతో ఇష్టపడుతుందట. “చీర కట్టుకోవడం నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది” అంటోంది ఆమె. ఆమె తండ్రి బ్రిగేడియర్ ర్యాంక్ కలిగిన ఆర్మీ అధికారి కావడం వల్ల తనకు క్రమశిక్షణ గణనీయంగా అలవడిందని మీనాక్షి గుర్తుచేసుకుంది.
సీనియర్ హీరోలతో పని చేయడాన్ని ప్రత్యేక అనుభవంగా భావిస్తానని చెప్పిన మీనాక్షి.. వెంకటేష్తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో నటించిన ఆనందాన్ని పంచుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ చిత్రంలో నటించటాన్ని గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. చీరలు కట్టుకోవడం చాలా కంఫర్ట్గా ఉంటుందని తెలిపింది. సీనియర్ హీరోలతో నటించడంలో తనకెలాంటి ప్రాబ్లెమ్స్ లేవని చెప్పింది మీనాక్షి చౌదరీ.