మంచు మనోజ్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని కారణాల వల్ల గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న మంచు మనోజ్ ఇప్పుడు భైరవం సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. నాంది ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన భైరవం మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
భైరవం సినిమా ద్వారా ప్రముఖ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా వెండితెరకు పరిచయమవుతుంది. టాలీవుడ్ లోని ముగ్గురు యంగ్ హీరోలు నటిస్తున్న సినిమా కావడంతో భైరవంకు ఆల్రెడీ మంచి బజ్ వచ్చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న మంచు మనోజ్ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా మంచు మనోజ్ తన అక్క మంచు లక్ష్మి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తను అక్క కాదు, అమ్మ అంటూ మనోజ్ ఈ సందర్భంగా ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఓ నెల కిందట వీరిద్దరూ ఓ ఫ్యాషన్ షో దగ్గర కలిసి ఎమోషనల్ అయిన వీడియో నెట్టింట బయటకు రాగా, దాని గురించి మనోజ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. గత కొన్ని రోజులుగా అక్క తన లైఫ్ లో, నేను నా లైఫ్ లో బిజీ అయ్యామని అప్పటికే కలిసి నెల రోజులవుతుందని, ఇద్దరం సడెన్ గా ఒకరినొకరు చూడగానే ఎమోషనల్ అయ్యామని, తను నా బెస్ట్ ఫ్రెండ్, తను నా అమ్మ అని చెప్పి అక్కపై ప్రేమను చాటాడు మంచు మనోజ్. మొదటి నుంచి కూడా మంచు లక్ష్మి, మంచు మనోజ్ మధ్య మంచి బాండింగ్ ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా మంచు లక్ష్మి కూడా ఈ విషయంపై ఓ కార్యక్రమంలో మాట్లాడింది. మనోజ్ తన లైఫ్ లోనే పెద్ద ఇరిటేటింగ్ పర్సన్ అని, తనను సడెన్ గా చూసేసరికి ఏడుపొచ్చిందని చెప్పింది. అయితే గత కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నప్పటికీ మంచు లక్ష్మితో మాత్రం మనోజ్ కు మంచి అనుబంధమే ఉందని వారిద్దరి కామెంట్స్ వింటుంటే అర్థమవుతంది.