• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Narendra Modi: ఆపరేషన్‌ సిందూర్‌తో నా జన్మ ధన్యం

Narendra Modi: ఆపరేషన్‌ సిందూర్‌తో నా జన్మ ధన్యం

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా, ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కొనసాగుతూనే ఉంటుందని భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా జమ్మూకాశ్మీర్ లో “ఆపరేషన్ కెల్లర్” చేపట్టింది భారత్ సైన్యం. పక్కా సమాచారంతో మొదలుపెట్టిన ఈ ఆపరేషన్ లో రిజల్ట్ వచ్చిందని ఆర్మీ ప్రకటించింది.

అవును… పాక్ లో చివరి ఉగ్రవాది అంతమయ్యే వరకూ ఆపరేషన్ సిందూర్ ఆగదన్నట్లుగా చెబుతున్న భారత్.. ఈ క్రమంలో మరికొన్ని ఆపరేషన్స్ ని షురూ చేస్తుంది. ఇందులో భాగంగా… తాజాగా మంగళవారం పోషియన్ లోని జిన్ పథర్ కెల్లర్ ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎన్ కౌంటర్ జరిగింది.

ఈ ఎన్ కౌంటర్ లో కనీసం ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారని ఆర్మీ ప్రకటించింది. అందులో ఒక ఉగ్రవాది స్థానిక నివాసి అయిన షాహిద్ అని గుర్తించినట్లు వర్గాలు తెలిపాయి. రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ నుంచి వచ్చిన పక్కా నిఘా సమాచారం మేరకు సైన్యం ఎన్ కౌంటర్ స్థలం పేరు మీద “ఆపరేషన్ కెల్లర్”ను ప్రారంభించింది. ఈ సందర్భంగా స్పందించిన ఆర్మీ… రాష్ట్రీయ రైఫిల్స్ ఇచ్చిన పక్కా నిఘా సమాచారం ఆధారంగా ఇండియన్ ఆర్మీ ఒక సెర్చ్, విధ్వంస ఆపరేషన్ ప్రారంభించిందని.. ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులకు సైన్యానికి జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపింది. ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని వెల్లడించింది.

మరోవైపు… పహల్గాం దాడికి కారణమని భావిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులు.. ఆదిల్ హుస్సేన్ థోకర్, అలీ భాయ్, హషీం మూసాల కోసం “టెర్రర్ ఫ్రీ కాశ్మీర్” పోస్టర్లను భద్రతా సంస్థలు ఏర్పాటు చేశాయి. పోషియన్ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఈ పోస్టర్లు అతికించబడ్డాయి. వీరికి సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి రూ.20 లక్షల రివార్డు ప్రకటించారు.

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కొన్ని కీలక ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి. భారత్ మీద ఉగ్రదాడికి దన్నుగా ఉండే పాకిస్తాన్ కు మిత్రుడిగా ఉండేందుకు ఎలాంటి మొహమాటం లేకుండా ముందుకు వచ్చాయి ఆ జాబితాలో తుర్కియా (టర్కీ), అజర్‌బైజాన్, చైనా దేశాలు నిలిచాయి. చైనా మొదట్లో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించినా..కీలక సమయంలో మాత్రం తమ పూర్తి మద్దతు పాకిస్తాన్ కే అన్న విషయాన్ని స్పష్టం చేశాయి. మరి.. భారత్ విషయానికి వస్తే.. తాజా ఉద్రిక్తల వేళ ఓపెన్ గా తన మద్దతు ప్రకటించింది ఇజ్రాయెల్ మాత్రమే. నేపాల్.. భూటాన్… శ్రీలంక.. మాల్దీవులు లాంటి దేశాలు తమ మద్దతును తెలిపినప్పటికీ అవి చాలా చిన్న దేశాలు కావటం.. వాటి బలం పరిమితంగా ఉండటంతో వారి మిత్రత్వాన్ని చాలామంది గుర్తించలేని పరిస్థితి.

