2024 ఎన్నికల్లో కడప జిల్లాలో కూటమి అనుకూల ఫలితాలు సాధించడం ఒకింత సంచలనం అయింది. వైఎస్ జగన్ హవా తగ్గిందని చెప్పడానికి ఇంతకు మించిన ప్రూఫ్ అవసరం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమయ్యాయి. కడపలో మహానాడు జరగనున్న సంగతి తెలిసిందే. కడపలో మహానాడు హిట్టైతే వైసీపీ పునాదులు కదిలినట్లే అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
వరుణ దేవుడు సైతం శాంతించడంతో మహానాడుకు ఉన్న ఆటంకాలు అన్నీ తొలగిపోయినట్లేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 29వ తేదీన మహానాడుకు ఏకంగా 5 లక్షల మంది హాజరు కానున్నారని తెలుస్తోంది. ఆ స్థాయిలో జనాభా హాజరైతే మాత్రం మాత్రం సంచలనం అవుతుంది. త్వరలో కూటమి సర్కార్ సంక్షేమ పథకాలను సైతం అమలు చేయనున్న సంగతి తెలిసిందే.
కడపలో మహానాడు హిట్టైతే కూటమి ఫ్లాపైతే వైసీపీ సక్సెస్ సాధిస్తుంది. ఈ రెండు పార్టీలలో ఏ పార్టీకి ఎడ్జ్ ఉంటుందనే ప్రశ్నకు సంబంధించి త్వరలోనే జవాబు దొరకనుంది. మహానాడుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రస్తుతం కమడ ఎమ్మెల్యే కూడా టీడీపీకి చెందిన వ్యక్తి అనే సంగతి తెలిసిందే. అయితే మహానాడుకు సంబంధించిన యాడ్స్ లో పవన్ ఫోటో కనిపించకపోవడం గమనార్హం.
మహానాడు ఈవెంట్ లో విందు భోజనాలను సైతం భారీ స్థాయిలో ప్లాన్ చేశారని ఎన్నో ప్రత్యేకతలతో ఉన్న ఫుడ్ మెనూలో వంటకాలను వడ్డించనున్నారని సమాచారం అందుతోంది. మహానాడు ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయితే ఆ తర్వాత కూటమి ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. రాష్ట్రంలో కూటమి మరింత పుంజుకోవాలని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏది పడితే అది చేసేయడు . సరిగ్గా టైం చూసి దెబ్బ కొడతాడు అని అంతా అంటుంటే ఏదో అనుకున్నారు. కానీ కరెక్ట్ గా మహానాడు స్టార్ట్ అవుతున్న వేళ కీలక ఉత్తర్వులు జారీ చేశారు . దీంతో ఏపీ రాజకీయాలలో పెను ప్రకంపనలు మొదలయ్యాయి . కూటమి వర్సెస్ వైసీపీగా సాగుతున్న ఏపీ రాజకీయాలలో కీలక మలుపు తిరిగింది. గత కొన్ని ఏళ్లుగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంస్థల జిల్లాల పేర్లను అధికారులు తమకు నచ్చిన విధంగా మార్చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం .
ఇదే మూమెంట్లో కీలకమైన వైఎస్ఆర్ జిల్లా పేరును మారుస్తూ కూటమి ప్రభుత్వం జీవో చారీ చేసింది . దీనితో ఒక్కసారిగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వైసిపికి బిగ్ షాక్ తగిలినట్టు అయింది . ఇప్పటికే చంద్రబాబు క్యాబినెట్ జిల్లా పేరు మార్పుపై నిర్ణయం తీసుకుంది . దీని అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసేసింది. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నంతవరకు ఈ జిల్లా పేరు కడప గానే ఉండేది . కానీ ఆ తర్వాత కడప అంటే దేవుని గడప అని అర్థం అంటూ వైయస్ మరణం తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కడప జిల్లాకు వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్చింది .
