ఇండియాలో తయారైన ఐఫోన్లకు ప్రపంచంలో విస్తృతంగా డిమాండ్ పెరుగుతోంది. ప్రత్యేకించి అమెరికా మార్కెట్ను లక్ష్యంగా చేసుకున్న యాపిల్, భారత్లోని తయారీ కేంద్రాలపై దృష్టిపెట్టి, భారీ ఎగుమతులను సాధిస్తోంది. గత ఏప్రిల్ నెలలో అమెరికాకు వెళ్లిన మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్లు 30 లక్షల మార్క్ను తాకగా, ఇదే సమయంలో చైనా నుంచి వెళ్లిన ఐఫోన్లు కేవలం 9 లక్షల యూనిట్లకే పరిమితమయ్యాయి. అంటే భారత్ ఎగుమతులు ఏకంగా 76 శాతం పెరుగగా, చైనా ఎగుమతులు అదే స్థాయిలో తగ్గినట్టయింది.
తాజా గణాంకాల ప్రకారం, జనవరి నుంచి ఏప్రిల్ వరకు అమెరికాకు మొత్తం 1.15 కోట్ల యూనిట్లు భారత్ నుంచి వెళ్లాయి. అదే సమయంలో చైనా 1.32 కోట్ల యూనిట్లను మాత్రమే సరఫరా చేయగలిగింది. ఇది చైనా ఇంకా స్వల్ప ఆధిక్యంలో ఉందన్నది నిజమే కానీ, నెలవారీ గణాంకాల్లో మాత్రం భారత్ స్పష్టంగా ఆధిక్యంలో ఉంది.
ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే భారత్ అమెరికా ఐఫోన్ మార్కెట్లో కీలక హబ్గా మారనుంది. యాపిల్ వ్యూహం ప్రకారం, చైనాపై ఆధారాన్ని తగ్గించడానికి భారత్ను ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది.
కరోనా తర్వాత సరఫరా బందీలను ఎదుర్కొన్న తర్వాత, భారత్పై దృష్టి పెడుతూ, ఇక్కడి థర్డ్ పార్టీ సప్లయర్లతో సంబంధాలు బలపరిచింది. వ్యాపార మోడల్లో ఈ మార్పులు భారత్కు అనుకూలంగా మారాయి. ఈ పరిణామాలు భారత్ను కేవలం వినియోగదారుల మార్కెట్గా కాకుండా, గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దే దిశగా తీసుకెళ్తున్నాయి.