వరద నీటిని ఒడిసి పట్టండి బురద రాజకీయాలు మానండి రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం.కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే ఈ ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదిలి పడావు పెట్టింది.**నంది మేడారంలో కటక ఒత్తితే రోజుకి రెండు టీఎంసీల నీళ్లు వస్తాయి. కానీ ఎందుకు నీళ్లను సముద్రంలో వదులుతున్నారు.ఇది రాష్ట్ర ప్రభుత్వ క్రిమినల్ నెగ్లిజెన్సీ.. నీళ్ల విలువ రైతులకు తెలుస్తుంది కానీ రేవంత్ రెడ్డికి, ఉత్తంకుమార్ రెడ్డికి తెలియదు.కృష్ణా గోదావరి నీళ్లు సముద్రం పాలైతుంటే కనులప్పగించి చూస్తున్నాడు రేవంత్ రెడ్డి.
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని చెప్పిన మీ అబద్ధాన్ని నిజం చేసేందుకే మోటార్లను ఆన్ చేయడం లేదా రేవంత్ రెడ్డి.ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖకు మంత్రి ఉన్నాడా.. ముఖ్యమంత్రికి సోయి ఉన్నదా.వరద నీటిని ఒడిసిపట్టి రిజర్వాయర్లు చెరువులు నింపితే యాసంగిలో లక్షల ఎకరాల పంట పండుతుంది.వెంటనే మోటార్లను ఆన్ చేసి రోజుకి రెండు టీఎంసీలు నీళ్లు మిడ్ మానేరుకు, అక్కడినుండి మిగతా రిజర్వాయర్లకు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.కాళేశ్వరం మోటర్లను కక్షపూరితంగా పనికిరాకుండా చేయాలని రోజుకు రెండుసార్లు ఆన్ ఆఫ్ చేస్తున్నారు.రాజకీయాల కోసం మాట్లాడడం లేదు రైతుల ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న.ఈ రాష్ట్రా మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా అవగాహనతోమాట్లాడుతున్న వెంటనే మోటర్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలి
*రైతులతో వేలాది మందిగా కదిలి వచ్చి మేమే మోటార్లను ఆన్ చేస్తామని హెచ్చరిస్తున్నాం.**మాజీ మంత్రి హరీష్ రావుమాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్
రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయాల కోసం రైతులపై పగా ప్రతీకారం తీర్చుకుంటున్నది.అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలి తప్ప కీడు చేయకూడదు.ప్రజలకు కీడు చేస్తే అది ప్రభుత్వమే అనబడదు.కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టును పడావు పెట్టింది.శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 62 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది.కడెం ప్రాజెక్టుకు మధ్యాహ్నం తర్వాత 1,50,000 క్యూసెక్కుల వరద వస్తున్నది.సాయంత్రం వరకు ఈ పూర్తి వరద కడెం ప్రాజెక్టు నుండి శ్రీపాద ఎల్లంపల్లి కి వస్తుంది.నంది మేడారం గాయత్రి పంప్ హౌస్ కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లాగా ఉంది.నంది మేడారంలో ఖటక ఒత్తితే రోజుకి రెండు టీఎంసీల నీళ్లు వచ్చి మిడ్ మానేరులో పడతాయి.వారం రోజుల కిందనే ఈ విషయాన్ని ఉత్తంకుమార్ రెడ్డికి తెలుపుతూ ఉత్తరం రాశాను.
అన్నపూర్ణ రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయి. చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి. నీళ్లను ఒడిసి పట్టండి. వెంటనే మోటర్లు ఆన్ చేయండి అని ప్రభుత్వానికి విన్నపం చేశాను.దురదృష్టం ప్రభుత్వం మోటర్లు ఆన్ చేయలేదు. ఇప్పుడు ఎల్లంపల్లి గేట్లెత్తి నీళ్లను సముద్రంలోకి వదులుతున్నారు.ఇది రాష్ట్ర ప్రభుత్వ క్రిమినల్ నెగ్లిజెన్సీ..నీళ్ల విలువ రైతులకు తెలుస్తది ఉత్తంకుమార్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి తెలియదు.కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నా వ్యవసాయం చేసే ఒక రైతు. ఆయన రైతు గనుక ప్రతి చుక్కను వడిచిపెట్టి నీళ్లను రైతులకు అందించాడు.మీరు ఎన్నడు వ్యవసాయం చేయలేదు అందుకే మీకు నేల విలువ తెలియదు.ఈరోజు కృష్ణా, గోదావరి నీళ్లు సముద్రం పాలయితుంటే గుడ్లప్పగించి రేవంత్ రెడ్డి ఉత్తంకుమార్ రెడ్డి చూడడం తప్ప ఏం చేయడం లేదు.
మీ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైన నష్టం జరుగుతున్నది.రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో చెరువుల నిండలేదు. డ్యాములు ఖాళీగా ఉన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో డ్యాములు ఖాళీగా ఉన్నాయి.మీరు ఎవరి కోసం పని చేస్తున్నారు రేవంత్ రెడ్డి?కేసీఆర్ పైన హరీష్ రావు పైన మీకు కోపం ఉంటే మాకు శిక్ష వేయండి కానీ రైతులకు కాదు.వరద నీటిని ఒడిసి పట్టండి. బురద రాజకీయాలు మానండి.కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది అని మీరు చెప్పిన అబద్ధాన్ని నిరూపించడానికి మోటార్లను ఆన్ చేయడం లేదు.అన్నపూర్ణ రిజర్వాయర్ కెపాసిటీ మూడున్నర టీఎంసీలు.. అందులో ఉన్నది కేవలం 1TMC నీళ్లు మాత్రమే.రంగనాయక సాగర్ కెపాసిటీ 3 టీఎంసీలు ఉన్నది ఒక్క టీఎంసీ.మల్లన్న సాగర్ కెపాసిటీ 50 టీఎంసీలు ఉన్నది 10 టీఎంసీలు.కొండపోచమ్మ సాగర్ కెపాసిటీ 15 టి.ఎం.సిలు ఉన్నది నాలుగు టీఎంసీలు.బస్వాపూర్ 12 టిఎంసిలు.. కానీ ఉన్నది అర టీఎంసీ..మీరు రిజర్వాయర్లు నింపడానికి ఏం అడ్డం వచ్చింది రేవంత్ రెడ్డి ఎందుకు నింపడం లేదు..కాళేశ్వరం కూలిందని చేసిన దుష్ప్రచారాన్ని కప్పిపుచ్చుకోవడానికి మోటర్లు ఆన్ చేయడం లేదు.ఎస్సారెస్పీలో 61 టిఎంసిలు వచ్చాయి. 1, 51,000 క్యూసెక్కుల వరద ఎస్సారెస్పీకి వస్తున్నది.వరద కాలువ ఓపెన్ చేసి మిడ్ మానేరు ఎల్ఎండి ఎందుకు నింపడం లేదు.
ఇరిగేషన్ శాఖకు మంత్రి ఉన్నాడా ముఖ్యమంత్రికి సోయున్నదా?30 టీఎంసీల మిడ్ మానేరులో ఉన్నది కేవలం పది టి.ఎం.సిలే..ఎల్ఎండిలో కూడా 24 టీఎంసీల్లో కేవలం 7టీఎంసీలు మాత్రమే ఉన్నాయి..ప్రభుత్వం నడపడం చేతకావడం లేదా రేవంత్ రెడ్డి?ఈ రిజర్వాయర్ లన్ని నింపుతే యాసంగిలో లక్షల ఎకరాల్లో పంట పండుతుంది.వాన కాలంలో సగం సాగు కూడా కాలేదు. నీటిని ఒడిసిపడితే యాసంగిలోనైనా పూర్తి పంట పండే అవకాశం ఉంటుంది.వెంటనే రోజుకి రెండు టీఎంసీల నీళ్లు తేవచ్చు..ఎల్లంపల్లిలో ఏడు మోటర్లు నడుపుతే 22,000 క్యూసెక్కులు మిడ్ మానేరుకు వస్తాయి. ఎందుకు మూడు మోటార్లే నడుపుతున్నారు?ఎందుకు నీళ్లను సముద్రం పాలు చేస్తున్నారు?ఎల్లంపల్లి ఏడు మోటర్లు ప్రారంభించి రోజుకు రెండు టీఎంసీలు నీళ్లను మిడ్ మానేరుకు.. అక్కడినుండి రోజుకి ఒక టీఎంసీని అన్నపూర్ణ రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లకు తేవాలి..ఈ యాసంగికి లక్షలాది ఎకరాలకు నీళ్లను అందించాలని డిమాండ్ చేస్తున్నాం.మిడ్ మానేరు నుండి కాళేశ్వరం మోటార్లను ఆన్ చేసి రిజర్వాయర్లను చెరువులను నింపాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈ ప్రభుత్వం రైతులను గోసపెట్టుకుంటున్నది.. ఎరువుల కోసం, పంట బీమా కోసం, కరెంటు ఇవ్వడానికి, ఆఖరికి నీళ్లను ఇచ్చేందుకు కూడా గోసపెడుతుంది ఈ ప్రభుత్వం.కృష్ణా నదిలో హైడెల్ పవర్ ఉచితంగా ఉత్పత్తి అవుతున్నది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ లో రోజుకు 42 మిలియన్ యూనిట్లు కరెంటు ఉత్పత్తి అవుతున్నది.మోటర్లు ఆన్ చేయడం చేతకాకపోతే మేమే వేలాదిమంది రైతులతో కదిలి వెళ్లి మోటార్లను ఆన్ చేస్తాం.