• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Amaravati: అతిపెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్..?

Amaravati: అతిపెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిపై ఫుల్ ఫోకస్ పెట్టింది.. తాజాగా అమరావతిలో స్పోర్ట్స్ సిటీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లాలోని కృష్ణా నదికి దగ్గరగా ఉన్న నాలుగు గ్రామాలను రాజధాని పరిధిలోకి తీసుకురానున్నారు. త్రిలోచనాపురం, మూలపాడు, కోటికలపూడి, జమీమాచవరం గ్రామాలను ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో భూములను సేకరించేందుకు గ్రామసభలు నిర్వహించారు.. రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించారు. స్పోర్ట్స్ సిటీ కోసం ఈ నాలుగు గ్రామాలను ఎంచుకున్నారు. ఇటీవల కృష్ణా నదిలో ఉన్న చినలంక, పెదలంక దీవులను పరిశీలించారు.. కానీ అవి వరదలకు మునిగిపోయే అవకాశం ఉంది.. అందుకే వాటిని వద్దనుకున్నారు. వాటికి దగ్గరలో ఉన్న ఈ నాలుగు గ్రామాలను ఎంపిక చేశారు.

మూలపాడులో ఇప్పటికే రెండు క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి.. ఈ ప్రాంతం స్పోర్ట్స్ సిటీకి అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. మూలపాడు నుంచే అమరావతికి గ్రాండ్ ఎంట్రెన్స్ వే ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు. కృష్ణా నది మీదుగా ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. అందుకే ఈ నాలుగు గ్రామాలను ఎంచుకున్నట్లు సమాచారం. మూలపాడులోనే అంతర్జాతీయ క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది. గురువారం జరిగిన గ్రామసభల్లో రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. త్వరలోనే స్పోర్ట్స్ సిటీ నిర్మాణం దిశగా అడుగులు పడనున్నాయి. ఈ స్పోర్ట్స్ సిటీతో పాటుగా అక్కడే దేశంలోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంను నిర్మించాలని కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అక్కడ 2వేల ఎకరాల వరకు సేకరించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణంపై అధ్యయనం కోసం ఇటీవల మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఓ టీమ్ గుజరాత్‌లోని అహ్మదబాద్ క్రికెట్ స్టేడియాన్ని కూడా పరిశీలించారు.

మరోవైపు పల్నాడు జిల్లాలో రాజధాని అమరావతి అవసరాల కోసం ప్రభుత్వం రెండో విడత భూసేకరణ చేపట్టింది. పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి మండలంలో రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకం ఉందని రైతులు గ్రామసభలో చెప్పారు. మొత్తం 9,617.58 ఎకరాల భూమిని సేకరించడానికి ప్రభుత్వం రైతుల అభిప్రాయాలను తెలుసుకుంటోంది. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో గ్రామసభలు జరిగాయి. .రైతులు రాజధాని అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

ఏపీ ప్రభుత్వం అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి గ్రామాల్లో సభలు నిర్వహించింది. కర్లపూడి, లేమల్లె గ్రామాల్లో బుధవారం గ్రామసభలు జరిగాయి. ఈ సభల్లో రైతులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ముఖ్యమంత్రి రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారని ఎమ్మెల్యే ప్రవీణ్ అన్నారు. రైతుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు తీసుకువస్తుందని ఆయన చెప్పారు. రాజధానిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల గురించి రైతులు అడిగారు. ఇప్పుడు సేకరించే 10 వేల ఎకరాల్లో ఎలాంటి అభివృద్ధి చేస్తారో చెప్పాలని కోరారు. ఐటీ కంపెనీలు విశాఖకు, పరిశ్రమలు శ్రీసిటీకి కేటాయిస్తున్నారని ముఖ్యమంత్రి చెబుతున్నారని రైతులు అన్నారు. అమరావతిలో ఏ కంపెనీలు తీసుకొచ్చి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తారో ప్రకటించాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా అమరావతి రాజధాని అని గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని రైతులు ప్రశ్నించారు.

