ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Bangladesh | మానవత్వంపై దాడి! బంగ్లాలో హిందువుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది.

Bangladesh | మానవత్వంపై దాడి! బంగ్లాలో హిందువుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది.
ADVERTISEMENT

గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఒక్కమాటలో చెప్పాలంటే… షరీఫ్ ఉస్మాన్ హైదీ మరణానంతరం బంగ్లాదేశ్ లో అంతర్లీనంగా అశాంతి పెద్ద ఎత్తున ఆక్రమించింది. ఈ నేపథ్యంలో దీపు చంద్రదాస్ అనే హిందూ వ్యక్తిని అరాచక ముఠా ఒకటి కొట్టి చంపింది. అతని మృతదేహాన్ని చెట్టుకు కాల్చి నిప్పి పెట్టింది. ఈ ఘటనను యావత్ భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలో మరో హిందూని కొట్టి చంపారు.

అవును… బంగ్లాదేశ్ లో అరాచక ముఠా దీపు చంద్రదాస్ అనే హిందూ వ్యక్తిని కొట్టి చంపిన కొన్ని రోజుల తర్వాత మరో ఘోరం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా… బంగ్లాదేశ్ లో మరో హిందూ వ్యక్తిని కొట్టి చంపినట్లు గురువారం స్థానిక మీడియా నివేదించింది. బాదితుడిని అమృత్ మండల్ అలియాస్ సామ్రాట్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి దాడి జరగ్గా.. గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు చెబుతున్నారు.

నివేదికల ప్రకారం… సామ్రాట్ అనే వ్యక్తి గత ఏడాది షేక్ హసీనా బహిష్కరణ తర్వాత దేశం విడిచి పారిపోయి, ఇటీవల కలిమోహోర్ యూనియన్ లోని తన గ్రామం హోసెండంగాకు తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో.. అతను, అతని బ్యాచ్ లోని కొంతమంది సభ్యులు గ్రామస్థుడు షాహిదుల్ ఇస్లాం ఇంటికి వెళ్లి డబ్బు వసూలు చేశారని అంటున్నారు. ఈ సమయంలో.. కుటుంబ సభ్యులు ఎదురు తిరిగారని చెబుతున్నారు.

ఈ క్రమంలో.. వారంతా… దొంగ దొంగ అని అరవడం ప్రారంభించారని.. దీంతో ఇతర గ్రామస్తులు రావడంతో ఆ బ్యాచ్ సభ్యులు మొత్తం పారిపోయారని.. అయితే, సామ్రాట్ మాత్రం వారికి దొరికిపోయాడని చెబుతున్నారు. దీంతో అతన్ని పట్టుకున్న గ్రామస్థులు తీవ్రంగా కొట్టారని అంటున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన పాంగ్షా సర్కిల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ దేబ్రత్ సర్కార్ మాట్లాడుతూ… పోలీసులు సామ్రాట్ ను ఆ గుంపు నుంచి రక్షించారని.. అనంతరం ఆసుపత్రికి తరలించారని, అయితే అక్కడ చికిత్స పొందుతూ అతడు గురువారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో మృతి చెందాడని తెలిపారు. ఈ సందర్భంగా.. ఇప్పటికే సామ్రాట్ పై పాంగ్షా స్టేషన్ లో రెండు కేసులు ఉన్నాయని.. వాటిలో ఒకటి హత్య కేసు అని తెలిపారు.

కాగా… గత గురువారం ఢాకాకు సుమారు మూడు గంటల దూరంలో ఉన్న మైమెన్ సింగ్ లో 25 ఏళ్ల చంద్రదాస్ పై ఓ సహోద్యోగి దైవదూషణ ఆరోపణలు చేయడంతో.. ఓ గుంపు అతన్ని కొట్టి చంపిన సంగతి తెలిసిందే. అనంతరం.. అతని మృతదేహాన్ని చెట్టుకు కట్టి నిప్పు పెట్టింది. ఈ ఘటనపై భారత్ లోని వివిధ ప్రదేశాల్లో నిరసనలు చెలరేగాయి. అయితే.. దాస్ దైవ దూషణకు పాల్పడ్డాడనటానికి ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు చెబుతున్నారు.

