‘డ్రాగన్’ బ్యూటీ కాయదు లోహర్ వివాదంలో చిక్కుకుంది. కెరీర్ పీక్స్లో ఉన్న టైమ్లో కుంభకోణంతో సంబంధం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. TASMAC(తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్) స్కామ్లో కీలకపాత్ర ఉన్న వ్యక్తులతో ఈ అమ్మడుకి సంబంధం ఉందని.. వీరు నిర్వహించే పార్టీలకు హాజరయ్యేందుకు ఒక్కరాత్రికి రూ. 35 లక్షలు డిమాండ్ చేస్తుందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై పెద్ద చర్చే జరుగుతుంది. కొందరు నిజంగానే ఈ బ్యూటీ తప్పు చేసిందని నమ్ముతున్నారు. ఆమె అభిమానిగా ఉండబోమని.. రిటైర్డ్ ఫ్యాన్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఈ మధ్య ఈ స్కామ్కు సంబంధించి ఈడీ రైడ్ సమయంలో ఈ ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు రుజువు కాలేదు. ఇంతవరకు వీటికి సంబంధించిన ఆధారాలు కూడా బయటకు రాలేదు. మద్యం వ్యాపారంతో సంబంధం, లంచం, చట్టవిరుద్ధ ఆర్థిక లావాదేవీలు నిందితులు మాత్రమే చేశారని తెలిసింది. కానీ కాయదు ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్నదా లేదా..? కేవలం పార్టీలకు హాజరయ్యేంత వరకు మాత్రమే తనకు సంబంధం ఉందా? అసలు పార్టీలకు అటెండ్ అయిందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ ఆరోపణలతో యంగ్ బ్యూటీకి జరిగే నష్టం మాత్రం జరుగుతోంది.
ఐదేండ్ల క్రితం శ్రీవిష్ణు అల్లూరి చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇటీవల తమిళ చిత్రం డ్రాగన్ (Dragon) సినిమాతో ఓవర్నైట్ స్టార్గా మారింది అస్సాం బ్యూటీ కయాదు లోహర్ (Kayadu Lohar). ఆ ఒక్క చిత్రంతో వచ్చిన గుర్తింపుతో ఇప్పుడు చేతిలో డజన్కు పైగా సినిమాలతో ఇతర యువ హీరోయున్లను మించిన జెట్ స్పీడుతో దూసుకెళుతుంది. యూత్ కలలరాణిగా అదిరిపోయే ఫాలోయింగ్ సైతం సొంతం చేసుకుంది. ఇదే స్పీడుతో తెలుగులో విశ్వక్ సేన్, రవితేజ, తమిళంలో శింబు, జీవీ ప్రకాశ్, ఆధ్వర్వ మురళి హీరోగా వస్తున్న సినిమాల్లో అవకాశం దక్కించుకుంది.
అయితే ఇప్పుడు ఈ అమ్మడు పెద్దచిక్కులో పడింది. ఇటీవల తమిళనాడులో బయటపడి సంచలనం సృష్టిస్తున్న తమిళనాడు TASMAC లిక్కర్ స్కామ్ (Tasmac Scam)లో కయాదు లోహర్ (Kayadu Lohar)కు ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ లిక్కర్ కుంభకోణంలో భాగంగా నిర్వహించిన ఈడీ రైడ్స్లో పట్టుబడిన నిందితులు ఏర్పాటు చేసిన మై ఫ్రోఫైల్ నైట్ పార్టీల్లో కయాదు పాల్గొందని అందుకు గాను రూ.35 లక్షలు వసూలు చేసినట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ బాగా వైరల్ అవుతోంది.
కాగా ఈ వార్తలపై సదరు నటి కయాదు లోహర్ (Kayadu Lohar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతా ఫేక్ న్యూస్ అని అనవసరంగా ఇన్వాల్స్ చేస్తున్నట్లు వాపోయిందని తెలుస్తోంది. అయితే ఇంతా జరుగుతన్నప్పటికీ హీరోయిన్ కయాదు అధికారికంగా ఇంతవరకు ఎక్కడా ప్రకటన చేయక పోవడం గమనార్హం.