భూములు తీసుకుంటే, తమకు ఇచ్చే ప్లాట్లు రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డుకు తూర్పు వైపున ఇవ్వాలని రైతులు కోరారు. ప్రస్తుతం ఎకరాకు రూ.60 వేల చొప్పున కౌలు ఇవ్వాలని, ఏటా పది శాతం పెంచాలని కోరారు. తమ గ్రామాల్లో భూములు తీసుకోవాల్సి వస్తే, మాకు ఇచ్చే ప్లాట్లు రైల్వేస్టేషన్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు తూర్పు వైపున ఇవ్వాలి అన్నారు రైతులు. ఖరీఫ్ సీజన్ కోసం భూములు సిద్ధం చేసే జూన్ నాటికే రైతులకు కౌలు ఇవ్వాలని రైతులు కోరారు. రైతులకు ఇచ్చే ప్లాట్లు తనఖా పెట్టుకుని పిల్లల చదువు కోసం బ్యాంకులో రుణం తీసుకునే అవకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వ, ఆలయ భూముల్లో కాకుండా రిజిస్ట్రేషన్ చేసిన భూముల్లోనే ప్లాట్లు ఇవ్వాలని కోరారు. రైల్వే ప్రాజెక్టుకు ఎక్కువ భూమి తమ నుంచే తీసుకుంటున్నందున, తమ పిల్లలకు రైల్వేలో ఉద్యోగాలు ఇవ్వాలని రైతులు కోరారు. రైతుల విజ్ఞప్తులపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags: #AndhraPradeshSports#APCricket#APSports#CricketStadium#InternationalCricketStadium#SportsDevelopmentAP#TeluguNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Colour: రంగులు వ్యక్తిత్వ లక్షణాలతో ముడిపడి ఉంటాయా?

Next Post

Patralekha: అది నాకు నచ్చదు..!

Related Posts

Patralekha: అది నాకు నచ్చదు..!
Entertainment

Patralekha: అది నాకు నచ్చదు..!

Colour: రంగులు వ్యక్తిత్వ లక్షణాలతో ముడిపడి ఉంటాయా?
Andhra Pradesh

Colour: రంగులు వ్యక్తిత్వ లక్షణాలతో ముడిపడి ఉంటాయా?

Pulivendula: పులివెందులలో భారీగా బంగారం పట్టివేత
Big Story

Pulivendula: పులివెందులలో భారీగా బంగారం పట్టివేత

Neha Sharma:  సొగసులతో సెగలు!
Entertainment

Neha Sharma: సొగసులతో సెగలు!

Pawan Kalyan:  25 లక్షల రూపాయల వ్యక్తిగత ఆర్థిక సహాయం
Andhra Pradesh

Pawan Kalyan: 25 లక్షల రూపాయల వ్యక్తిగత ఆర్థిక సహాయం

Kangana Ranaut: హాలీవుడ్ ఎంట్రీ కి రెడీగా..!
Entertainment

Kangana Ranaut: హాలీవుడ్ ఎంట్రీ కి రెడీగా..!

Next Post
Patralekha: అది నాకు నచ్చదు..!

Patralekha: అది నాకు నచ్చదు..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Patralekha: అది నాకు నచ్చదు..!

Patralekha: అది నాకు నచ్చదు..!

Amaravati: అతిపెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్..?

Amaravati: అతిపెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్..?

Colour: రంగులు వ్యక్తిత్వ లక్షణాలతో ముడిపడి ఉంటాయా?

Colour: రంగులు వ్యక్తిత్వ లక్షణాలతో ముడిపడి ఉంటాయా?

Pulivendula: పులివెందులలో భారీగా బంగారం పట్టివేత

Pulivendula: పులివెందులలో భారీగా బంగారం పట్టివేత

Recent News

Patralekha: అది నాకు నచ్చదు..!

Patralekha: అది నాకు నచ్చదు..!

Amaravati: అతిపెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్..?

Amaravati: అతిపెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్..?

Colour: రంగులు వ్యక్తిత్వ లక్షణాలతో ముడిపడి ఉంటాయా?

Colour: రంగులు వ్యక్తిత్వ లక్షణాలతో ముడిపడి ఉంటాయా?

Pulivendula: పులివెందులలో భారీగా బంగారం పట్టివేత

Pulivendula: పులివెందులలో భారీగా బంగారం పట్టివేత

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info