భారత్ కు సుదీర్ఘ కాల మిత్రుడిగా వ్యవహరిస్తున్న రష్యా సైతం తాజా పరిణామాల్లో బలమైన గొంతును వినిపించలేదు కానీ.. తన మద్దతు ఉంటుందన్న సంకేతాన్ని పంపింది. కొద్ది కాలంగా ఉక్రెయిన్ తో ఆ దేశానికి నడుస్తున్న యుద్ధం నేపథ్యంలో భారత్ లోని పరిస్థితుల్లో తాను అండగా ఉంటానన్న మాట చెప్పటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఆ మాటకు వస్తే.. ఇప్పుడు ఆ దేశం అర్జెంట్ గా ఉక్రెయిన్ తో లెక్కలు తేల్చుకోవటానికే అధిక ప్రాదాన్యత ఇస్తారన్నది మర్చిపోకూడదు.

 

భారత్ – పాక్ మధ్య తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో బలమైన మిత్రులను గుర్తించటం.. మారితో మనకున్న స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. పాక్ విషయంలోనే మనకు ఏర్పడిన ఇబ్బందుల్ని చూసినప్పుడు.. ప్రమాదకర శత్రువైన చైనాతో తేడా వచ్చినప్పుడు భారత శక్తి సామర్థ్యాలు మాత్రమే కాదు.. మిత్రుల అండ చాలా అవసరం ఉంది ఇలాంటి వేళ.. భారత్ తన సహజ మిత్రుల్ని గుర్తించటం.. వారితో బలమైన స్నేహబంధానని బలోపేతం చేసుకునేలా ప్రణాళికల్ని సిద్దం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

అదే సమయంలో భారత్ కు మంచి మిత్రుడి హోదాలో ఉండే అగ్రరాజ్యం అమెరికాను ఆ లిస్టులో నుంచి తీసేయాల్సిన అవసరం ఉంది. అమెరికా ప్రయోజనాలకు.. అవసరాలను తీర్చే వరకు మాత్రమే ఆ దేశానికి భారత్ తో పని ఉంటుంది. ఆ దేశానికి భావోద్వగ బంధం కంటే కూడా వాణిజ్య అవసరాలకే పెద్దపీట వేస్తుందన్నది వాస్తవం. ఇలాంటి వేళలో.. భారత్ కు మంచి స్నేహితులుగా ఎవరున్నారు? అన్నది ప్రశ్న. దీనికి సమాధానం వెతికినప్పుడు కొన్ని దేశాలు కనిపిస్తాయి. అవన్నీ భారత్ తో స్నేహ పూర్వకంగా ఉండటమే కాదు.. భారత్ తో సంబంధాల్ని మరింత బలోపేతం చేసుకోవటానికి ఆసక్తిని చూపుతాయన్నది మర్చిపోకూడదు.

భారతదేశానికి నిజమైన మిత్రదేశంగా గుర్తించేందుకు కొన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యమైనది భారత ప్రయోజనాలకు మద్దతు ఇవ్వటం.. అంతర్జాతీయ వేదికలపై భారత్ కు బాసటగా నిలిచే ధైర్యాన్ని ప్రదర్శించం.. ఆర్థిక.. సాంకేతిక.. రక్షణ.. లాంటి కీలక అంశాల్లో సహకరించే సత్తా ఉండటం..భారత్ పట్ల సామరస్యాన్ని ప్రదర్శించటం.. భారత వ్యతిరేక శక్తుల విషయంలో భారత్ కు అండగా నిలిచే దేశాల్ని ఎంపిక చేసుకోవాల్సిన అవససరం ఉంది. ఇదంతా చదివిన తర్వాత అలాంటి దేశాలు ఉన్నాయా? అన్న ప్రశ్న కలగొచ్చు. తరచి చూడాలే కానీ అలాంటి దేశాలు లేకపోలేదు.

