ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Telangana

హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-II కు అనుమ‌తి ఇవ్వండి మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి

హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-II కు అనుమ‌తి ఇవ్వండి  మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి
ADVERTISEMENT

* ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి..
* మూసీ పున‌రుజ్జీవ‌న ప్రాజెక్ట్ కు నిధులు ఇవ్వండి..
* రీజిన‌ల్ రింగ్ రైల్‌… డ్రైపోర్ట్‌లు మంజూరు చేయండి
* సెమీ కండ‌క్ట‌ర్ మిష‌న్‌కు అనుమ‌తించండి..
* ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి

ఢిల్లీ: హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో మెట్రో రైలు సౌక‌ర్యం అన్ని ప్రాంతాల‌కు అందుబాటులోకి ఉద్దేశించిన
హైద‌రాబాద్ మెట్రో రైల్ ఫేజ్‌-IIకు అనుమ‌తించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. గ‌త ప్ర‌భుత్వం ప‌దేళ్లుగా హైద‌రాబాద్ న‌గ‌రంలో మెట్రో విస్త‌ర‌ణ‌పై దృష్టి సారించ‌లేద‌ని ప్ర‌ధాన‌మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఫేజ్‌-II కింద రూ.24,269 కోట్ల అంచ‌నా వ్యయంతో 76.4 కి.మీ పొడ‌వైన అయిదు కారిడార్ల‌ను ప్ర‌తిపాదించామ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వివ‌రించారు. ఈ ప్రాజెక్టుకు వెంట‌నే అనుమ‌తించాల‌ని అభ్య‌ర్థించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో ఆయ‌న అధికారిక నివాసంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బుధ‌వారం ఉద‌యం స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌ను ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన‌మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ఉత్త‌ర భాగంలో ఇప్ప‌టికే 90 శాతం భూ సేక‌ర‌ణ పూర్త‌యినందున ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగాన్ని వెంట‌నే మంజూరు చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఉత్త‌ర భాగంతో పాటే ద‌క్షిణ భాగం పూర్త‌యితే ఆర్ఆర్ఆర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోగ‌ల‌మ‌న్నారు. ద‌క్షిణ భాగం భూ సేక‌ర‌ణ‌కు అయ్యే వ్య‌యంలో 50 శాతం భ‌రించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన‌మంత్రికి తెలియ‌జేశారు. ఆర్ఆర్ఆర్‌కు స‌మాంత‌రంగా రీజిన‌ల్ రింగ్ రైలు ప్రాజెక్టు ప్ర‌తిపాద‌న ఉంద‌ని పీఎం మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వివ‌రించారు. ఈ రీజిన‌ల్ రింగ్ రైలు పూర్త‌యితే తెలంగాణ‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లోని రైలు మార్గాల‌తో అనుసంధానత (క‌నెక్ట‌విటీ) సుల‌భ‌మ‌వుతుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీకి సీఎం రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు.. రీజిన‌ల్ రింగ్ రైలుకు అనుమ‌తి ఇవ్వాల‌ని పీఎంను సీఎం కోరారు. స‌ముద్ర మార్గం లేని తెలంగాణ‌కు వ‌స్తువుల ఎగుమ‌తులు, దిగుమ‌తులు సులువుగా చేసేందుకు రీజిన‌ల్ రింగు రోడ్డు స‌మీపంలో డ్రైపోర్ట్ అవ‌స‌ర‌మ‌ని, ఆ డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని స‌ముద్ర పోర్ట్ ల‌ను క‌లిపేందుకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు తో పాటు రోడ్డును ఆనుకొని రైలు మార్గం మంజూరు చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

* తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక‌త మూసీ న‌దితో ముడిప‌డి ఉంద‌ని. రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రం మ‌ధ్య‌గా మూసీ ప్ర‌వ‌హిస్తోంద‌ని.. అంత ప్రాధాన్యం ఉన్న మూసీ పున‌రుజ్జీవ‌నానికి స‌హ‌క‌రించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఈసా, మూసా న‌దుల సంగ‌మంలో ఉన్న బాపూ ఘాట్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళ‌న‌కు 27 ఎస్టీపీల నిర్మాణం, మూసీ రిటైనింగ్ వాల్స్‌, క‌ర‌క‌ట్ట‌ల నిర్మాణం, మూసీ గోదావ‌రి న‌దుల అన‌సంధానంతో క‌లిపి మొత్తంగా ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు ఆర్థిక సహాయం అంద‌జేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రిని ముఖ్య‌మంత్రి కోరారు. గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్ట్ కు 222.7 ఎక‌రాల ర‌క్ష‌ణ భూముల బ‌దిలీకి స‌హ‌క‌రించాల‌ని పీఎంకు ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

* రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ‌కు 61 ఐపీఎస్ కేడ‌ర్ పోస్టులు వ‌చ్చాయ‌ని, 2015లో రివ్యూ త‌ర్వాత మ‌రో 15 పోస్టులు అద‌నంగా వ‌చ్చాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సైబ‌ర్ నేరాలు, డ్ర‌గ్స్ కేసులు పెరగ‌డం, రాష్ట్రంలో పెరిగిన ప‌ట్ట‌ణాలు, ఇత‌ర అవ‌స‌రాల దృష్ట్యా తెలంగాణ‌కు అద‌నంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాల‌ని పీఎం మోదీని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

సెమీ కండ‌క్ట‌ర్ల ప‌రిశ్ర‌మ ఏర్పాటుకు అనువైన ప‌రిస్థితులు తెలంగాణ‌లో ఉన్నందున ఇండియా సెమీ కండ‌క్ట‌ర్ మిష‌న్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అన‌మ‌తించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్య‌మంత్రి వెంట రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు ఉన్నారు.

Tags: #cmrevanth#modi#Revanth#Telangana#Telanganatourism#TeluguNews#Tourism
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

SLBC ప్రాజెక్ట్ : టన్నెల్ బోరింగ్ మెషిన్ ఎలా పనిచేస్తుందో తెలుసా..?

Next Post

Ap Assambly:జగన్ అనర్హత..ఆర్టికల్ 190(4) ఏం చెబుతుంది?

Related Posts

GovernorQuota
Big Story

GovernorQuota:కొత్త గవర్నర్ రాకతో తెలంగాణ రాజకీయాల్లో మార్పులా? పెండింగ్‌లో ఎమ్మెల్సీ నామినేషన్లపై ఉత్కంఠ

Telangana
Big Story

Telangana:అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ – తెలంగాణకు ఐపీఎస్ అధికారుల సంఖ్య 103కు పెంచాలని విజ్ఞప్తి

TelanganaNews
Big Story

TelanganaNews:నాగర్‌కర్నూల్‌లో దారుణం.. బిడ్డకు జన్మనిచ్చి చెత్తబుట్టలో పడేసిన ఇంటర్ విద్యార్థిని ఘటన సంచలనం

TSPolitic
Big Story

TSPolitic:తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి – సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

RahulGandhi
Big Story

RahulGandhi:హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ – వికారాబాద్ పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త దిశ, డీసీసీ శిక్షణా తరగతుల్లో కీలక సూచనలు

Telangana
Big Story

Telangana:తెలంగాణలో 99 రోజుల కార్యాచరణకు శ్రీకారం, అభివృద్ధికి కొత్త దిశ

Next Post
పులివెందుల టార్గెట్‌గా కడప టీడీపీ నేతలు అడుగులు..!

Ap Assambly:జగన్ అనర్హత..ఆర్టికల్ 190(4) ఏం చెబుతుంది?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

PriyankaMohan

PriyankaMohan:‘Made In Korea’ కోసం ప్రియాంక మోహన్ జోరుగా ప్రమోషన్స్

GovernorQuota

GovernorQuota:కొత్త గవర్నర్ రాకతో తెలంగాణ రాజకీయాల్లో మార్పులా? పెండింగ్‌లో ఎమ్మెల్సీ నామినేషన్లపై ఉత్కంఠ

APAssembly

APAssembly:రెండో, మూడో సంతానానికి ₹25,000 ప్రోత్సాహకం – సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

T20WorldCup

T20WorldCup:సెమీఫైనల్‌లో భారత్ ఘన విజయం – ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు టీమిండియా దూసుకెళ్లింది

Recent News

PriyankaMohan

PriyankaMohan:‘Made In Korea’ కోసం ప్రియాంక మోహన్ జోరుగా ప్రమోషన్స్

GovernorQuota

GovernorQuota:కొత్త గవర్నర్ రాకతో తెలంగాణ రాజకీయాల్లో మార్పులా? పెండింగ్‌లో ఎమ్మెల్సీ నామినేషన్లపై ఉత్కంఠ

APAssembly

APAssembly:రెండో, మూడో సంతానానికి ₹25,000 ప్రోత్సాహకం – సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

T20WorldCup

T20WorldCup:సెమీఫైనల్‌లో భారత్ ఘన విజయం – ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు టీమిండియా దూసుకెళ్లింది

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info