రామగిరి మండలం, ఏడుగుర్రాలపల్లి పల్లి లో మైనర్ బాలిక పై జరిగిన అత్యాచారం కేసులో నిందితులు అరెస్టు…
సత్య సాయి జిల్లా, రామగిరి మండలం, ఏడుగుర్రాలపల్లి గ్రామంలో మైనర్ బాలిక పై జరిగిన అత్యాచారం కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ శ్రీమతి వి.రత్న ఐపీఎస్ గారు వెల్లడించారు.సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్ తో కలిసి కేసు వివరాలను విలేకరుల సమావేశంలో ఎస్పీ గారు తెలియజేశారు .ధర్మవరం సబ్ డివిసనల్ పోలీస్ అధికారి అయిన B.హేమంత్ కుమార్ గారు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది అన్నారు.
అరెస్టైన నిందితులు:
1,అచ్చంపల్లి వర్ధన్, వయస్సు: 21 సంవత్సరాలు, తండ్రి పేరు: ఏ. నాగేంద్, కులం: బోయ, వృత్తి: సెక్యూరిటీ (సోలార్ కంపెనీలో), R/o: డోర్ నెం. 5-28, ఎడుగుర్రలపల్లి గ్రామం, రామగిరి మండలం
2,తలారి మురళి, వయస్సు: 25 సంవత్సరాలు, తండ్రి పేరు: టి. ముత్యాలన్న, కులం: బోయ, వృత్తి: ఎలెక్ట్రికల్ మెకానిక్, డోర్ నెం. 2-175, బి.సి.కాలనీ, పేరూరు గ్రామం, రామగిరి మండలం.
3,బడగోర్ల నందవర్ధన్ రాజ్ @ నందా, వయస్సు: 23 సంవత్సరాలు, తండ్రి పేరు: బి. హనుమంతు,
కులం: బోయ, వృత్తి: సాగు (వ్యవసాయం), డోర్ నెం. 5-137, ఎడుగుర్రలపల్లి గ్రామం, రామగిరి మండలం
4,అరెంచేరు నాగరాజు @ హర్యానా చెరువు నాగరాజు, వయస్సు: 51 సంవత్సరాలు, తండ్రి పేరు: ఎ. మారెప్ప, కులం: బోయ, వృత్తి: సాగు (వ్యవసాయం), డోర్ నెం. 5-182, ఎడుగుర్రలపల్లి గ్రామం, రామగిరి మండలం
5,బోయ సంజీవ, వయస్సు: 40 సంవత్సరాలు, తండ్రి పేరు: మృతుడు బి. హనుమంతప్ప, కులం: బోయ, వృత్తి: కూలీ, డోర్ నెం. 5-193, ఎడుగుర్రలపల్లి గ్రామం, రామగిరి మండలం.
6,బుడిదా రాజన్న, వయస్సు: 49 సంవత్సరాలు, తండ్రి పేరు: బి. రామన్న, కులం: బోయ, వృత్తి: కూలీ,
చిరునామా: ఎడుగుర్రలపల్లి గ్రామం, రామగిరి మండలం.
అరెస్టు వివరాలు:
నిందితులను 09.06.2025 న అరెస్టు చేయడం జరిగినది.
కేసు వివరణ:
సత్య సాయి జిల్లాలో 15 ఏళ్ల బాలికపై 6 వ్యక్తులు వేరు వేరుగా వివిధ సమయాలలో శారీరక దాడులు చేసి అత్యాచారం చేసిన ఘటనలో, పోలీసులు కఠిన చర్యలు తీసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి, వర్ధన్, గిరి, రాజేష్, అంజి, మురళి, హేమంత్, కార్తీక్ మరియు కొంత మంది నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీసుల సమర్థమైన చర్యలతో ఈ ఘటనపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం ప్రారంభమైంది.ఈ కేసులోని నిందితులపై మరింత కఠినమైన కేసులు నమోదు చేసి, విచారణ చేపడుతున్నట్లు ఎస్పీ గారు తెలిపారు.ఇందులో కొంతమంది నిందితులు ఇంతకు పూర్వం మైనర్ బాలికలు గర్భాలు తీయించినట్లు, సమాచారం ఉందని ఫిర్యాదు చేయడానికి పోలీసుల వద్దకు వెల్లనీయకుండా ప్రజలను భయ బ్రాంతులకు గురి చేసినట్లు సమాచారం , దాని మీద కూడా సమగ్ర మైన దర్యాప్తు చేపట్టామన్నారు.
ఈ ఘటనపై మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు రామగిరి పి.ఎస్., Cr.No.21/2025 U/s 115(2), 351(2), 96, 87, 77, 238, 308(5), 65 r/w 3(5) BNS and Sec.5, 5(j)(ii), 5(l) r/w 6 of POCSO Act–2012 and Sec.3(1)(w)(ii), Sec.3(2)(v) of SC/ST (POA) Act–2015 and Sec.66E, 67, 67A of IT Act-2000 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
దర్యాప్తు & నిందితుల అరెస్టు:
ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ధర్మవరం డిఎస్పి గారి పర్యవేక్షణలో, రామగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ V. శ్రీధర్ గారి నేతృత్వంలో, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు శ్రమించి, నిందితులను గుర్తించి, అరెస్టు చేయడం జరిగింది. మిగిలిన ముద్దాయిల అరెస్టు కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు
, త్వరలోనే మిగిలిన ఈ కేసులో నిందితులను అరెస్టు చేస్తామని ఎస్పీ గారు వెల్లడించారు. మహిళలు చిన్నారులపై జరిగే నేరాలను అరికట్టే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు తెలియజేశారు .