ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Ap Liquor Scam: విజయసాయి రెడ్డి ఏమి చెబుతున్నారు..కసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో ఏముంది..?

Ap Liquor Scam: విజయసాయి రెడ్డి ఏమి చెబుతున్నారు..కసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో ఏముంది..?
ADVERTISEMENT

సంచలనంగా మారిన ఆంధ్రప్రదేశ్ మద్యం స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్టు కావటం తెలిసిందే. ఆయన్ను విచారించిన సిట్.. తాజాగా రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశారు. అయితే.. విచారణ వేళ పలు అంశాల్ని చెప్పిన రాజ్ కసిరెడ్డి.. సిట్ సిద్ధం చేసిన నేరాంగీకరపత్రం మీద మాత్రం సంతకం చేసేందుకు నో చెప్పినట్లుగా సిట్ పేర్కొంది.ప్రభుత్వానికి.. పార్టీకి బాగా నిధులు వచ్చేలా మద్యం పాలసీపై వర్కువుట్ చేయాలని అప్పటి ముఖ్యమంత్రి జగన్ నాకు బాధ్యత అప్పగించారు. ఈ పాలసీ ద్వారా పార్టీకి బాగా ఫండ్ రావాలని.. పథకాల అమలుకూ ఆదాయాన్ని సమకూర్చాలని నిర్దేశించారు. – ఈ నేపథ్యంలోనే బేవరేజెస్ కార్పొరేషనే లిక్కర్ షాపులు ఏర్పాటు చేసి.. మద్యం వ్యాపారం చేసేలా కొత్త పాలసీని రూపొందించాం. ఐఆర్ టీఎస్ అధికారి వాసుదేవరెడ్డిని డిప్యూటేషన్ పై రాష్ట్రానికి తీసుకొచ్చాం. తొలుత బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా.. ఆ తర్వాత బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా.. ఆ తర్వాత బేవరేజెస్.. డిస్టలరీస్ కమిషనర్ గా నియమించారు.

మద్యం అమ్మకాలు.. కొనుగోళ్లు.. లేబుల్ రిజిస్ట్రేషన్ తదితర కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ వాసుదేవరెడ్డికే దక్కేలా చూశారు. మద్యం వ్యాపారుల నుంచి ముడుపులు తీసుకునేందుకు రూపొందించిన నా ప్లాన్ ను అమలు చేసే బాధ్యతను అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న సత్యప్రసాద్ కు అప్పగించాం. 2023లో ఆయనకు సివిల్ సర్వీసు కోటాలో ఐఏఎస్ హోదా ఇప్పిస్తామని మాట ఇచ్చాం.మద్యం వ్యవహారంలో ప్రత్యేక అధికారిగా నియమించాం. మద్యం ముడుపుల కుట్రకు హైదరాబాద్ లోని విజయసాయి రెడ్డి ఇంట్లోనే ప్లాన్ చేశాం. దీనికి సంబంధించిన మీటింగ్ 2019 అక్టోబరు 13న ఆయన ఇంట్లోనే జరిగింది.విజయసాయిరెడ్డి.. మిథున్ రెడ్డి..సజ్జల శ్రీధర్ రెడ్డి.. మద్యం ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ ఈ మీటింగ్ లో పాల్గొన్నాం. మద్యం ఉత్పత్తిదారుల నుంచి డిస్టలరీస్ నుంచి నెలకు రూ.50-60 కోట్లు ముడుపులు వచ్చేలా స్కీమ్ రూపొందించాం. ఇదే విషయాన్ని సత్యప్రసాద్ కు చెప్పాం. – ఆయా బ్రాండ్లకు సంబంధించి 3 నెలల అమ్మకాలు.. దానిపై పది శాతం పెరుగుదలతో కలిపి స్టాక్‌ ఇచ్చేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. అయితే.. ఈ విధానం అమల్లో ఉండే మేం అనుకున్నట్లుగా జరగదు. అందుకే మద్యం సరఫరాను ఆన్‌లైన్‌ తో డిసైడ్‌ కాకుండా ఉండాలని నిర్ణయించాం. ఏ బ్రాండ్‌ను ఎంతమేర సరఫరా చేయాలో, రిటైల్‌ షాపులో ఏవి అమ్మాలో మేమే డిసైడ్ చేయాలి. అలా మద్యం ఉత్పత్తి.. సరఫరా.. సేల్స్ మొత్తాన్నిమా కంట్రోల్ లోకి తెచ్చుకున్నాం.

