*యోగాతోనే ఒత్తిడికి ఉపశమనం*
భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నెల రోజులపాటు మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర కార్యక్రమం ను జిల్లా గౌరవ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ డాక్టర్ వి వినోద్ కుమార్ గారి పర్యవేక్షణలో మెడికల్ కళాశాల ఆడిటోరియం ఆవరణంలో ఘనంగా జరిగింది. మెడికల్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ సర్వజన వైద్యశాల, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, వివేకానంద యోగ కేంద్ర, జిల్లా ఆయుష్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రఖ్యాత యోగ గురువులు ఎర్రంశెట్టి ఆంజనేయులు, డాక్టర్ రిచా రెడ్డి ల ఆధ్వర్యంలో యోగ ప్రోటోకాల్ ఆసనాలను, ప్రాణాయామాలను వైద్య విద్యార్థులతో, డాక్టర్లతో, వివేకానంద యోగ కేంద్ర సభ్యులతో వేయించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్యరావు మాట్లాడుతూ యోగ ఒత్తిడి ఉపసమనమునకు ఉపయోగపడుతుందని, భారతదేశ వారసత్వ సంపద యోగా అని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రపంచంలోని 175 దేశాలు అత్యంత ఘనంగా ఈ నెల 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోబోతుందని, దీనికి ముందస్తుగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు యోగేంద్ర కార్యక్రమం ద్వారా విస్తృతమైన అవగాహనను ప్రజలందరికీ, పల్లె గ్రామాలకు కూడా విస్తరించి యోగతో ఆరోగ్యాన్ని కాపాడుకునేలా చేస్తున్నారని తెలిపారు. జిల్లా వైద్య శాఖ అధికారి యోగాంధ్ర నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఈ బి దేవి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు ఒక్కో శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అనంతనగరంలోని ప్రజలందరికీ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థులకు దీనిపైన అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మెడికల్ కళాశాల ప్రభుత్వ సర్వజన వైద్యశాల సిబ్బంది ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. హౌస్ సర్జన్ డాక్టర్ యశ్వంతి రాయల్ ప్రదర్శించిన యోగ అభినయాలు అందరిని మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్యరావు, జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ బి దేవి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జున రెడ్డి, సహాయ ఆర్ ఎం ఓ లు డాక్టర్ పద్మజ, డాక్టర్ హేమలత, సీనియర్ ప్రొఫెసర్లు డాక్టర్ ఆత్మరామ్, డాక్టర్ కె ఎల్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ మనోరంజన్ రెడ్డి, డాక్టర్ ఉమామహేశ్వరరావు, వివేకానంద యోగ కేంద్ర అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, ఆయుష్ డాక్టర్ లాల్య నాయక్, మెడికల్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది యుగంధర్,త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు.