పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా కోసం ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. కరోనాకు ముందు మొదలైన ఈ సినిమా మొత్తానికి అన్ని అడ్డంకులు దాటుకుని జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో కనిపించనున్నాడు.ముందుగా ఈ సినిమాను డైరెక్టర్ క్రిష్ మొదలుపెట్టాడు. కానీ తర్వాత సినిమా షూటింగ్ లేటవడంతో డైరెక్టర్ క్రిష్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ సినిమా బాధ్యతల్ని తీసుకుని సినిమాను పూర్తి చేశాడు. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది. తెలుగుతో పాటూ తమిళ, హిందీ, మలయాళ భాషల్లో మేకర్స్ ఈ సినిమా రిలీజ్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు.
రిలీజ్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఈ సినిమా బిజినెస్ ను క్లోజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సినిమా డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. అందులో భాగంగానే హరిహర వీరమల్లును కేరళలో ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ తన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ద్వారా రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దుల్కర్ ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో కేరళలో ఈ సినిమాకు మంచి బజ్ వచ్చే ఛాన్సుంది.మరోవైపు వీరమల్లు నైజాం మార్కెట్ కు సంబంధించి కూడా ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం సితార సంస్థ రేస్ లో ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ రేస్ లోకి మైత్రీ డిస్ట్రిబ్యూషన్ వారు కూడా వచ్చారని తెలుస్తోంది. దీంతో వీరమల్లు నైజాం హక్కులు ఎవరికి సొంతం అవుతాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎం.ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాకు గ్రాండ్ గా ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.
హరిహరవీరమల్లు` రిలీజ్ సమయం దగ్గర పడుతోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియాలో ప్రచారానికి టీమ్ రెడీ అవుతోంది. ముంబైలో నిర్వహించే మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని సమాచారం ఉంది. అలాగే రెండు భారీ ఈవెంట్లు కూడా నిర్వహిస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగానూ ప్రకటించారు. అందులో ఒక ఈవెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది. అది తెలంగాణాలోనా? ఆంధ్రాలోనా? అన్నది క్లారిటీ లేదు.కానీ ఈవెంట్ తప్పనిసరి. అయితే ఇప్పుడా చిత్ర యూనిట్ ను కరోనా వైరస్ కంగారు పెడుతోందా? పబ్లిక్ ఈవెంట్ విషయంలో నిర్ణయాలు మారే అవకాశం లేకపోలేదా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. వైరస్ కి సంబంధించి ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది. ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. కేసులు ఎక్కువవుతోన్న వేళ వైరస్ కు తగ్గ జాగ్రత్తలపై అలెర్ట్ ప్రకటించింది. స్వీయా జాగ్రత్తలు తప్పనిసరిగా సూచించింది.
దీంతో వీరమల్లు టీమ్ కు గుబులు మొదలైంది. అభిమానుల సమక్షంలో ఈవెంట్ నిర్వహించాలంటే సాద్యమవుతుందా? లేదా? అన్న కొత్త టెన్షన్ మొదలైంది. ఈ వెంట్ కు ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. పైగా ఈ సినిమాలో నటించింది పవన్ కళ్యాణ్. అందులోనే ఆయన ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్రజలకు సంబంధించిన బాధ్యతలు ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ పై ఉన్నాయి. కాబట్టి వైరస్ సమయంలో ఇలాంటి ఈవెంట్లు అవసరమా? అన్న పునరాలోచించే అవకాశం ఉంది. పవన్ ఈవెంట్ అంటే భారీ ఎత్తున అభిమానులు రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తారు. కరోనా పాజిటివ్ కేసులు కూడా రాష్ట్రంలో చాలా చోట్ల నమోదయ్యాయి. ఎవరిరి వారు స్వీయా నియంత్రణ పాటించ కపోయినా? బహిరంగంగా సినిమా ఈవెంట్ నిర్వహిస్తే అది సమస్యగా మారుతుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ , అతని నిర్మాతలు ఈవెంట్ విషయంలో మరో ఆలోచన ఏదైనా చేస్తారా? లేక యధావిధిగా నిర్వ హిస్తారా? అన్నది చూడాలి.