Tags: #bangladeshcrisis#bangladeshviolence#BreakingNews#communalattack#GlobalConcern#HindusInBangladesh#hinduvictim#HumanRights#InternationalNews#JusticeForVictims#MinorityUnderAttack#ReligiousViolence#SafetyConcerns#SaveMinorities#StopReligiousViolence#WorldNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Vrusshabha movie review: | మూవీ రివ్యూ : వృషభ

Next Post

Bhimavaram | ఫీల్డ్ నుంచి డీజీపీ ఆఫీస్‌కు.. భీమవరం డీఎస్పీ ట్రాన్స్‌ఫర్

Related Posts

AP News:అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… మృతుల సంఖ్య 15కి పెరిగింది
Crime

Road Accident | నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన నలుగురు మృతి

Andhra Pradesh  | అమరావతికి కేంద్రం గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయంతో రాజధాని అభివృద్ధికి ఊపు
Andhra Pradesh

Andhra Pradesh | అమరావతికి కేంద్రం గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయంతో రాజధాని అభివృద్ధికి ఊపు

Bhimavaram | ఫీల్డ్ నుంచి డీజీపీ ఆఫీస్‌కు.. భీమవరం డీఎస్పీ ట్రాన్స్‌ఫర్
Andhra Pradesh

Bhimavaram | ఫీల్డ్ నుంచి డీజీపీ ఆఫీస్‌కు.. భీమవరం డీఎస్పీ ట్రాన్స్‌ఫర్

AP:రైతుగా మారిన మంత్రి నిమ్మల రామానాయుడు | పొలంలో పార పట్టిన జల వనరుల శాఖ మంత్రి
Andhra Pradesh

AP:రైతుగా మారిన మంత్రి నిమ్మల రామానాయుడు | పొలంలో పార పట్టిన జల వనరుల శాఖ మంత్రి

Polavaram project | జూన్ 2027కి పోలవరం రెడీ? కేంద్రం–రాష్ట్రం స్పష్టమైన ఆదేశాలు!
Andhra Pradesh

Polavaram project | జూన్ 2027కి పోలవరం రెడీ? కేంద్రం–రాష్ట్రం స్పష్టమైన ఆదేశాలు!

Sunaina Roshan | పెళ్లి, విడాకులు, క్యాన్సర్, అలవాట్లు.. సునీనా స్టోరీలో ఊహించని నిజాలు
Entertainment

Sunaina Roshan | పెళ్లి, విడాకులు, క్యాన్సర్, అలవాట్లు.. సునీనా స్టోరీలో ఊహించని నిజాలు

Next Post
Bhimavaram | ఫీల్డ్ నుంచి డీజీపీ ఆఫీస్‌కు.. భీమవరం డీఎస్పీ ట్రాన్స్‌ఫర్

Bhimavaram | ఫీల్డ్ నుంచి డీజీపీ ఆఫీస్‌కు.. భీమవరం డీఎస్పీ ట్రాన్స్‌ఫర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

AP News:అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… మృతుల సంఖ్య 15కి పెరిగింది

Road Accident | నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన నలుగురు మృతి

Andhra Pradesh  | అమరావతికి కేంద్రం గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయంతో రాజధాని అభివృద్ధికి ఊపు

Andhra Pradesh | అమరావతికి కేంద్రం గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయంతో రాజధాని అభివృద్ధికి ఊపు

Bhimavaram | ఫీల్డ్ నుంచి డీజీపీ ఆఫీస్‌కు.. భీమవరం డీఎస్పీ ట్రాన్స్‌ఫర్

Bhimavaram | ఫీల్డ్ నుంచి డీజీపీ ఆఫీస్‌కు.. భీమవరం డీఎస్పీ ట్రాన్స్‌ఫర్

Bangladesh | మానవత్వంపై దాడి! బంగ్లాలో హిందువుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది.

Bangladesh | మానవత్వంపై దాడి! బంగ్లాలో హిందువుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది.

Recent News

AP News:అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… మృతుల సంఖ్య 15కి పెరిగింది

Road Accident | నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన నలుగురు మృతి

Andhra Pradesh  | అమరావతికి కేంద్రం గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయంతో రాజధాని అభివృద్ధికి ఊపు

Andhra Pradesh | అమరావతికి కేంద్రం గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయంతో రాజధాని అభివృద్ధికి ఊపు

Bhimavaram | ఫీల్డ్ నుంచి డీజీపీ ఆఫీస్‌కు.. భీమవరం డీఎస్పీ ట్రాన్స్‌ఫర్

Bhimavaram | ఫీల్డ్ నుంచి డీజీపీ ఆఫీస్‌కు.. భీమవరం డీఎస్పీ ట్రాన్స్‌ఫర్

Bangladesh | మానవత్వంపై దాడి! బంగ్లాలో హిందువుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది.

Bangladesh | మానవత్వంపై దాడి! బంగ్లాలో హిందువుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది.

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info