• పవిత్ర తిరుమలలో మాఫియా రాజ్యం నడిపిన వ్యక్తి జగన్.
• గజ దొంగ జగన్, మరో దొంగకు మద్దతు.
• ప్రజలు బుద్ది చెప్పినా జగన్ తీరు మారలేదు.
-జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు.
పవిత్ర తిరుమలలో మాఫియా రాజ్యం ను నడిపిన వ్యక్తి జగన్ అని రాష్ట్ర జలవనుర్ల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మీడియాతో మాట్లాడుతూ పరకామణిలో చోరీని చిన్న దొంగతనమని జగన్ మాట్లాడటం భక్తుల నమ్మకాన్ని అవమానించడమేనన్నారు.
పరకా మణిలో 75 వేలు చిన్నపాటి ఛోరీకే శిక్ష వేస్తారా అని జగన్ ప్రశ్నిస్తున్నాడని దేవుడు హుండీ సొమ్ము చిన్నదవుతుందా అని మంత్రి ప్రశ్నించారు.పరకా మణిలో చిన్న చోరీ అనడం గజదొంగ, ఇంకో దొంగను సపోర్టు చేసినట్టు గా ఉందన్నారు. దేవుడు హుండీ దొంగతనాన్ని కూడా జగన్ సమర్ధించడం సిగ్గుచేటన్నారు. 16చార్జిషీట్లో A1 గా ఉన్న వ్యక్తి, రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరుగుతుంటే 75 వేలు చోరీ చిన్నదిగా కనిపిస్తుంది కాబోలన్నారు. జగన్ కు ప్రజలన్నా, దేవుడు అన్నా భయం లేదన్నారు. దొంగ చేతికి అధికారం ఇస్తే ఏమవుతుందో జగన్ పాలనే నిదర్శనమన్నారు.జగన్ కు ప్రజల మీద కన్నా, నేరగాళ్ళు, దోపిడీదారులు, బెట్టింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా మీదే ప్రేమ ఎక్కువన్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, ప్రజలు తీర్పిచ్చినా జగన్ వైఖరిలో మార్పు నకనిపించడం లేదన్నారు. వైసీపీ బ్రతుకంతా అబద్ధాలు, అసత్య లేనన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని ఇరవై ముప్పై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లి రాష్ట్రాన్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేశాడన్నారు.











