ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Pawan Kalyan: మౌనం దేనికి సంకేతం?

Pawan Kalyan: 10,000 మంది మహిళలకు శ్రావణ కానుక!

#PawanKalyan, #VaralakshmiVratam, #Pithapuram, #Janasena, #MegaEvent, #SriVaralakshmiVratam, #ChiranjeeviBirthday, #AndhraPradesh

ADVERTISEMENT

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మౌనంగా ఉంటున్నారు. అది ఇటీవల ఒకటి రెండు బహిరంగ కార్యక్రమాలలో వెల్లడైంది. మంత్రివర్గ సమావేశంలో ముభావంగా ఉన్న పవన్ తాజాగా విజయవాడలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో పధకం ప్రారంభ కార్యక్రమంలో మౌనంగానే వ్యవహరించారు. ఆయన తన ప్రసంగంలో సహజ శైలికి భిన్నంగా నెమ్మదిగానే మాట్లాడారు. అంతే కాదు క్లుప్తంగా ముగించేశారు. తన మనోభావాలు ఏమిటి అన్నది వ్యక్తం చేయకుండానే జాగ్రత్త పడ్డారు అని అంటున్నారు.

అయితే చంద్రబాబు లోకేష్ మాట్లాడినపుడు మాత్రం ఏ దశలోనూ పవన్ తల ఎత్తి చూడలేదు. పూర్తి మౌనంతో నేల చూపులే చూస్తూ ఉండిపోయారు. ఆయనను చంద్రబాబు పొగిడారు. ఓజీ సినిమా చూశారా అని ఆటో డ్రైవర్లను అడిగి మరీ పవన్ ని హుషారు చేయాలని చూశారు ఇక లోకేష్ తన ప్రసంగంలో పవన్ అన్న అంటూ సంభోదిస్తూ ప్రసంగించారు. ఇలా బాబు లోకేష్ పవన్ గురించి బాగా మాట్లాడినా ప్రశంసించినా ఆయన మాత్రం తల ఎత్తి చూడలేదు సరికదా నేల చూపులే చూస్తూ ఇబ్బందిగా కదులుతూ గడిపారు అని అంటున్నారు. ఇదంతా టీవీలలో మొత్తం లైవ్ లో టెలికాస్ట్ అయినపుడు అంతా చూశారు. ఆ తరువాత కూడా వీడియోలలో ఉంది.

అయితే పవన్ ఈ విధంగా మౌనం వహించడం అంతా అసెంబ్లీలో బాలయ్య ఎపిసోడ్ తోనే జరిగింది అని అంటున్నారు. తాను ప్రాణప్రదంగా ఆరాధించే తండ్రి సమానునిగా చూసే మెగాస్టార్ చిరంజీవి విషయంలో బాలయ్య అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు అని అంటున్నారు. అంతే కాదు అసెంబ్లీలో బాలయ్య వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. చంద్రబాబు స్వయంగా వచ్చి హైదరాబాద్ లోని పవన్ నివాసంలో ఆయనను పరామర్శించారు. అయినా సరే పవన్ లో మాత్రం ఆగ్రహం చల్లారడం లేదని అంటున్నారు. దానికి కారణం బాలయ్య చేత కనీస వివరణ ఇప్పించే ప్రయత్నం టీడీపీ అధినాయకత్వం చేయకపోవడమే అని అంటున్నారు.

ఇదిలా ఉంటే పవన్ తన మనో వేదనను కొందరు సన్నిహితులతో పంచుకున్నట్లుగా చెబుతున్నారు. తాను పంటి బిగువున అన్ని భరిస్తున్నాను అని ఆయన అన్నట్లుగా చెబుతున్నారు. కూటమి ఐక్యత కోసం అలాగే మరోసారి జగన్ అధికారంలోకి రాకుండా చూడడం కోసం తాను అన్నీ తగ్గి అడుగులు వేస్తూంటే దానికి టీడీపీకి చెందిన వారు కొందరు తేలికగా తీసుకుంటున్నారని పవన్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లుగా ప్రచారం సాగుతోంది. రాష్ట్రం ముఖ్యమనుకుని తాను దేనినీ పట్టించుకోవడం లేదని ఆయన అన్నట్లుగా చెబుతున్నారు.

తాను మంచితనంగా ఉంటే అది చేతగానితనంగా చూస్తున్నారా అన్న బాధ ఆగ్రహం కూడా ఆయనలో వ్యక్తం అవుతోంది అని అంటున్నారు. తన మంచితనం తనకూ పార్టీకి శాపంగా మారుతోందా అన్న ఆవేదన కూడా ఆయన వ్యక్తం చేశారని అంటున్నారు. పదవుల దగ్గర నుంచి ఏ విషయంలోనూ తాను ఎపుడూ డిమాండ్ చేయకుండా సర్దుకునిపోతున్నా కూడా ఈ రకమైన స్పందన రావడమేంటి అని ఆయన వాపోతున్నారని అంటున్నారు.

ఇక తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో కూడా టీడీపీనే ఎదురు నిలిచి ఇబ్బందులు పెడుతోంది అన్నది కూడా ఆయన ఆవేదనగా ఉంది అంటున్నారు. వైసీపీ కంటే టీడీపీతోనే అక్కడ పోరాడాల్సి వస్తోంది అని జనసేన నేతలు చెబుతున్నారని అంటున్నారు. ఇలా పవన్ అయితే నిర్వేదంతో ఉన్నారని అంటున్నారు. ఆయనలో దాగిన ఈ ఆవేదన తగిన సమయంలో బయటపడి బద్ధలవుతుందా లేక ఈ లోగా కూటమిలో సర్దుబాట్లూ దిద్దుబాట్లూ జరుగుతాయా అన్నది అయితే చర్చగా ఉంది. ఏది ఏమైనా బాలయ్య అసెంబ్లీ ఎపిసోడ్ అయితే కూటమిలో చిచ్చు రాజేసింది అని అంటున్నారు. మరి అది ఆరుతుందా లేక రాజుకుంటూ ఇలాగే రగిలి ఏదో రోజు మంట రేపుతుందా అన్నది కాలమే చెప్పాలని అంటున్నారు.

Tags: #AndhraPolitics#AndhraPradesh#AndhraPradeshNews#APpolitics#APUpdates#Balayya#BreakingNews#ChandrababuNaidu#ElectionUpdates#JanaSenaPolitics#MegaFamily#naralokesh#pawankalyan#PoliticalDebate#PoliticalScenario#PoliticalTensions#StatePolitics#Tdp#TeluguNewsJanasena
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Mithun Reddy: జైల్ నుంచి రాగానే ఇలా..!

Next Post

Ys Jagan: మళ్ళీ కొత్తగా..!

Related Posts

Telangana: ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులు అనుమానాస్పందంగా మృతి..కన్న తండ్రే చంపాడా!
Crime

APcrime: అనంతపురం దారుణం: తల్లి-కుమారుడు మృతి, డిప్యూటీ తహసిల్దార్‌పై ఆరోపణలు

Pawan Kalyan: పల్లెపండుగ 2.0..రెండింతల అభివృద్ధికి శ్రీకారం
Andhra Pradesh

Pawan Kalyan: పల్లెపండుగ 2.0..రెండింతల అభివృద్ధికి శ్రీకారం

Ys Jagan: చుట్టం చూపుగా ఏపీకి వచ్చి పోతారే..!
Andhra Pradesh

Ys Jagan: చుట్టం చూపుగా ఏపీకి వచ్చి పోతారే..!

Andhra Pradesh: ప్రయోజనాలే అజెండా గా ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
Andhra Pradesh

Andhra Pradesh: ప్రయోజనాలే అజెండా గా ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Sonam Bajwa: కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తున్న సోనమ్ బజ్వా
Entertainment

Sonam Bajwa: కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తున్న సోనమ్ బజ్వా

Andrea Jeremiah: న్యూడ్ సన్నివేశాలపై మలయాళ నటి సంచలన వ్యాఖ్యలు!
Entertainment

Andrea Jeremiah: న్యూడ్ సన్నివేశాలపై మలయాళ నటి సంచలన వ్యాఖ్యలు!

Next Post
Ys Jagan: మళ్ళీ కొత్తగా..!

Ys Jagan: మళ్ళీ కొత్తగా..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Telangana: ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులు అనుమానాస్పందంగా మృతి..కన్న తండ్రే చంపాడా!

APcrime: అనంతపురం దారుణం: తల్లి-కుమారుడు మృతి, డిప్యూటీ తహసిల్దార్‌పై ఆరోపణలు

Pawan Kalyan: పల్లెపండుగ 2.0..రెండింతల అభివృద్ధికి శ్రీకారం

Pawan Kalyan: పల్లెపండుగ 2.0..రెండింతల అభివృద్ధికి శ్రీకారం

Ys Jagan: చుట్టం చూపుగా ఏపీకి వచ్చి పోతారే..!

Ys Jagan: చుట్టం చూపుగా ఏపీకి వచ్చి పోతారే..!

Andhra Pradesh: ప్రయోజనాలే అజెండా గా ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Andhra Pradesh: ప్రయోజనాలే అజెండా గా ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Recent News

Telangana: ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులు అనుమానాస్పందంగా మృతి..కన్న తండ్రే చంపాడా!

APcrime: అనంతపురం దారుణం: తల్లి-కుమారుడు మృతి, డిప్యూటీ తహసిల్దార్‌పై ఆరోపణలు

Pawan Kalyan: పల్లెపండుగ 2.0..రెండింతల అభివృద్ధికి శ్రీకారం

Pawan Kalyan: పల్లెపండుగ 2.0..రెండింతల అభివృద్ధికి శ్రీకారం

Ys Jagan: చుట్టం చూపుగా ఏపీకి వచ్చి పోతారే..!

Ys Jagan: చుట్టం చూపుగా ఏపీకి వచ్చి పోతారే..!

Andhra Pradesh: ప్రయోజనాలే అజెండా గా ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Andhra Pradesh: ప్రయోజనాలే అజెండా గా ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info