ఏపీలో భారీ మెజార్టీతో, భారీ ఆశలతో కూటమి ప్రభుత్వం గతేడాది కొలువు తీరింది. అనంతరం చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో విపక్ష వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. రాష్ట్రంలో తిరిగి పుంజుకునేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అధికార కూటమిలో ఉన్న మూడు పార్టీల ఎమ్మెల్యేలు, వారిలో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న సర్వే ఫలితాల నేపథ్యంలో తాజాగా రైజ్ సంస్ధ రాష్ట్ర వ్యాప్త సర్వే ఫలితాలు ప్రకటించింది.
గతంలో ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టి జోన్ల వారీగా గోదావరి, కృష్ణా-గుంటూరు, నెల్లూరు-ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఫలితాలు విడివిడిగా ప్రకటించిన రైజ్ సంస్ధ తాజాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మీద పరిస్దితి ఎలా ఉందో ఫలితాలు వెల్లడించింది. ఇందులో గ్రీన్ జోన్ లో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 28 మందిగా పేర్కొంది. అలాగే ఆరెంజ్ జోన్ లో 97 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలిపింది. ఇక రెడ్ జోన్ లో ఉన్న ఎమ్మెల్యేలు 50 మంది మంది అంటూ సర్వేయర్ ప్రవీణ్ పుల్లట ఎక్స్ లో వెల్లడించారు. నియోజకవర్గాల వారీగా పూర్తి ఫలితాలు ఇవాళ వెల్లడించనున్నారు.
ఈ లెక్కన గ్రీన్ లేదా ఆరెంజ్ జోన్ లో ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు 125 మందిగా నిర్ధారించారు. 50 మంది ఎమ్మెల్యేలు మాత్రం రెడ్ జోన్ లో ఉన్నట్లు తేల్చారు. దీంతో తొలి ఏడాదిలోనే 50 మంది ఎమ్మెల్యేలు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కుంటున్నట్లు తేలింది. 125 మంది ఎమ్మెల్యేలు మాత్రం పూర్తిగా లేదా పాక్షికంగా సేఫ్ జోన్ లోనే ఉన్నట్లు తేలింది. ఈ సర్వే ఫలితాలు ఎలా ఉన్నా ప్రభుత్వం తప్పిదాలు సరిదిద్దుకుని ముందుకెళ్తే మాత్రం ఈ లెక్కలన్నీ మరో నాలుగేళ్లలో మార్చుకునే అవకాశం ఎలాగో ఉండనే ఉంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.
https://x.com/praveenpullata/status/1935359660921602274?s=08