2019 డిసెంబరులో ఒక ప్రైవేటు బంగ్లాలో నేను.. మిథున్ రెడ్డి.. సజ్జల శ్రీధర్ రెడ్డి.. బేవరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డి మీటింగ్ పెట్టుకున్నాం. మద్యం సీసా బేసిక్ ధర ఆధారంగానే మాకు ఉత్పత్తిదారుల నుంచి ముడుపులు వచ్చేలా ప్లాన్ చేశాం. మేం నిర్ణయించిన మద్యం ముడుపుల ప్రకారం ప్రతి నెలా కనీసం రూ.50-60 కోట్లు వచ్చేవి.ఎంత మద్యం సరఫరా అయ్యింది. అమ్మకాలు ఎంత జరిగాయన్న డేటా ప్రతినెలా వచ్చేది. ఇందుకోసం అనూష.. సైఫ్ అనే ఉద్యోగుల్ని నియమించుకున్నాం. ప్రతినెలా ఐదో తేదీన కమీషన్లు లెక్కలు వేసేవాళ్లం.. వీరిచ్చే డేటా ఆధారంగా కిరణ్ కుమార్ రెడ్డి.. బోనేటి చాణక్య అలియాస్ ప్రకాష్ లు ఆయా కంపెనీలకు ఫోన్లు చేసేవారు. కంపెనీలు ముడుపుల సొమ్ములు ఇచ్చాక.. వాటిని నా దగ్గరకు చేర్చేవారు. ఆ తర్వాత ఆ డబ్బుల్ని తీసుకొని ఓఎస్డీ క్రిష్ణమోహన్ రెడ్డి, బాలాజీకి పంపేవాడ్ని.

ఈ కేసులో ముఖ్యంగా

వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డికి నమ్మిన బంటుగా రాజకీయాల్లోకి వచ్చిన విజయసాయిరెడ్డి ఆ పార్టీ ఆవిర్భావం నుంచి రెండు నెలల క్రితం వరకు రాజకీయాల్లో.. వైసీపీ కార్యక్రమాల్లో అత్యంత క్రియాశీలంగా పనిచేశారు. విజయసాయి లేనిదే వైసీపీ లేదన్నట్లు తన మార్కు చూపించారు. అదే సాయిరెడ్డి ఇప్పుడు వైసీపీకి కంట్లో నలుసులా తయారయ్యారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన క్షణంలో వైసీపీ ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది. విజయసాయిరెడ్డి స్థానం పార్టీలో ప్రత్యేకమంటూ కీర్తించింది. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి రివర్స్ అవ్వడంతో వైసీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయిందనే టాక్ వినిపిస్తోంది. గట్టిగా విమర్శంచలేక, అదే సమయంలో మౌనంగా ఉండలేక సతమతమవుతోంది. అసలు విజయసాయిరెడ్డి విషయంలో వైసీపీ గందరగోళం ఎదుర్కొంటున్న
దా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన విజయసాయిరెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. 2010లో జగన్ కాంగ్రెస్ అధిష్ఠానాన్ని దిక్కరించడమే కాకుండా, అవినీతి కేసుల్లో జైలుకు కూడా వెళ్లారు. ఈ కేసులో జగన్ ఏ1 కాగా, విజయసాయిరెడ్డిని ఏ2గా సీబీఐ గుర్తించింది. ఇక అక్కడి నుంచి ప్రతి విషయంలోనూ జగన్ తర్వాతి స్థానం విజయసాయిరెడ్డిదే అన్నట్లు ఆయన ప్రయాణం సాగింది. పార్టీలోనూ.. వైసీపీ ప్రభుత్వంలోనూ చాలావరకు విజయసాయిరెడ్డి మాటే వేదవాక్కుగా సాగిపోయింది. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నా, ఆయన గత ఎన్నికల్లో తప్పితే అంతకుముందు ఎన్నడూ ప్రజాక్షేత్రంలో తలపడలేదు. కానీ, అధిష్ఠానంలో పట్టు ఉండటంతో పార్టీని దిశానిర్దేశం చేసే అధికారం వైసీపీ విజయసాయికి అప్పగించింది. అయితే ఎద్దు ఎప్పుడూ ఒకవైపే పడుకోదు అన్నట్లు.. కొన్నేళ్లుగా విజయసాయికి పార్టీకి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఎన్నికల అనంతరం ఆ అంతరం పూర్తిగా తెగేవరకు వెళ్లింది. రాజకీయాల నుంచి విజయసాయి నిష్క్రమించారు. ఆ సమయంలో విజయసాయి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారనేది వైసీపీ పట్టించుకోలేదు.

కేసులు, వేధింపుల వల్లే విజయసాయి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని వైసీపీ సానుభూతి వ్యక్తం చేసింది. కానీ, ఆయన గూడుకట్టుకున్న అసంతృప్తిని గుర్తించలేకపోయిందని అంటున్నారు. అందుకే మార్చి నెలలో సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి పార్టీ అధిష్టానంపై విమర్శలు చేసేసరికి వైసీపీ శ్రేణులు అవాక్కయ్యాయి. ఇన్నాళ్లు తమ పార్టీలో నెంబర్ టుగా చెప్పుకున్న నేత రివర్స్ లో కోటరీ ఉందని, కొందరు చేతుల్లో అధినేత బంధీగా మారిపోయారని, జగన్ ప్రజల మధ్యకు రావాలని చెప్పడం ద్వారా వైసీపీని ఆత్మరక్షణలోకి నెట్టేశారని అంటున్నారు. మూడున్నరేళ్ల పదవీకాలం ఉండగానే రాజ్యసభ స్థానాన్ని వదిలేయడానికి కారణాలు, అంతకుముందు చోటుచేసుకున్న పరిణామాలపై అధిష్టానం ఫోకస్ చేయకపోవడం వల్లే పార్టీ పునాదులు కదిలించేలా విజయసాయిరెడ్డి ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు.

తొలుత పార్టీలో కొందరు కోటరీగా ఏర్పడ్డారని ధ్వజమెత్తిన విజయసాయిరెడ్డి ఇప్పుడు లిక్కర్ స్కాంలో దొరికన దొంగలు, దొరకని దొంగలు బట్టలు విప్పేస్తానని బెదిరించడం చర్చకు దారి తీస్తోంది. అధినేత తర్వాత నెంబర్ 2గా చెలామనీ అయిన వ్యక్తి.. తన స్థానం రెండు వేలు అంటూ చెప్పి.. అధినేతకు తనకు మధ్య చాలా అంతరం ఉందని వ్యాఖ్యానించడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీలో ఎవరూ స్పందించకపోవడం కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. విజయసాయి చేస్తున్న నష్టాన్ని గుర్తించి సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి మాత్రమే ఎదురుదాడి చేశారు. సహజంగా ఇలాంటి పరిస్థితి ఇంకో పార్టీలో ఉంటే దిగువ స్థాయి నుంచి అధిష్టానం వరకు ముప్పేట దాడి చేస్తారని పరిశీలకులు చెబుతున్నారు. కానీ, వైసీపీలో ఎవరూ నోరు విప్పకపోవడం ఆ పార్టీ పరిస్థితి అద్దం పడుతోందని అంటున్నారు. పార్టీ అధికార ప్రతినిధులు కూడా ఈ విషయంపై మాట్లాడకపోవడంతో విజయసాయిరెడ్డి మరింత చెలరేగిపోయే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదైనా సరే విజయసాయిరెడ్డి వ్యూహాన్ని పసిగట్టలేకపోవడం ఓ విధంగా నష్టం చేకూరిస్తే.. ఇప్పుడు ఆయనను అదుపు చేయలేని పరిస్థితిలో మున్ముందు మరింత ముప్పు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Tags: #AndhraPolitics#APLeadersSpeak#APLiquorScam#APPolitics2024#CorruptionInAP#HotPoliticsAP#JaganMohanReddy#PoliticalControversy#PoliticalTwist#ScamAlertAP#TeluguPolitics#VijayasaiReddy#VijayasaiSpeaks#VijayasaiVsYSRCP#YSRCPCrisis#YSRCPUpdates
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Uttar Pradesh: ముగ్గురు పిల్లలున్న మహిళతో రెండో పెళ్లి..!

