ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Latest

Ranya Rao : బంగారం స్మగ్లింగ్ కేసు..నటి రన్యా రావు ఎవరు?

Ranya Rao : బంగారం స్మగ్లింగ్ కేసు..నటి రన్యా రావు ఎవరు?
ADVERTISEMENT

గోల్డ్ స్మగ్లింగ్‌లో కన్నడ నటి రన్యా రావు చిక్కడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బెంగళూర్ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 12 కోట్ల విలువైన బంగారాన్ని డీఆర్ఐ అధికారులు రన్యా రావు నుంచి స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్రారావు కూతురు కూడా కావడంతో రన్యా రావు వ్యవహారం ఒక్కసారిగా వార్తాంశంగా నిలిచింది. దుబాయ్ నుంచి బెంగళూర్ వచ్చిన రన్యా రావు బంగారు కబడ్డీలను దాచిని బెల్ట్‌ని శరీరానికి కట్టుకుని ఉన్నట్లు అధికారులు గుర్తించి ఆమెను అరెస్ట్ చేశారు.

అయితే, విచారణ సంమయంలో రన్యా రావు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారుల ముందు తాను నిర్దోషి అని చెప్పడం కొనసాగించింది. విచారణ సమయంలో విలపించినట్లు తెలిసింది. నేరాన్ని అంగీకరించిన తర్వాత కూడా మరో కొత్త కోణాన్ని వెల్లడించింది. తన వద్ద నుంచి 17 బంగారు కబడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు అంగీకరించింది. ఆమె దుబాయ్ మాత్రమే కాకుండా యూరప్, అమెరికా, మిడిల్ ఈస్ట్ కూడా ప్రయాణించినట్లు చెప్పింది. పరస్పర విరుద్ధ వాదనలను విచారణలో వెల్లడించింది.

అయితే, ఈ వాదనలతో నటి తనకు తెలియకుండానే స్మగ్లింగ్ రాకెట్‌లో చిక్కుకుందా..? ఆమె తెలిసే ఇదంతా చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రన్యా తాను ట్రాప్ చేయబడినట్లు అధికారుల ముందు చెప్పినట్లు తెలుస్తోంది. రన్యా నిజంగానే ఈ రాకెట్‌లో చిక్కుకున్నట్లయితే, దీని వెనక ఎవరున్నారనే దానిపై ఆమె వివరాలు వెల్లడించాలని, ఎలా చిక్కుకుందో చెప్పాలని అధికారులు చెబుతున్నారు.

గతేడాది చెన్నైలో జరిగిన స్మగ్లింగ్‌ సంఘటనతో ఈ కేసుకు కొన్ని పోలికలు ఉన్నాయి. కేరళకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భార్య దుబాయ్ నుంచి 12 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడింది. గోల్డ్ స్మగ్లింగ్‌లో పాల్గొన్న ఆమె ఫ్రెండ్, ఆమెని బ్లాక్‌మెయిల్ చేశాడని దర్యాప్తులో తేలింది. అయితే, రన్యా సంపన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, స్మగ్లింగ్‌లో పట్టుబడటం కూడా కొంత అనుమానాలకు కారణమవుతోంది. ఆమె భర్త జతిన్ హుక్కురి కూడా యూకేలోని ఐటీ కంపెనీలో ఉన్నత పదవిలో ఉన్నారు. చెన్నై కేసు మాదిరిగానే ఆమెని ట్రాప్ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

దర్యాప్తులో ఆమెతో నిరంరతం సంప్రదింపులు జరిపిన వ్యక్తుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఆమె వద్ద నుంచి మొబైల్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం స్మగ్లింగ్ నెట్వర్క్ వెనక ఉన్న ప్రధాన సూత్రధారి కోసం అధికారులు అన్వేషణ ముమ్మరం చేశారు. రెండేళ్లుగా రన్యా రావు ఆర్థిక లావాదేవీలను, బ్యాంక్ రికార్డులను పరిశీలిస్తున్నారు. స్మగ్లింగ్ ద్వారా రన్యా రావు ఏవైనా ఆస్తుల్ని కూడబెట్టిందా..? అని పరిశీలిస్తున్నారు.