దివంగత ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఆయనకు నివాళిగా అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలిపింది. చాలామంది ఈ నిర్ణయం పట్ల సానుకూలంగానే స్పందించారు . రాష్ట్ర విభజన తర్వాత టిడిపి ప్రభుత్వం కూడా ఇదే పేరు కొనసాగించింది . కానీ వైసీపీ అధికారంలోకి రాగానే కడప జిల్లా పేరులో ఉన్న వైయస్ ఆర్ మాత్రమే ఉంచి కడపను తీసేసింది. దీంతో వైసిపి హయాంలో ఇది వైఎస్ఆర్ జిల్లా గానే కొనసాగుతూ వచ్చింది . సెంటిమెంట్ కడప ను జిల్లా పేరులో నుంచి తీసేయడం పట్ల చాలామంది విమర్శలు కూడా చేశారు . అయినా సరే సీఎం జగన్ అవేవి పట్టించుకోలేదు. కాకపోతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్సార్ జిల్లా పేరులో తిరిగి కడపను చేర్చాలని నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టే ఉత్తర్వులు కూడా జారీ చేసేసింది . కడపలోనే టిడిపి మహానాడు నిర్వహిస్తున్నాడు చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే కూటమి సర్కార్ వైయస్సార్ జిల్లా ను వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది . దెబ్బకి జగన్ కి గూబ గుయ్యమనే షాక్ ఇది అంటూ టిడిపి తమ్ముళ్లు సంబరపడుతున్నారు..!
రాయలసీమలోని కడప వేదికగా జరగనున్న మహానాడు మొదటి రెండు రోజులు 2 లక్షల మందికి మూడో రోజున 5 లక్షల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. టీడీపీ మహానాడు ఆతిథ్య మెనూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ మెనూను చూసి షాకవ్వడం నెటిజన్ల వంతవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేక వంటకాలను ఇక్కడ రుచి చూపించనున్నారని సమాచారం.
మహానాడులో మాంసాహారం కూడా వడ్డించనుండటం హాట్ టాపిక్ అవుతోంది. ప్రతిరోజూ భోజనాల్లో 20 వంటకాలకు తగ్గకుండా వడ్డించనున్నారని సమాచారం అందుతోంది. ఈ వంటకాల తయారీ కోసం 1700 మంది వంటవాళ్లతో పాటు వడ్డింపు కోసం 800 మంది పని చేయనున్నారు. తాపేశ్వరం కాజాతో పాటు ఒంగోలు అల్లూరయ్య మైసూర్ పాక్, చక్కెర పొంగళి, ఫ్రూట్ హల్వా లాంటి మిఠాయిలను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.
50 వేల గుడ్లను వడ్డించనున్నారని భోగట్టా. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా ఆవకాయ పచ్చడి తయారు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అల్పాహారంలో భాగంగా టూటీ ఫ్రూటీ కేసరి, పొంగలి, ఇడ్లీ, టమోటా బాత్ తో పాటు కాఫీ, టీ కూడా ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది. మధ్యాహ్న భోజనంలో గోంగూర చికెన్, ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ, ఎగ్ రోస్ట్, రోటీ పచ్చడి, తెల్లన్నం, ప్లెయిన్ బిర్యానీ, సాంబారు, ఉలవచారు, మామిడికాయ పచ్చడి, పెరుగు వడ్డించనున్నారు.
శాఖాహారులకు గోంగూర పూల్ మఖానా, ప్లెయిన్ బిర్యానీ, టమోటా పప్పు, తెల్లన్నం, రోటీ పచ్చడి, పెరుగు, చిప్స్, ములక్కాయ టమోటా గ్రేవీ, బెండకాయ బూందీ వడ్డించనున్నారు. సాయంత్రం స్నాక్స్ లో భాగంగా కాఫీ, టీతో పాటు కార్న్ సమోసా, బిస్కెట్లు, పకోడీ, మిర్చి బజ్జీలు ఇవ్వనున్నారు. రాత్రి భోజనంలో భాగంగా రైస్ తో పాటు వంకాయ బఠానీ, ఆలూ ఫ్రై, పెసరపప్పు చారు, రోటీ పచ్చడి, పెరుగు ఇవ్వనున్నారు. మహానాడు మెనూ మాత్రం అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.