ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో హవాలా డబ్బు కలకలం రేపింది. ఓ వ్యాపారి తరలిస్తున్న డబ్బుతో డ్రైవర్, గుమస్తా పరారయ్యారు.అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యాపారి డబ్బును ఢిల్లీ నుంచి చెన్నైకి డబ్బును తరలిస్తున్నాడు. తన కారు డ్రైవర్(Car Driver)తో పాటు గుమస్తా ద్వారా రూ.4.5 కోట్ల నగదును సదరు వ్యాపారి హవాలా కింద పంపించాడు. ఇతరులకు ఈ మొత్తాన్ని అప్పజెప్పాల్సి ఉంది. ఈ క్రమంలో ఆ డబ్బుతో డ్రైవర్, గుమస్తా పరారయ్యారు.
దీంతో సదరు వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు రూ. 3 కోట్ల వరకు రివకరీ చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ నగదును ఎవరికి హవాలా చేస్తున్నారన్నది చర్చకు దారితీసింది. పోలీసులు విచారణ జరుపుతున్నారు.