రష్యానే తీసుకుంటే చారిత్రాత్మక మిత్రుడు.. సాంకేతికంగా మనకెంతో దన్నుగా నిలవటమే కాదు.. అప్పటికి ఇప్పటికి భారత్ కు దన్నుగా నిలిచేందుకు వెనుకాడడు. నిజానికి అమెరికా మత్తులో పడి రష్యాతో స్నేహం కాస్త తగ్గినప్పటికీ.. ఆ దేశం మాత్రం భారత్ విషయంలో ప్రత్యేక స్నేహితుడిగానే చూడటం కనిపిస్తుంది. రక్షణ పరంగా చూసినప్పుడు ఇప్పటికి ఆ దేశానికి చెందిన సాంకేతికను అత్యధికంగా మనం వాడుతున్నామన్నది మర్రచిపోకూడదు. ఇటీవల కాలంలో భారత దేశం అగ్రరాజ్యం అమెరికాకు దగ్గర అవుతున్న వేళ.. రష్యా – చైనాల మధ్య స్నేహం ముదిరి పాకాన పడుతుంది. ఈ విషయాన్ని గుర్తించి భారత్ తన తీరును కాస్త మార్చుకోవాల్సిన అవసరం ఉంది. భారత్ కు మరో నమ్మకస్తుడైన స్నేహితుడిగా ఫ్రాన్స్ ను పరిగణించొచ్చచు. ఈ దేశంతో రఫేల్ యుద్ధ విమానాల విషయంలో కుదుర్చుకున్న డీల్.. రెండు దేశాల్ని మరింత సన్నిహితంగా మార్చిందన్నది మర్చిపోకూడదు. అంతరిక్షం.. ఆణుశక్తి.. సైనిక అంశాల్లో ఆ దేశం భారత్ దన్నుగా నిలుస్తోంది. కశ్మీర్ అంశంలో భారత్ కు మద్దతు ఇచ్చే దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. అంతేకాదు.. భారత సముద్ర తీరంలో వ్యూహాత్మక మిత్రుడిగా వ్యవహరిస్తుంది.

భారత్ ఏ మాత్రం తక్కువ చూడకూడని మిత్రుల్లో జపాన్ ఒకటి. ఈ దేశం భారత్ తో సన్నిహితంగా ఉంటుంది. దీనికి కారణం చైనాతో ఆ దేశానికి ఉండే పంచాయితీనే. ఆర్థికంగా.. సాంకేతికంగా ఎంతో బలమైన ఈ దేశంతో భారత్ తన బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికాతో చేసే వాణిజ్యంలో కొంత భాగాన్ని తగ్గించుకొని జపాన్ తో చేయటం ద్వారా ఇరు దేశాల మధ్య స్నేహబంధం మరింత బలంగా మారుతుందన్నది మర్చిపోకూడదు. ఈ దేశం బాహాటంగా తన మద్దతు ఇవ్వదు. కానీ.. భారత్ విశ్వసించే దేశాల్లో ఒకటిగా నిలిచే మిత్రదేశమని చెప్పొచ్చు.

మరి.. అమెరికా సంగతి ఏమిటి? అన్నది ఇక్కడ ప్రశ్నగా మారుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు అమెరికాతో మనకున్న బంధాన్ని మార్చుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ కారణంగా పరిస్థితుల్లో కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు. దీర్ఘకాల ప్రయోజనాల్ని చూసినప్పుడు ఆ దేశంతో ఇప్పుడున్న బంధాన్ని కొనసాగించటం మంచిదే. అలా అని ఆ దేశం మీద ఎక్కువగా ఆధారపడటం భారతదేశ భవిష్యత్ ప్రయోజనాలకు ఎలాంటి మేలు చేయదు. అమెరికాతో ఇప్పుడున్న బంధాన్ని కొనసాగిస్తూనే.. ఆ దేశంతో భావోద్వేగ బంధం కంటే వాణిజ్య అవసరాల కోణంలోనే చూడాల్సి ఉంటుంది. అదే సమయంలో అమెరికా అవసరాలకు ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తన మాట వినకుంటే ఇబ్బందులు తప్పవన్న బెదిరింపు మాటలు భారత్ ను ఉద్దేశించి చేసేందుకు జంకేలా మనం మారాల్సిన అవసరం ఉంది. మొత్తంగా ఆపరేషన్ సిందూర్.. భారత భవిష్యత్తుకు కొత్త లక్ష్యాల్ని నిర్దేశించేలా చేసిందని మాత్రం చెప్పక తప్పదు. చివరగా.. మిత్రుల మధ్య స్నేహంలో అవసరాలు.. ప్రయోజనాలు తక్కువగా ఉండొచ్చు. కానీ.. దేశాల మధ్య బంధాలు బలోపేతానికి మాత్రం అవసరాలు.. పరస్పర ప్రయోజనాలే కీలకమన్న విషయాన్ని అస్సలు మరవకూడదు.