Next Post

Kangana Ranaut: అప్పులు పాలైన కంగ‌న‌..!

Related Posts

Sobhita Dhulipala India Couture Week 2026
Entertainment

Sobhita Dhulipala India Couture Week 2026: రాహుల్ మిశ్రా ‘దేవి’ కలెక్షన్‌లో దేవకన్యలా మెరిసిన శోభిత ధూళిపాళ

Nara Lokesh Kurnool Development
Andhra Pradesh

Nara Lokesh Kurnool Development: 90 రోజుల్లో కర్నూలుకు హైకోర్టు బెంచ్ – పెట్టుబడులు, పరిశ్రమలు, అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక ప్రకటనలు

Revanth Reddy Education Reforms
Big Story

Revanth Reddy Education Reforms: మంచి పనితీరు ఇచ్చినందుకు విద్యాశాఖకు రాజీనామా చేయాలా? – ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Food Adulteration in India
Big Story

Food Adulteration in India: కల్తీ కబంధ హస్తాల్లో ఆరోగ్యం – అప్రమత్తతే ప్రజల రక్షణ కవచం

Telangana
Big Story

Telangana:హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలన్న హైకోర్టు.. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం

NTA Reforms
Big Story

NTA Reforms:యన్ టి ఏ పరీక్షా సంస్కరణల కోసం కేంద్రం టాస్క్ ఫోర్స్ . నందన్ నీలేకని నేతృత్వంలో కీలక కమిటీ

Next Post
Kangana Ranaut: అప్పులు పాలైన కంగ‌న‌..!

Kangana Ranaut: అప్పులు పాలైన కంగ‌న‌..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Sobhita Dhulipala India Couture Week 2026

Sobhita Dhulipala India Couture Week 2026: రాహుల్ మిశ్రా ‘దేవి’ కలెక్షన్‌లో దేవకన్యలా మెరిసిన శోభిత ధూళిపాళ

Nara Lokesh Kurnool Development

Nara Lokesh Kurnool Development: 90 రోజుల్లో కర్నూలుకు హైకోర్టు బెంచ్ – పెట్టుబడులు, పరిశ్రమలు, అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక ప్రకటనలు

Revanth Reddy Education Reforms

Revanth Reddy Education Reforms: మంచి పనితీరు ఇచ్చినందుకు విద్యాశాఖకు రాజీనామా చేయాలా? – ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Food Adulteration in India

Food Adulteration in India: కల్తీ కబంధ హస్తాల్లో ఆరోగ్యం – అప్రమత్తతే ప్రజల రక్షణ కవచం

Recent News

Sobhita Dhulipala India Couture Week 2026

Sobhita Dhulipala India Couture Week 2026: రాహుల్ మిశ్రా ‘దేవి’ కలెక్షన్‌లో దేవకన్యలా మెరిసిన శోభిత ధూళిపాళ

Nara Lokesh Kurnool Development

Nara Lokesh Kurnool Development: 90 రోజుల్లో కర్నూలుకు హైకోర్టు బెంచ్ – పెట్టుబడులు, పరిశ్రమలు, అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక ప్రకటనలు

Revanth Reddy Education Reforms

Revanth Reddy Education Reforms: మంచి పనితీరు ఇచ్చినందుకు విద్యాశాఖకు రాజీనామా చేయాలా? – ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Food Adulteration in India

Food Adulteration in India: కల్తీ కబంధ హస్తాల్లో ఆరోగ్యం – అప్రమత్తతే ప్రజల రక్షణ కవచం

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info