తెలుగు సినీ ఇండస్ట్రీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలిసిందే. థియేటర్స్ బంద్ అంటూ ప్రకటన రావడం.. ఆ తర్వాత లేదని ప్రకటించడం.. డిప్యూటీ సీఎం పవన్ ఫైర్ అవ్వడం.. హరిహర వీరమల్లు ఎందుకు ఇలా జరిగిందని విచారణకు ఆదేశించడం.. అవన్నీ తెలిసిన విషయాలే. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులపై దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.పవన్ మూవీ ఆపే మగాడు లేడని వ్యాఖ్యానించారు. “దేవర రిలీజ్ ముందు సినిమా ఆపేస్తామన్నారు.. పుష్ప సినిమా ముందు కూడా అలానే అన్నారు.. ఏమైనా చేశారా.. రెండు సినిమాలు కూడా రికార్డ్ కలెక్షన్స్ సాధించాయి.. ఇప్పుడు పవన్ చిత్రం ముందు అన్నారు. ఎవరేం చేయగలరు.. అంత మగాడు ఎవరున్నాడు.. ఎవరో ఏం పని లేని వాళ్లు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు” అని తమ్మారెడ్డి భరద్వాజ్ వ్యాఖ్యానించారు.
సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు ఉంటే ఉండవచ్చు.. కానీ పవన్ గారి చుట్టూ ఉన్న రాజకీయం అది కాదు.. ఎందుకంటే ఆ నలుగురు అంటున్నారు కదా.. ఆ నలుగురిలో ఒకరిది మూవీ కుబేర కూడా ఉంది. ఇదే టైమ్ లో ఆ సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్స్ మూసివేస్తే వాళ్లకు లాస్ ఉంటుంది కదా.. అందుకే సమస్య అది కాన్నట్లు ఉంది” అని తెలిపారు. “సమస్య ఇంకేదో ఉంది.. ఆ నలుగురిలో ఉన్న అంతర్గత సమస్యలున్నాయేమో.. అల్లు అరవింద్ గారు పది మంది అంటున్నారు.. గతంలో ఆయన నలుగురిలో ఉన్నారు కదా.. ఇప్పుడు కుట్రలో ఉన్నారా లేదా అన్నది పాయింట్ కాదు. ఇండస్ట్రీని కంట్రోల్ చేసి శక్తుల్లో ఆయన ఒకరు. అల్లు అరవింద్ తోపాటు అనేక మంది ఉన్నారు” అని చెప్పారు.
సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, మైత్రీ మూవీ మేకర్స్, నాగవంశీ.. రెగ్యులర్ మూవీ తీస్తున్న వాళ్లే నాయకులు.. 200 సినిమాలు వస్తే వాళ్లవి 50 చిత్రాలు ఉంటాయి. వాటిపైనే ఫోకస్ ఉంటుంది. అందుకే వాళ్ల మధ్యలో ఏమైనా ఉందా అనేది డౌట్. కానీ నాకు క్లియర్ గా తెలియదు. నేను ఈ మధ్య సరిగ్గా పట్టించుకోవడం లేదు” అని అన్నారు. “ఇండస్ట్రీని రిఫ్లెక్ట్ చేసేది ఛాంబర్, కౌన్సిల్ సహా పలు సంఘాలు. కానీ గత 15 ఏళ్ల నుంచి చూసుకుంటే.. కొంతమంది వ్యక్తులు వాళ్లకు నచ్చిన గవర్న్మెంట్ దగ్గరకు వెళ్లి నచ్చిన పనులు చేసుకుంటున్నారు. వాళ్లే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్లు.. మిగతా వాళ్లు కాదు అన్న పరిస్థితిని ఇప్పుడు ఇండస్ట్రీలోకి తెచ్చారు” అని వ్యాఖ్యానించారు “అలా ఇండస్ట్రీలో రెండు మూడు గ్రూపులు ఉన్నాయి. దీంతో వాళ్లు వస్తే.. వీళ్లు.. వీళ్ళు వస్తే వాళ్లను తిడుతున్నారు. దీంతో ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. అప్పుడు ఎన్టీఆర్ టీడీపీ అయినా.. కృష్ణ కాంగ్రెస్ అయినా కలిసినప్పుడు పట్టించుకునేవారు.. పలకరించుకునేవాళ్లు.. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.. కనీసం ముఖాలు చూసుకోవడం లేదు” అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు.