ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

KWDT2:జలవివాదాలపై జగన్‌పై నిమ్మల ధ్వజం – తీవ్ర విమర్శలు, క్షమాపణ డిమాండ్

KWDT2:జలవివాదాలపై జగన్‌పై నిమ్మల ధ్వజం – తీవ్ర విమర్శలు, క్షమాపణ డిమాండ్
ADVERTISEMENT

*ఐదేళ్లపాటు ఎక్కడ నిద్రపోయారు జగన్మోహన్ రెడ్డి?*

*kwdt-2 నియామకానికి కారకులు మీరు కదా?*

*రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసింది మీ నిర్వాకమే*

*చౌకబారు విమర్శలు తగవు అంటూ జగన్ లేఖపై నిమ్మల ధ్వజం*

కృష్ణానది జల వివాదాలకు సంబంధించి ట్రిబ్యునల్-2 ముందు వాదనలు వినిపించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి రాసిన లేఖపై రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శనివారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో జల వనరులకు సంబంధించి జగన్ వైఖరిని తూర్పారబట్టారు.దెయ్యాలు వేదాలు వల్లించడం, దొంగే దొంగ దొంగ అని అరవడం మాదిరి రాష్ట్ర ప్రయోజనాలను తను దెబ్బ కొట్టి కూటమి ప్రభుత్వం పై బురద చల్లడం విడ్డూరంగాను వింతగాను ఉందన్నారు.ఐదేళ్లపాటు అధికారమిస్తే.. అప్పుడు ఎక్కడ నిద్రపోయారు.. జల వనరులపై మీరు ఇప్పుడు ప్రదర్శిస్తున్న కపట ప్రేమ అప్పుడు ఏమైపోయింది అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో అతి కీలకమైన నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసింది మీరు కదా?రాష్ట్ర జీవనాడి ‘పోలవరం’ తో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర నీటిపారుదల ప్రాజెక్టులన్నిటిని నిర్వీర్యం చేసి పడుకోపెట్టేసింది మీరు కాదా? అంటూ నిలదీశారు మీ తిరోగమన పాలన వల్ల, అసమర్ధ అవినీతి విధానాల వల్ల రాష్ట్ర జలవనుర్లన్నీ అధోగతి పాలవడం వాస్తవం కాదా అని అడిగారు . సదరు ప్రాజెక్టులన్ని పాతికేళ్లు వెనక్కి వెళ్ళి పోవడానికి కారకులు మీరేనని విమర్శించారు.

ప్రస్తుతo మీరు వలకబోస్తోన్న జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణానది జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (KWDT)-2 వేయడానికి, దాని అంకురార్పణకు మీ చేతకానితనం కాదా అని నిలదీశారు. 2020లో అధికారంలో ఉన్నది మీరు, తెలంగాణకు కెసిఆర్. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కెసీఆర్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనలు తుంగలో తొక్కి మన రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా మాట్లాడుతుంటే మీరు ఎపెక్స్ కౌన్సిల్లో నిద్రపోయారా అంటూ మంత్రి రామానాయుడు నిలదీశారు. అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి వాదనల మేరకు కృష్ణా జలాల పంపిణీ పునర్విభజన చట్టం.. దశాబ్దాల తరబడి ఉన్న ప్రాజెక్టుల ప్రాతిపదికన కాకుండా .. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు, భవిష్యత్తులో నిర్మించబోయే ప్రాజెక్టులు ప్రాతిపదికన జరగాలని కోరినప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు, ఎందుకు మౌనం దాల్చారు అంటూ రామానాయుడు సూటిగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే కే డబ్ల్యూడిటీ-2 ఏర్పాటు అయింది అన్నారు. పోనీ తర్వాత అయినా స్పందించారా.. అంటే అది లేదు. 2023లో కేంద్ర క్యాబినెట్ ఆమోదించి గెజిట్ నోటిఫికేషన్ కి సిద్ధపడిన వేళ కూడా తమరు నోరు మెదపలేదని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర పునర్విభజన చట్టపరంగా నదీ జలాల పంపిణీ యథాతథంగా అమలు చేయాలని మీరు కనీసం కేంద్రాన్ని కోరనైనా కోరలేదని దుయ్యబట్టారు.కే డబ్ల్యు డి టి -2 ఏర్పాటు తగదంటూ సుప్రీంకోర్టు కైనా వెళ్లారంటే అదీ లేదు.. ఆ రకంగా మూడేళ్లపాటు కాలయాపన చేశారు.. ఎన్నికలవేళ రాజకీయ ప్రయోజనాలు ఆశించి కంటి తుడుపు చర్యగా సుప్రీంకోర్టులో రిట్ వేయడం వాస్తవం కాదా అని అడిగారు.
ఈ రకంగా కే డబ్ల్యూ డి టి- 2 ఏర్పాటుకు ముమ్మాటికి జగనే కారణం అని నిమ్మల నొక్కి వక్కాణించారు.

