విజయసాయిరెడ్డి చాలా అవమానంతో రగిలిపోతున్నారు. ఆయన వరసగా పెడుతున్న ట్వీట్లలో ఒకే ఒక అంశం కామన్ గా ఉంది. జగన్ కోటరీ తనను తీవ్రంగా అవమాన పరచారని వారి మాటలు విని జగన్ తనను దూరం పెట్టారని చివరికి బలి ఇచ్చారని ఆయన ఆవేదన వెళ్లగక్కుతున్నారు జగన్ కోటరీకి ఏ రాజకీయం తెలియదని వారినే జగన్ నమ్ముకుంటున్నారు అని అన్నారు
తెలిసా లేక తెలియకా అన్నట్లుగా జగన్ కోటరీ తనను గట్టిగా రెచ్చగొడుతున్నారని తాను కనుక ఇరిటేట్ అయితే అసలు బాగుండదని ఆయన ఇవ్వాల్సిన కోటింగ్ అయితే చాలా షార్ప్ గా స్ట్రాంగ్ గా ఇచ్చేశారు. లేటెస్ట్ గా చూస్తే ఆయన సుదీర్ఘమైన ట్వీట్ వెనక కూడా ఇదే ఉంది.
అందులో ఆయన ప్రస్తావించిన అంశాలు చూస్తే జగన్ కోసం తాను ఏ పాపం ఎరగకపోయినా 21 కేసులను నెత్తిన వేసుకుని 16 నెలల పాటు జైలుకు వెళ్ళాను అని కూడా చెప్పుకున్నారు అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక మాత్రం జగన్ తనను నాలుగేళ్ళ పాటు దూరం పెట్టారనే ఆయన చెబుతున్నారు ఇదంతా కోటరీ వల్లనే అంటున్నారు. ఇదిలా ఉంటే జగన్ సంగతి తెలిసిందే అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఆయన కూడా వెనక్కి తగ్గే రకం కాదని అంటున్నారు. ఆయన తనకు ఏమి జరిగినా ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉంటారు తప్ప అసలు రాజీ అన్న మాట ఆయన వద్ద ఉండదని చెబుతున్నారు. ఇక తెగే దాకా లాగేందుకు జగన్ కోటరీ ఎటూ ఉందని అంటున్నారు.
దాంతో విజయసాయిరెడ్డిని ఈసారి గట్టిగా కెలికితే మాత్రం ఆయన కచ్చితంగా భారీ స్థాయిలో రిటర్న్ గిఫ్ట్ సిద్ధం చేస్తారు అని అంటున్నారు. రాజకీయ మేధావిగా గుర్తింపు ఉన్న విజయసాయిరెడ్డికి వైసీపీ లోతులూ పాతులూ అన్నీ తెలుసు అని అంటున్నారు. అంతే కాదు పార్టీతో పాటు జగన్ వ్యక్తిగత విషయాలు కూడా ఆయనకు బాగా తెలుసు అని అంటున్నారు. జగన్ మీద సీబీఐ ఈడీ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం అవి కీలక దశంలో ఉన్నాయి. ఈ సమయంలో కనుక విజయసాయిరెడ్డి కనుక అప్రూవర్ గా మారితే జగన్ కి పీకల దాకా కష్టాలు చుట్టుముడతాయని అంటున్న వారూ ఉన్నార్. విజయసాయిరెడ్డితో పెట్టుకోవడం అంటే ఇబ్బందులను కోరి ఆహ్వానించడమే అని అంటున్నారు. వరసబెట్టి వైసీపీకి సన్నిహితులు శత్రువులుగా మారుతున్న వేళ వారి అందరి కంటే అతి పెద్ద ప్రత్యర్ధిగా విజయసాయిరెడ్డి మారేలా పరిస్థితి అయితే తెచ్చుకోకూడదనే అంటున్నారు కానీ వైసీపీ వర్సెస్ విజయసాయిరెడ్డి ఎపిసోడ్ అలా కొనసాగుతోంది. ఇక కూటమి ఎటూ వైసీపీని దెబ్బతీయాలని చూస్తూనే ఉంటుంది. ఈ రకమైన రాజకీయాల్లో వ్యూహాల లేమి లేకపోతే వైసీపీ పూర్తిగా టార్గెట్ అవుతుందని విశ్లేషణలు ఉన్నాయి. మరో వైపు చూస్తే విజయసాయిరెడ్డి జగన్ కోటరీ మీద జగన్ మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని ఆయన సరైన సమయం చూసుకుంటున్నారని తప్పకుండా ఆయన ఇవ్వాల్సింది ఇచ్చేస్తారు అని అంటున్నారు. దాంతో వైసీపీకి ముందుందు ముసళ్ళ పండుగ అన్న చర్చ అయితే సాగుతోంది.