• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Latest

Chandrababu Naidu: గేమ్ ఛేంజర్

Chandrababu Naidu: గేమ్ ఛేంజర్

ఐటీ అంటేనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుకు వస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ను ఐటీ రాజధానిగా తీర్చిదిద్దడంలో ఆయన కృషిని ఎవరూ మరవలేరని చంద్రబాబు మద్దతు దారులు చెబుతుంటారు. అదే సమయంలో ఐటీ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ చంద్రబాబుపై ఆయన ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటారు.

ఏది ఏమైనా ఐటీ అంటే చంద్రబాబే అని చాలా మంది చెబుతారు. ఇక చంద్రబాబు పరిపాలన కూడా ఎక్కువగా ఐటీ ఆధారంగానే కొనసాగుతుంది. ఆధునిక సాంకేతికతను వాడుకుని రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడుపుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు చెబుతుంటారు. అయితే తనకు ఇంతలా గుర్తింపు తీసుకువచ్చిన ఐటీ రంగం ప్రస్తుతం ఈ దశలో ఉండటానికి ఓ ముఖ్యనేత కారణమని సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇప్పటివరకు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన నేతగానే ఆ మహా నేతకు గుర్తింపు ఉండగా, ఐటీ విప్లవానికి నాంది పలికింది కూడా ఆయనే అంటూ మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు కోసం చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

దేశంలో ఐటీ విప్లవం క్రెడిట్ దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకే దక్కుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఢిల్లీలో నిర్వహించిన ‘లెక్చర్ సిరీస్’ 6వ ఎడిషన్ కార్యక్రమంలో ‘లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ’ అన్న అంశంపై చంద్రబాబు ప్రసంగించారు. దాదాపు 40 నిమిషాలు మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు దివంగత ప్రధాని పీవీలోని అనేక కోణాలను ఆవిష్కరించారు. ఐటీని దేశంలో విస్తృత ప‌రిచిన ప్ర‌ధానిగా పీవీకి ఖ్యాతి దక్కుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ముఖ్యంగా దేశంలో మొబైల్ ఫోన్లు ఇతర కమ్యూనికేషన్ రంగాలు అభివృద్ధికి పీవీనే కారణమని చంద్రబాబు వెల్లడించారు. ప్రధానిగా ఆర్థిక సంస్కరణలతోపాటు ఇతర సంస్కరణలను ప్రవేశపెట్టిన పీవీ దేశంలో అభివృద్ధికి బాటలు పరిచారని చెప్పారు. లైసెన్స్ రాజ్ నిబంధనల నుంచి దేశాన్ని బయటకు తెచ్చిన ఘనత కూడా పీవీకే దక్కుతుందని ఆయన కొనియాడారు.

ప్రధానిగా పీవీ తెచ్చిన అనేక సంస్కరణలు దేశానికి గేమ్ ఛేంజర్ గా మారాయని చంద్రబాబు తెలిపారు. ఐటీ విప్లవానికి ఆయన పునాదులు వేయడం వల్లే మన దేశంలో ఐటీలో ఈ స్థితికి చేరుకుందని చెప్పారు. మైనార్టీ ప్రభుత్వంలోనూ పీవీ చాలా లౌక్యంగా వ్యవహరించారని గుర్తు చేశారు. పీవీ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ నేత అటల్ బిహారీ వాజపేయి కూడా పీవీ విధానాలు కొనసాగించారని కొనియాడారు.

పీవీ మాదిరిగా ప్రస్తుత ప్రధాని మోదీ కూడా సంస్కరణలతో పాలన సాగిస్తున్నారని అభినందించారు. ఇదే సమయంలో ఏపీలో గత ప్రభుత్వం విధ్వంసానికి ఒడిగట్టిందని ధ్వజమెత్తారు. తాను అమరావతి రాజధానిని ప్రతిపాదిస్తే, ముందుగా ఒప్పుకుని తర్వాత ధ్వంసం చేశారని ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు.

Tags: ChandrababuNaidu PVNarasimhaRao ITRevolution AndhraPradesh AmaravatiVision IndianPolitics TechLeadership TeluguPride DigitalIndia EconomicReforms ModernGovernanceIt
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Telangana: ఘనంగా బోనాలు వేడుకలు

Next Post

Microsoft: అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ

Related Posts

Microsoft: అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ
Latest

Microsoft: అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ

Telangana: ఘనంగా బోనాలు వేడుకలు
Big Story

Telangana: ఘనంగా బోనాలు వేడుకలు

Andhra Pradesh: రాజకీయమా.. కుట్రనా..?
Andhra Pradesh

Andhra Pradesh: రాజకీయమా.. కుట్రనా..?

Pawan Kalyan: అభిమానుల ఎదురు చూపులకు తెర
Entertainment

Pawan Kalyan: అభిమానుల ఎదురు చూపులకు తెర

Ravi Teja: ధమాకా మూవీగా ‘మాస్‌ జాతర’
Entertainment

Ravi Teja: ధమాకా మూవీగా ‘మాస్‌ జాతర’

Sukumar: హాలీడే మూడ్‌లో
Entertainment

Sukumar: హాలీడే మూడ్‌లో

Next Post
Microsoft: అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ

Microsoft: అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Microsoft: అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ

Microsoft: అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ

Chandrababu Naidu: గేమ్ ఛేంజర్

Chandrababu Naidu: గేమ్ ఛేంజర్

Telangana: ఘనంగా బోనాలు వేడుకలు

Telangana: ఘనంగా బోనాలు వేడుకలు

Andhra Pradesh: రాజకీయమా.. కుట్రనా..?

Andhra Pradesh: రాజకీయమా.. కుట్రనా..?

Recent News

Microsoft: అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ

Microsoft: అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ

Chandrababu Naidu: గేమ్ ఛేంజర్

Chandrababu Naidu: గేమ్ ఛేంజర్

Telangana: ఘనంగా బోనాలు వేడుకలు

Telangana: ఘనంగా బోనాలు వేడుకలు

Andhra Pradesh: రాజకీయమా.. కుట్రనా..?

Andhra Pradesh: రాజకీయమా.. కుట్రనా..?

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info