 

OPERATION KELLER

On 13 May 2025, based on specific intelligence of a #RashtriyasRifles Unit, about presence of terrorists in general area Shoekal Keller, #Shopian, #IndianArmy launched a search and destroy Operation. During the operation, terrorists opened heavy fire and fierce… pic.twitter.com/KZwIkEGiLF

— ADG PI – INDIAN ARMY (@adgpi) May 13, 2025

Tags: #ArmyOperations#CounterTerrorism#IndiaFightsTerror#IndianArmy#IndianDefense#JammuAndKashmir#NationFirst#OperationKeller#OperationSindoor#SaluteIndianArmy#SecurityForces
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

AP LIQUOR SCAM : ఎవరీ బాలాజీ గోవిందప్ప?

Next Post

AP MLC: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ జకియా ఖానమ్‌

Related Posts

Delhi: కాలం చెల్లిన వాహనాలకు పెట్రోల్​.. డీజిల్​ బంద్
Big Story

Delhi: కాలం చెల్లిన వాహనాలకు పెట్రోల్​.. డీజిల్​ బంద్

Adani: మేఘా  కొనుగోలుకు అదానీ చర్చలు?
Latest

Adani: మేఘా కొనుగోలుకు అదానీ చర్చలు?

Danush: మనసులో కోరిక బయటపెట్టిన ధనుష్!
Entertainment

Danush: మనసులో కోరిక బయటపెట్టిన ధనుష్!

Raja Singh: మీకో దండం.. మీ పార్టీకో దండం
Big Story

Raja Singh: మీకో దండం.. మీ పార్టీకో దండం

Pashamylaram Factory: సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం..21కి చేరిన మృతుల సంఖ్య
Big Story

Pashamylaram Factory: సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం..21కి చేరిన మృతుల సంఖ్య

Ap Liquor Scam: పోలీసు కస్టడీకి చెవిరెడ్డి
Andhra Pradesh

Ap Liquor Scam: పోలీసు కస్టడీకి చెవిరెడ్డి

Next Post
AP MLC: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ జకియా ఖానమ్‌

AP MLC: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసిన డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ జకియా ఖానమ్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Delhi: కాలం చెల్లిన వాహనాలకు పెట్రోల్​.. డీజిల్​ బంద్

Delhi: కాలం చెల్లిన వాహనాలకు పెట్రోల్​.. డీజిల్​ బంద్

Adani: మేఘా  కొనుగోలుకు అదానీ చర్చలు?

Adani: మేఘా కొనుగోలుకు అదానీ చర్చలు?

Danush: మనసులో కోరిక బయటపెట్టిన ధనుష్!

Danush: మనసులో కోరిక బయటపెట్టిన ధనుష్!

Raja Singh: మీకో దండం.. మీ పార్టీకో దండం

Raja Singh: మీకో దండం.. మీ పార్టీకో దండం

Recent News

Delhi: కాలం చెల్లిన వాహనాలకు పెట్రోల్​.. డీజిల్​ బంద్

Delhi: కాలం చెల్లిన వాహనాలకు పెట్రోల్​.. డీజిల్​ బంద్

Adani: మేఘా  కొనుగోలుకు అదానీ చర్చలు?

Adani: మేఘా కొనుగోలుకు అదానీ చర్చలు?

Danush: మనసులో కోరిక బయటపెట్టిన ధనుష్!

Danush: మనసులో కోరిక బయటపెట్టిన ధనుష్!

Raja Singh: మీకో దండం.. మీ పార్టీకో దండం

Raja Singh: మీకో దండం.. మీ పార్టీకో దండం

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info