రాష్ట్ర విభజన సమయంలో అంటే 2014లో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టిఎంసిల నీటిని కేటాయిస్తే.. అందులో మన రాష్ట్ర వాటాగా 512 టిఎంసిలను రాబట్టారు. తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే కేటాయించారు.. ఆనాడు ఆ రకంగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడారని మంత్రి వివరించారు.
అలాగే గోదావరి వరద జలాలు 80 టీఎంసీలకు సంబంధించి 35 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్రలకు కేటాయించగా మిగిలిన 45 టీఎంసీలు మన రాష్ట్రానికి దక్కాయి అని అన్నారు. ఆ 45 టీఎంసీలు కూడా మాకే కావాలని తెలంగాణ వాదించినప్పుడు మీరు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని మంత్రి ప్రశ్నించారు. సి డబ్ల్యూ సి లో 20 సంవత్సరాల అపార అనుభవం ఉన్న ఏకే గోయల్ ని k wdt-2 ముందు వాదనలకు నియమించగా అతని పనితీరును కూడా జగన్ విమర్శించడం దురదృష్టకరమని అన్నారు.అలాగే రాయలసీమ ప్రాజెక్టుల గురించి జగన్ మొ సలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ ఐదేళ్ల దుష్ట పాలనలో రాష్ట్రం మొత్తం మీద 198 ప్రాజెక్టులు ప్రీ క్లోజర్ చేశారన్నారు. అందులో 102 రాయలసీమలోనే ఉన్నాయని చెప్పుకొచ్చారు.

రాష్ట్ర చరిత్రలో రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనంత ద్రోహం జగన్ చేశాడని మంత్రి రామానాయుడు విమర్శించారు. 2014 -19 మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన నీటి ప్రాజెక్టులకు 12000 కోట్లు కేటాయించగా.. 2019 24 మధ్య జగన్ హయాంలో కేవలం 2000 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. రాయలసీమకు నాటి కృష్ణదేవరాయలు తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే జలకళ ఉట్టిపడుతోందన్నారు. రాయలసీమ రతనాల సీమ చేయాలని ధ్యేయంతో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి చెప్పారు. అలాగే రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఏ ప్రాజెక్టుకి ఎంత కేటాయించిందీ గణాంకాలతో సహా మంత్రి వివరించారు.

పరదాల మాటున పాలన సాగించిన అలవాటున్న జగన్ ప్రజల ముందుకు వచ్చి మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు.
అసెంబ్లీకి వచ్చి అర్థవంతమైన చర్చల్లో పాల్గొంటే స్పష్టమైన సమాధానాలుహితవు పలికారు. రాజకీయంగా మసక బారి పోయిన పార్టీని కాపాడుకోవడానికి , ఉనికిని చాటుకోవడానికి చౌకబారు విమర్శలు చేయడం, లేఖలు రాయడం జగన్మోహన్ రెడ్డి పలాయన వాదాన్ని సూచిస్తోందని అన్నారుప్రజల ముందుకు రాలేక ముఖం చాటేస్తున్న జగన్ నైజాన్ని, ఆంతర్యాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగా అర్థం చేసుకున్నారని నిమ్మల విశ్లేషించారు. లేఖల రాజకీయం మాని జల వనరులకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసిన జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రామానాయుడు డిమాండ్ చేశారు.

Tags: #AndhraPradesh#APGovt#APNews#APpolitics#BreakingNews#ChandrababuNaidu#JaganMohanReddy#NimmalaRamanayudu#polavaramproject#PoliticalUpdates#RayalaseemaProjects#Tdp#TeluguNews#waterresources#YsrcpApexCouncilKrishnaWaterDisputeKWDT2TelanganaAndhraWaterSharing
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Bandla Ganesh: చిరంజీవికి రాజ మర్యాద..అస్సలు కారణం ఏందంటే?

Next Post

Ys Jagan: సొంత జిల్లాలో పార్టీ రిపేర్లు!

Related Posts

TelanganaEducation
Big Story

TelanganaEducation:తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక సమర్పణ | సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు

APAssembly
Andhra Pradesh

APAssembly: సీఎం చంద్రబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు, రాయలసీమ–ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై కీలక ప్రకటన

T20WorldCup
Big Story

T20WorldCup:జింబాబ్వేపై భారత్ ఘన విజయం | 72 పరుగుల తేడాతో టీమిండియా సత్తా

ViroshWedding
Entertainment

ViroshWedding:విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న రొమాంటిక్ & ఎలిగెంట్ సెలబ్రిటీ వెడ్డింగ్ హైలైట్స్

IndiaHealth
Big Story

IndiaHealth:పాలు, కూరగాయలు, మసాలాల్లో రసాయనాలు – ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

RealLifeBichagadu
Andhra Pradesh

RealLifeBichagadu:భార్య ఆరోగ్యం కోసం భిక్షాటన చేస్తున్న అడ్వకేట్ జలందర్ రెడ్డి

Next Post
Ys Jagan: సొంత జిల్లాలో పార్టీ రిపేర్

Ys Jagan: సొంత జిల్లాలో పార్టీ రిపేర్లు!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

TelanganaEducation

TelanganaEducation:తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక సమర్పణ | సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు

APAssembly

APAssembly: సీఎం చంద్రబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు, రాయలసీమ–ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై కీలక ప్రకటన

T20WorldCup

T20WorldCup:జింబాబ్వేపై భారత్ ఘన విజయం | 72 పరుగుల తేడాతో టీమిండియా సత్తా

ViroshWedding

ViroshWedding:విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న రొమాంటిక్ & ఎలిగెంట్ సెలబ్రిటీ వెడ్డింగ్ హైలైట్స్

Recent News

TelanganaEducation

TelanganaEducation:తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక సమర్పణ | సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు

APAssembly

APAssembly: సీఎం చంద్రబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు, రాయలసీమ–ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై కీలక ప్రకటన

T20WorldCup

T20WorldCup:జింబాబ్వేపై భారత్ ఘన విజయం | 72 పరుగుల తేడాతో టీమిండియా సత్తా

ViroshWedding

ViroshWedding:విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న రొమాంటిక్ & ఎలిగెంట్ సెలబ్రిటీ వెడ్డింగ్ హైలైట్స్

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info