కర్ణాటకలోని చిక్‌మగళూరుకు చెందిన రన్యా రావు, సినిమా రంగంలోకి రాకముందు బెంగళూరులోని దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఇంజినీరింగ్ చదివారు. ఆమె 2014లో కన్నడ చిత్రం మాణిక్యతో నటిగా అరంగేట్రం చేసింది. ఇందులో ఆమె ఒక ధనవంతురాలైన యువతిగా, కథానాయకుడి ప్రేమ ఆసక్తిగా నటించింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) కన్నడ నటి రన్యా రావును, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్) రామచంద్ర రావు కుమార్తెను మార్చి 3న కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA)లో బంగారం స్మగ్లింగ్ ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక ఉల్లంఘనలకు సంబంధించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట ఆమెను మంగళవారం హాజరుపరచగా, న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. విమానాశ్రయంలో, నటి వద్ద 14.8 కిలోల బంగారం పట్టుబడింది.

మాణిక్య, పటాకి వంటి చిత్రాలలో కనిపించినందుకు రన్యా రావు బాగా పేరుగాంచింది. పలు మీడియా కథనాల ప్రకారం, ఆమె డీజీపీ రావు సవతి కుమార్తె. కర్ణాటకలోని చిక్‌మగళూరుకు చెందిన రన్యా రావు, సినిమా రంగంలోకి రాకముందు బెంగళూరులోని దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఇంజినీరింగ్ చదివారు.

ఆమె 2014లో సుదీప్ దర్శకత్వం వహించిన, నటించిన కన్నడ చిత్రం మాణిక్యతో నటిగా అరంగేట్రం చేసింది. ఇందులో ఆమె ఒక ధనవంతురాలైన యువతిగా, కథానాయకుడి ప్రేమ ఆసక్తిగా నటించింది. ఆమె 2016లో విక్రమ్ ప్రభు నటించిన వాగాతో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. 2017లో, ఆమె నటుడు గణేష్‌తో కలిసి జర్నలిస్టుగా పటాకి చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమకు తిరిగి వచ్చింది. ఆమె ఫేస్‌బుక్ బయోలో తనను తాను “అన్వేషి, యాత్రికురాలు, నక్షత్రాలను చూసే వ్యక్తి, సూర్యాస్తమయాన్ని ప్రేమించే వ్యక్తి”గా అభివర్ణించుకుంది.

రన్యా రావును సోమవారం రాత్రి అరెస్టు చేసి ఆర్థిక నేరాలకు సంబంధించిన ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. అక్కడ ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ నుండి వచ్చింది. ఆమె తరచూ విదేశాలకు వెళ్లడం వల్ల ఆమెపై నిఘా ఉంచారు. ఆమె తన దుస్తుల్లో బంగారు కడ్డీలను దాచిపెట్టి, ఎక్కువ మొత్తంలో బంగారం ధరించి స్మగ్లింగ్ చేసిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆమె 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్ సందర్శించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమె తిరిగి వచ్చినప్పుడు లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ నిర్వహించారు.

రన్యా రావు తన పరిచయాలను ఉపయోగించి కస్టమ్స్ తనిఖీలను తప్పించుకోవాలని చూసిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆమె కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కుమార్తెనని చెప్పి, స్థానిక పోలీసులు తనను ఇంటికి తీసుకెళ్లాలని కోరినట్లు సమాచారం. ఆమె చర్యల గురించి ఆమె ఐపీఎస్ బంధువులతో సహా ఏవైనా చట్ట అమలు సిబ్బందికి తెలుసా లేదా వారు అనుకోకుండా ఆమెకు మద్దతు ఇచ్చారా అని కూడా అధికారులు విచారిస్తున్నారు. ఆమె ఒంటరిగా పనిచేసిందా లేదా దుబాయ్, భారతదేశం మధ్య పనిచేస్తున్న విస్తృత స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో భాగమా అని అధికారులు పరిశీలిస్తున్నారు.

Tags: #gold#RanyaRao
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

 Chhaava : ‘ఛావా’ మూవీ రివ్యూ

Next Post

ICC Champions Trophy 2025: వ్యూహాత్మక మార్పులతో టీమిండియా!

Related Posts

Telangana : పట్టణ రాజకీయాలకు స్టార్ట్ సిగ్నల్.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌తో పెరిగిన రాజకీయ వేడి!
Big Story

Telangana : పట్టణ రాజకీయాలకు స్టార్ట్ సిగ్నల్.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌తో పెరిగిన రాజకీయ వేడి!