కాళేశ్వరం ప్రాజెక్టులో రోజుకు రెండు టీఎంసీలు తెచ్చే వ్యవస్థ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి పెట్టింది ఎందుకు మోటార్లు ఆన్ చేయడం లేదు.నీళ్లను సముద్రం పాలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు.వేలాది మందిగా కదిలి వచ్చి మేమే మోటాలను ఆన్ చేస్తాం రైతులకు నీళ్లు అందిస్తాం.10 ఏళ్లలో ఎన్నడు రైతులు ఎరువు బస్తాల కోసం అరుగుల మీద పడుకోలేదు.కాంగ్రెస్ వచ్చింది మార్పు వచ్చింది. మళ్ళీ పాత రోజులు వచ్చాయి. చెప్పులను లైన్లో పెట్టి అరుగుల మీద పండుకునే రోజులు వచ్చాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్ ఆన్ చేయడంలో ఈ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది.మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు.. ఇవి ఇంట్లో ఉండే వన్ హెచ్ పీ మోటర్లు కాదు.ఒక మోటారు నడవాలంటే ఒక జిల్లా ప్రజలు వాడే అంత కరెంటు పడుతుంది.. ఆ మోటార్లను ఆన్ చేయడం ఆఫ్ చేయడం చేస్తున్నారు. అలా చేస్తే మోటార్లు పాడైతాయి. బేరింగ్లు పోతాయి.పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మోటార్లు నడిపిస్తున్నారు.కరెంటు పీక్ లోడు 5 గంటల తర్వాత ఉంటుంది కాబట్టి మోటార్లను ఆఫ్ చేస్తున్నారు. అలా చేసినట్లయితే మోటర్లు పాడైతాయి వేలకోట్ల నష్టం వాటిల్లుతుంది.ఈ విషయంపై బీహెచ్ఎల్ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించింది.మోటర్లు పనికిరాకుండా అయితే మళ్లీ ఆ బదనాం బీఆర్ఎస్ పార్టీ పై వేయాలని చూస్తున్నారు.చొప్పదండిలో మోటర్ ఆన్ చేయాలని రేషన్ కార్డులు పంచడానికి వచ్చిన ఉత్తంకుమార్ రెడ్డిపై జనాలు తిరగబడితే మోటర్లు ఆన్ చేసి ఉత్తంకుమార్ రెడ్డి హెలికాప్టర్ లో వెళ్ళిపోగానే మళ్లీ ఆఫ్ చేశారు.
ఇంజనీరింగ్ నిపుణులను అడగండి. బీహెచ్ఎల్ ఇంజనీర్లను అడగండి. ఆన్ ఆఫ్ పద్ధతిలో నడిపితే మోటర్లు కాలిపోతాయి అని హెచ్చరిస్తున్నాం.రాజకీయాల కోసం మాట్లాడటం లేదు. రైతుల కోసం మాట్లాడుతున్న.. రైతుల పక్షాన మాట్లాడుతున్న. మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా అవగాహనతో మాట్లాడుతున్న.నా జిల్లా రైతులు, రాష్ట్రం రైతులు దెబ్బతింటారనే ఆవేదనతో మాట్లాడుతున్న.నల్గొండలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ లో గేట్లు ఎత్తి నీళ్లను సముద్రంలోకి వదులుతున్నారు కానీ మోటర్లు ఆన్ చేసి నీళ్లను ఒడిసిపట్టడం లేదు.ఏఎంఆర్పీ ప్రాజెక్ట్ కింద డిస్ట్రిబ్యూటర్ల ద్వారా చెరువులకు నీళ్లు ఎందుకు వదలడం లేదు.కల్వకుర్తిలో మూడు మోటర్లు నడపవలసి ఉంటే కేవలం ఒక్క మోటార్ మాత్రమే నడుపుతున్నారు.దేవాదులలో మంత్రులు వెళ్లి ఫేస్ 3 ఇనాగ్రేషన్ చేశారు. దేవాదుల మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదు.. వరంగల్ జిల్లా రైతులకు అన్యాయం చేస్తున్నారు.ఎమ్మార్పీ మోటార్ ఆన్ చేయక నల్గొండ జిల్లాకి నష్టం.కల్వకుర్తి మోటార్ ఆన్ చేయక మహబూబ్నగర్ జిల్లాకి నష్టం.కాళేశ్వరం మోటార్ ఆన్ చేయకుంటే కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలకు నష్టం.కమీషన్లకే మీకు సమయం సరిపోలేదు ఇంకా పరిపాలన ఏడ చేస్తారు.రైతు ప్రాజెక్ట్ల కంటే రాజకీయాలు ముఖ్యమా?