Kavitha : “సంతోష్ రావుపై కవిత సంచలన ఆరోపణలు.. బీఆర్ఎస్‌లో అంతర్గత చిచ్చు?”
Big Story

Kavitha : “సంతోష్ రావుపై కవిత సంచలన ఆరోపణలు.. బీఆర్ఎస్‌లో అంతర్గత చిచ్చు?”

Money: 400 కోట్ల కంటైనర్ మాయం..ఎక్కడంటే?
Big Story

Money: 400 కోట్ల కంటైనర్ మాయం..ఎక్కడంటే?

Andhra Pradesh: 77వ గణతంత్ర దినోత్సవం అమరావతిలో వైభవం.. రాజధానిలో మార్పు స్పష్టమైంది
Andhra Pradesh

Andhra Pradesh: 77వ గణతంత్ర దినోత్సవం అమరావతిలో వైభవం.. రాజధానిలో మార్పు స్పష్టమైంది

Chiranjeevi : దేశానికి గర్వకారణమైన క్షణం: పద్మ విజేతలకు చిరంజీవి ప్రశంసల జల్లు
Entertainment

Chiranjeevi : దేశానికి గర్వకారణమైన క్షణం: పద్మ విజేతలకు చిరంజీవి ప్రశంసల జల్లు

TVK : తమిళనాడులో ‘విజిల్’ మోగింది: ఒంటరి పోరుకు దళపతి విజయ్ సమరశంఖం
Big Story

TVK : తమిళనాడులో ‘విజిల్’ మోగింది: ఒంటరి పోరుకు దళపతి విజయ్ సమరశంఖం

Next Post
ICC Champions Trophy 2025: వ్యూహాత్మక మార్పులతో టీమిండియా!

ICC Champions Trophy 2025: వ్యూహాత్మక మార్పులతో టీమిండియా!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

YS Jagan: జగన్ షాక్ ఇవ్వనున్న మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ దంపతులు..?

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Telangana : పట్టణ రాజకీయాలకు స్టార్ట్ సిగ్నల్.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌తో పెరిగిన రాజకీయ వేడి!

Telangana : పట్టణ రాజకీయాలకు స్టార్ట్ సిగ్నల్.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌తో పెరిగిన రాజకీయ వేడి!

Kavitha : “సంతోష్ రావుపై కవిత సంచలన ఆరోపణలు.. బీఆర్ఎస్‌లో అంతర్గత చిచ్చు?”

Kavitha : “సంతోష్ రావుపై కవిత సంచలన ఆరోపణలు.. బీఆర్ఎస్‌లో అంతర్గత చిచ్చు?”

Money: 400 కోట్ల కంటైనర్ మాయం..ఎక్కడంటే?

Money: 400 కోట్ల కంటైనర్ మాయం..ఎక్కడంటే?

Andhra Pradesh: 77వ గణతంత్ర దినోత్సవం అమరావతిలో వైభవం.. రాజధానిలో మార్పు స్పష్టమైంది

Andhra Pradesh: 77వ గణతంత్ర దినోత్సవం అమరావతిలో వైభవం.. రాజధానిలో మార్పు స్పష్టమైంది

Recent News

Telangana : పట్టణ రాజకీయాలకు స్టార్ట్ సిగ్నల్.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌తో పెరిగిన రాజకీయ వేడి!

Telangana : పట్టణ రాజకీయాలకు స్టార్ట్ సిగ్నల్.. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌తో పెరిగిన రాజకీయ వేడి!

Kavitha : “సంతోష్ రావుపై కవిత సంచలన ఆరోపణలు.. బీఆర్ఎస్‌లో అంతర్గత చిచ్చు?”

Kavitha : “సంతోష్ రావుపై కవిత సంచలన ఆరోపణలు.. బీఆర్ఎస్‌లో అంతర్గత చిచ్చు?”

Money: 400 కోట్ల కంటైనర్ మాయం..ఎక్కడంటే?

Money: 400 కోట్ల కంటైనర్ మాయం..ఎక్కడంటే?

Andhra Pradesh: 77వ గణతంత్ర దినోత్సవం అమరావతిలో వైభవం.. రాజధానిలో మార్పు స్పష్టమైంది

Andhra Pradesh: 77వ గణతంత్ర దినోత్సవం అమరావతిలో వైభవం.. రాజధానిలో మార్పు స్పష్టమైంది

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info